Asia Cup: ఆసియాకప్ లో ఇండియా పాక్ మ్యాచ్ డేట్ రిలీజ్
- దాయాదుల పోరు సెప్టెంబర్ 7న దుబాయ్లో..?
- పహల్గామ్ దాడి తర్వాత మొదటి ఇండియా-పాక్ మ్యాచ్కి ఆసక్తి
- ఆసియా కప్ షెడ్యూల్ను ప్రకటించేందుకు సన్నాహాలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది.
నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇటు చూసే మ్యాచ్ ఇది. ఎప్పుడు ఈ దాయాది పోరు జరిగినా,నరాలు తెగే ఉత్కంఠ లాస్ట్ బాల్ వరకు ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో టోర్నీ రాబోతుంది. అవును ఆసియా కప్ 2025 ని సెప్టెంబర్ లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికి సోనీ టీవీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.ఇక జులై మొదటి వారంలో షెడ్యూల్ ను రిలీజ్ చేసే అవకాశం వుంది.ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇక ఈ జట్లు తలపడే ఛాన్సులు మూసుకుపోయినట్టే అని భావించారు. ఎందుకంటే బీసీసీఐ కూడా ఐసీసీకి ఒక లేఖ రాసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 జట్లను ఒకే గ్రూపులో పెట్టవద్దని.. మరి ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ లీగ్ నిర్వహిస్తోంది కాబట్టి రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందా అనే అనుమానాలు వున్నాయి.అంతేకాదు కొద్దీ రోజుల క్రితం ఇండియా ఆసియా కప్ నుండి తప్పుకోనున్నట్లు వార్తలొచ్చాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
Perni Nani: వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్య.. పేర్ని నాని ఫైర్..
మరి ఇప్పుడు డేట్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. పైగా ఈ ఆతిధ్య హక్కులు కూడా మన దగ్గరే వున్నాయి కాబట్టి మనవాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చినీయాంశంగా మారింది.ఇప్పుడు సెప్టెంబర్ 7న దుబాయ్ వేదికగా ఈ దాయాది పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉగ్రదాడి తర్వాత జరిగే మొదటి మ్యాచ్ కావడంతో హైప్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందువరకు ఈ దాయాధి పోరు తటస్థ వేదికలో జరిగేలా ప్లాన్ చేసారు. అందుకే మన మ్యాచులన్నీ దుబాయ్ లో జరిగాయి.మరి ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఆశలు సన్నగిల్లాయి. కానీ ఇప్పుడొస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిగురించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏం చెపుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఆసియా కప్ నిర్వహిస్తే మళ్ళీ ఈ మ్యాచ్ 3వ వేదికలో ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ టోర్నీ టి20 ఫార్మాట్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ టీ20 World Cup వుంది కాబట్టి… అయితే ఆ వరల్డ్ కప్ నిర్వహించే హక్కులు కూడా మన దగ్గరే వున్నాయి. మరి దీనిపై మనవాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!