IND vs PAK: ఆసియా కప్లో భారత్–పాక్ మ్యాచ్ జరిగేది డౌటే?.. సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు
- భారత్–పాక్ మ్యాచ్పై కొనసాగుతున్న అనిశ్చితి..
- పాకిస్తాన్తో మ్యాచ్పై భారత ఆటగాళ్లను విమర్శించొద్దు..
- బీసీసీఐ ప్రభుత్వ ఆదేశాలకే లోబడి ఉంటుంది: సునీల్ గావస్కర్
IND vs PAK: ఆసియా కప్ కోసం భారత జట్టు తన స్క్వాడ్ను నిన్న ( ఆగస్టు 19న) ప్రకటించింది. పాకిస్తాన్ కూడా ఇప్పటికే జట్టును వెల్లడించింది. అయితే, ఇండియా – పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అభిమానులకు అనుమానంగా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశంతో క్రికెట్ సంబంధాలనూ తెంచుకోవాలనే డిమాండ్లు భారీగా వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో పాక్తో మ్యాచ్ ను రద్దు చేసుకుంది. ఇప్పుడు ఆసియా కప్లో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఇందులో ఎలాంటి డౌట్స్ వద్దని.. కేంద్ర సర్కార్ ఏం చెబితే దానిని బీసీసీఐ, టీమిండియా ఫాలో అవుతుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తెలిపారు. ఇలాంటప్పుడు ఆటగాళ్లపై ఎవరూ విమర్శలు చేయొద్దని సూచించారు.
Read Also: Delhi: ఢిల్లీ స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. పోలీసులు తనిఖీలు
Also Read
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
- Asia Cup 2025 Trophy: ఆసియా కప్ ట్రోఫీతో పీసీబీ చీఫ్ పరార్.. సిగ్గులేదంటూ ఫాన్స్ ఫైర్!
అయితే, పాకిస్తాన్తో మ్యాచ్పై భారత సర్కార్ నిర్ణయం తీసుకుంటే.. దానిని అందరూ అనుసరించాల్సిందేనని సునీల్ గావస్కర్ తెలిపారు. ఇందులో ప్లేయర్స్ ను మాత్రం తిట్టడం మంచిది కాదన్నారు. వెంటనే కొందరు ప్లేయర్లపై కామెంట్లు చేయడానికి రెడీ అయిపోతారని పేర్కొన్నాడు. కానీ, ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి., ప్లేయర్స్ బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ చేసుకుని ఉంటారు. కాగా, బీసీసీఐ మాత్రం కేంద్రం ఆదేశాలను పాటిస్తుంది అని వెల్లడించారు. కాబట్టి, ఇదంతా భారత ప్రభుత్వంపై ఆధారపడింది. ఈ విషయంలో ఆటగాళ్లు ఏం చేయలేరు.. ఇప్పుడు ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించారు.. ‘మీరు వెళ్లి ఆడండి’ అని కేంద్రం చెబితే పాక్ తో కూడా ఆడాల్సిందే.. అలాకాకుండా ‘వద్దు మీరు ఆడేందుకు పర్మిషన్ ఇవ్వం’ అని చెబితే.. దానికి తగినట్టుగానే బీసీసీఐ ముందుకు నడుస్తుంది.. కాబట్టి, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని గావస్కర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!