Asia Cup: ఆసియాకప్ లో ఇండియా పాక్ మ్యాచ్ డేట్ రిలీజ్
- దాయాదుల పోరు సెప్టెంబర్ 7న దుబాయ్లో..?
- పహల్గామ్ దాడి తర్వాత మొదటి ఇండియా-పాక్ మ్యాచ్కి ఆసక్తి
- ఆసియా కప్ షెడ్యూల్ను ప్రకటించేందుకు సన్నాహాలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది.
నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇటు చూసే మ్యాచ్ ఇది. ఎప్పుడు ఈ దాయాది పోరు జరిగినా,నరాలు తెగే ఉత్కంఠ లాస్ట్ బాల్ వరకు ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో టోర్నీ రాబోతుంది. అవును ఆసియా కప్ 2025 ని సెప్టెంబర్ లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికి సోనీ టీవీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.ఇక జులై మొదటి వారంలో షెడ్యూల్ ను రిలీజ్ చేసే అవకాశం వుంది.ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇక ఈ జట్లు తలపడే ఛాన్సులు మూసుకుపోయినట్టే అని భావించారు. ఎందుకంటే బీసీసీఐ కూడా ఐసీసీకి ఒక లేఖ రాసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 జట్లను ఒకే గ్రూపులో పెట్టవద్దని.. మరి ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ లీగ్ నిర్వహిస్తోంది కాబట్టి రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందా అనే అనుమానాలు వున్నాయి.అంతేకాదు కొద్దీ రోజుల క్రితం ఇండియా ఆసియా కప్ నుండి తప్పుకోనున్నట్లు వార్తలొచ్చాయి.
Also Read
- IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
Perni Nani: వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్య.. పేర్ని నాని ఫైర్..
మరి ఇప్పుడు డేట్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. పైగా ఈ ఆతిధ్య హక్కులు కూడా మన దగ్గరే వున్నాయి కాబట్టి మనవాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చినీయాంశంగా మారింది.ఇప్పుడు సెప్టెంబర్ 7న దుబాయ్ వేదికగా ఈ దాయాది పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉగ్రదాడి తర్వాత జరిగే మొదటి మ్యాచ్ కావడంతో హైప్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందువరకు ఈ దాయాధి పోరు తటస్థ వేదికలో జరిగేలా ప్లాన్ చేసారు. అందుకే మన మ్యాచులన్నీ దుబాయ్ లో జరిగాయి.మరి ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఆశలు సన్నగిల్లాయి. కానీ ఇప్పుడొస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిగురించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏం చెపుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఆసియా కప్ నిర్వహిస్తే మళ్ళీ ఈ మ్యాచ్ 3వ వేదికలో ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ టోర్నీ టి20 ఫార్మాట్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ టీ20 World Cup వుంది కాబట్టి… అయితే ఆ వరల్డ్ కప్ నిర్వహించే హక్కులు కూడా మన దగ్గరే వున్నాయి. మరి దీనిపై మనవాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?