Akash Chopra: మయాంక్ను కెప్టెన్ చేయొద్దు.. చేస్తే తప్పదు భారీ మూల్యం
Akash Chopra On Mayank Agarwal SRH Captaincy: ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అతడ్ని కెప్టెన్గా నియమించాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. కేన్ విలియమ్సన్ను రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఆ జట్టుకి కెప్టెన్ లేకపోవడం, మయాంక్కి ఆల్రెడీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉండటంతో.. అతడినే కెప్టెన్ చేయాలని ఎస్ఆర్హెచ్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. అతడ్ని కెప్టెన్ చేయొద్దంటూ తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బాంబ్ పేల్చాడు. ఒకవేళ అతడ్ని కెప్టెన్ చేస్తే, ఆ ఒత్తిడికి అతడు సరిగ్గా ఆడలేడని అతని అభిప్రాయం. మయాంక్ని కాకుండా భువనేశ్వర్ కుమార్ని కెప్టెన్ చేస్తే, బాగుంటుందని సూచిస్తున్నాడు.
Waltair Veerayya: ఆ తప్పు రిపీట్ చెయ్యకూడదనే మైత్రీ ఆ నిర్ణయం తీసుకుందా?
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
తన యూట్యూబ్ ఛానెల్లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘మయాంక్ ఒక గొప్ప ఆటగాడు. అతడు చాలా ఆడతాడు. కానీ.. అతడు కెప్టెన్గా ఉన్న సీజన్లో మాత్రం పరుగులు సాధించలేదు. కెప్టెన్సీ అనే బాధ్యత అతనిపై ఒత్తిడిని పెంచి, పరుగులు చేయనివ్వకుండా చేసింది. కాబట్టి, ఈసారి అతడ్ని కెప్టెన్ చేయొద్దు. ఒకవేళ కెప్టెన్ చేస్తే మాత్రం, అతడు ఆ ఒత్తిడికి పరుగులు చేయలేక, మునుపటిలాగే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచే అవకాశం ఉంది. మయాంక్కి బదులు భువనేశ్వర్ కుమార్ని కెప్టెన్ చేయాలి. మయాంక్ కేవలం ఒక ఆప్షన్ మాత్రమే’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఆకాశ్ చోప్రా చెప్పినట్లుగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నప్పుడు మయాంక్ పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. మరోవైపు.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. ఏరికోరి మరీ మినీ వేలంలో మయాంక్తో పాటు హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ.5.25 కోట్లు)లను భారీ రేట్లకు కొనుగోలు చేసింది. మరి, ఈసారి సన్రైజర్స్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
CM Stalin: ‘రాహుల్ ప్రసంగం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది’ : జోడో యాత్రపై స్టాలిన్ ప్రశంసలు
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!