IND vs PAK: ఆసియా కప్లో భారత్–పాక్ మ్యాచ్ జరిగేది డౌటే?.. సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు
- భారత్–పాక్ మ్యాచ్పై కొనసాగుతున్న అనిశ్చితి..
- పాకిస్తాన్తో మ్యాచ్పై భారత ఆటగాళ్లను విమర్శించొద్దు..
- బీసీసీఐ ప్రభుత్వ ఆదేశాలకే లోబడి ఉంటుంది: సునీల్ గావస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: ఆసియా కప్ కోసం భారత జట్టు తన స్క్వాడ్ను నిన్న ( ఆగస్టు 19న) ప్రకటించింది. పాకిస్తాన్ కూడా ఇప్పటికే జట్టును వెల్లడించింది. అయితే, ఇండియా – పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అభిమానులకు అనుమానంగా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశంతో క్రికెట్ సంబంధాలనూ తెంచుకోవాలనే డిమాండ్లు భారీగా వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో పాక్తో మ్యాచ్ ను రద్దు చేసుకుంది. ఇప్పుడు ఆసియా కప్లో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఇందులో ఎలాంటి డౌట్స్ వద్దని.. కేంద్ర సర్కార్ ఏం చెబితే దానిని బీసీసీఐ, టీమిండియా ఫాలో అవుతుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తెలిపారు. ఇలాంటప్పుడు ఆటగాళ్లపై ఎవరూ విమర్శలు చేయొద్దని సూచించారు.
Read Also: Delhi: ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. పోలీసులు తనిఖీలు
Also Read
- India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
అయితే, పాకిస్తాన్తో మ్యాచ్పై భారత సర్కార్ నిర్ణయం తీసుకుంటే.. దానిని అందరూ అనుసరించాల్సిందేనని సునీల్ గావస్కర్ తెలిపారు. ఇందులో ప్లేయర్స్ ను మాత్రం తిట్టడం మంచిది కాదన్నారు. వెంటనే కొందరు ప్లేయర్లపై కామెంట్లు చేయడానికి రెడీ అయిపోతారని పేర్కొన్నాడు. కానీ, ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి., ప్లేయర్స్ బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ చేసుకుని ఉంటారు. కాగా, బీసీసీఐ మాత్రం కేంద్రం ఆదేశాలను పాటిస్తుంది అని వెల్లడించారు. కాబట్టి, ఇదంతా భారత ప్రభుత్వంపై ఆధారపడింది. ఈ విషయంలో ఆటగాళ్లు ఏం చేయలేరు.. ఇప్పుడు ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించారు.. ‘మీరు వెళ్లి ఆడండి’ అని కేంద్రం చెబితే పాక్ తో కూడా ఆడాల్సిందే.. అలాకాకుండా ‘వద్దు మీరు ఆడేందుకు పర్మిషన్ ఇవ్వం’ అని చెబితే.. దానికి తగినట్టుగానే బీసీసీఐ ముందుకు నడుస్తుంది.. కాబట్టి, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని గావస్కర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?