Gautam Gambhir: కోహ్లీ ఫ్యాన్స్ కు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతమ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ ను చూపించాడు. అయితే, ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో మైదానం నుంచి గంభీర్ వెళ్లిపోతున్నప్పుడు ఆయనను చూసి అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ గట్టిగా అరిచారు.. ఈ స్లోగన్స్తో కోపానికి గురైన గంభీర్.. కోహ్లీ అభిమానుల వైపు మిడిల్ ఫింగర్ చూపిస్తూ.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోహ్లీ ఫ్యాన్స్తో పాటు క్రికెట్ ప్రేమికులు గంభీర్ తీరును తప్పుబడుతున్నారు.
Read Also: Harihara Veeramallu : మూవీ రిలీజ్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
ఓ మాజీ క్రికెటర్గా.. పార్లమెంట్ మెంబర్గా ఉన్న గౌతమ్ గంభీర్ ఇలా దిగజారి ప్రవర్తించడం సరికాదని సదరు క్రికెటర్లు మండిపడుతున్నారు. కోహ్లీపై కోపం ఉంటే ఇలా అభిమానులపై చూపించడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఫ్యాన్స్ హద్దులు ధాటితే.. మాజీ క్రికెటర్గా హుందాగా ప్రవర్తించాలని మాజీ క్రికెటర్లు కామెంట్ చేస్తున్నారు. ఇక, ఆసియాకప్ 2023 టోర్నీకి గౌతమ్ గంభీర్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నారు. భారత్-నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ఆ టైంలో మైదానంలోకి వెళ్లిన గంభీర్.. మైదాన పరిస్థితులని వివరించి తిరుగు ముఖం పట్టే సమయంలో ఈ ఘటన జరిగింది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ పున:ప్రారంభమవ్వగా.. నేపాల్ ఆలౌట్ దిశగా కొనసాగుతోంది.
Read Also: Kerala: మద్యానికి బానిసై ముగ్గురు కూతుళ్ల గొంతు కోసిన తండ్రి
పాకిస్థాన్తో రద్దయిన తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఔటైన తీరును గంభీర్ తప్పుబట్టాడు. చెత్త షాట్తో వికెట్ పారేసుకున్నాడని ఆయన విమర్శించాడు. ఈ కామెంట్స్ నేపథ్యంలోనే గంభీర్ కనిపించగానే విరాట్ అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ స్లోగన్స్ చేశారు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా కూడా ఈ ఇద్దరి మధ్య మైదానంలోనే గొడవ జరిగింది.
— Out Of Context Cricket (@OutofConCricket) September 4, 2023
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!