Ashes series 2025: ఇంగ్లాండ్ను 5-0తో ఆస్ట్రేలియా వైట్వాష్ చేస్తుంది..
- ఈ ఏడాది చివరలో ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్..
- ఇంగ్లాండ్ను 5-0తో ఓడించి ఆస్ట్రేలియా వైట్వాష్ చేస్తుందని మెక్గ్రాత్ జోస్యం..
- ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తుంది.. ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవరు: మెక్గ్రాత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashes series 2025: త్వరలోనే ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ మరోసారి తనదైన ట్రేడ్మార్క్ జోస్యం చెప్పుకొచ్చారు. రాబోయే 2025-26 యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ను 5-0 తేడాతో వైట్వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక, స్వదేశీ పరిస్థితులు, స్థిరమైన జట్టు కూర్పుతో మా జట్టు బలంగా ఉందన్నారు. నాకు అంచనాలు వేయడం అరుదే కానీ ఈసారి 5-0తోనే సిరీస్ దక్కించుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఆసీస్ బౌలింగ్ తమ విజయానికి కీలకంగా మారుతుందన్నారు. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, నాథన్ లియాన్ లాంటి బలమైన బౌలింగ్ లైనప్ గుర్తించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, స్వదేశీ పిచ్లపై వీరు ఆడితే ప్రత్యర్థికి గెలవడం చాలా కష్టమే.. ఇంగ్లాండ్ గత రికార్డును దృష్టిలో ఉంచుకుంటే, ఒక్క టెస్టు కూడా గెలవలేరు అని గ్లెన్ మెక్గ్రాత్ ఎద్దేవా చేశారు.
Read Also: Musalamma: శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి 30 లక్షల రూపాయలతో కరెన్సీ అలంకరణ..!
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
అయితే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో భాగంగా ఇంగ్లాండ్ తో నవంబర్ 21వ తేదీన ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్కు ఆస్ట్రేలియా హోం టూర్ కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో బేన్ స్టోక్స్ సేన మాత్రం తమ పేలవంగా కనిపిస్తుంది. 2010-11 సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాలో ఒక్క టెస్టు కూడా ఇంగ్లాండ్ గెలవలేదు.. అప్పట్లో ఆండ్రూ స్ట్రాస్ నాయకత్వంలో 3-1 తేడాతో ఘన విజయం సాధించారు. ఇక, ఆ తరువాత రెండు వైట్వాష్లు (2006-07, 2013-14), 2017-18లో 4-0 తేడాతో ఆస్త్రేలియా చేతిలో ఇంగ్లీష్ జట్టు ఓడిపోయింది. కాగా, 2023 యాషెస్ సిరీస్ను ఇంగ్లాండ్ తమ స్వదేశంలో 2-2తో డ్రాగా ముగించింది.
Read Also: Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్, వాల్మార్ట్.. భారత్ స్టాక్ నిలిపివేత!
ఇక, 2015 నుంచి యాషెస్ ట్రోఫీని ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు సాధించలేకపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బౌన్స్తో కూడిన పిచ్లను స్టోక్స్ సేన దృష్టి పెట్టుకుని తమ వ్యూహాలను మార్చుకుంటుంది. ఈసారి ఆతిథ్య జట్టును ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది. ఇక, మెక్గ్రాత్ చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరిత పోటీ కొనసాగబోతుంది.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?