Pet Dog Funeral: కన్నబిడ్డలా సాకి.. కన్నీటితో వీడ్కోలు.. పెంపుడు కుక్కకు ‘మనుషుల’ తరహాలో అంత్యక్రియలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pet Dog Funeral: మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో, జంతువుల పట్ల కొందరు మనుషులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కపై చూపిన అచంచలమైన ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 14 ఏళ్లు తమతో పాటు ఉన్న కుక్క మరణిస్తే.. కేవలం మట్టిలో పాతిపెట్టడం కాకుండా, ఒక మనిషి చనిపోతే నిర్వహించే అన్ని మతపరమైన ఆచారాలను ఆ కుటుంబం పూర్తి చేసింది.
READ ALSO: Neena Gupta : సెట్లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
ఘనశ్యామ్ దీక్షిత్ అనే వ్యక్తి ఆగ్రాలోని షాహ్దారా బాగ్లో నివాసం ఉంటున్నారు. ఆయన 14 ఏళ్ల క్రితం ఢిల్లీ నుంచి ఒక లాబ్రడార్ రిట్రీవర్ జాతి కుక్కను పెంచుకోవడానికి తెచ్చుకున్నారు. దానికి ‘టైగర్’ అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఆ మూగజీవి వారి ఇంట్లో ఒక పెంపుడు జంతువులా కాకుండా, ఆ కుటుంబంలో పెద్ద కొడుకులా కలిసిపోయింది. టైగర్ ప్రతిరోజూ నుదుటిన తిలకం దిద్దుకునేది, అందుకే స్థానికులు దానిని ఆప్యాయంగా “తిలక్ధారి టైగర్” అని పిలిచేవారు. గత నెలలో టైగర్ ఆరోగ్యం ఉన్నట్లుండి క్షీణించింది. ఆహారం తీసుకోవడం మానేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఖరీదైన చికిత్సను కూడా అందించారు. కానీ వయసు పైబడటం వల్ల జనవరి 28న టైగర్ తుదిశ్వాస విడిచింది. టైగర్ మరణం ఆ కుటుంబాన్ని ఎంతగా కలచివేసిందంటే.. ఘనశ్యామ్ దీక్షిత్ పెద్ద కొడుకు రెండు రోజుల పాటు అన్నం కూడా ముట్టుకోలేదు. ఆ కుటుంబం మొత్తం వారి ఇంట్లో ఒకరు మరణిస్తే ఎంతలా తల్లడిల్లిపోతారో అంతలా బాధపడ్డారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. టైగర్ ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. టైగర్ మరణవార్త విన్న వెంటనే, ఆ చుట్టుపక్కల ఉంటున్న వారందరూ వారి ఇంటికి చేరుకున్నారు. ఆ మూగజీవి మృతదేహానికి నివాళులు అర్పించి, ఆ పరిసరాల గుండా ఒక అంత్యక్రియల ఊరేగింపు నిర్వహించారు. తరువాత బులంద్షహర్లోని రాజ్ఘాట్లో టైగర్ అంత్యక్రియలు జరిపించారు. అంత్యక్రియల అనంతరం టైగర్ను పెంచిన కుటుంబ సభ్యులు తల వెంట్రుకలు కత్తిరించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీని తరువాత పదమూడవ రోజు కర్మ నిర్వహించారు. టైగర్ ఆత్మ శాంతి కోసం హవనాన్ని నిర్వహించారు. పదమూడు మంది బ్రాహ్మణులను భోజానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఘనశ్యామ్ దీక్షిత్ మాట్లాడుతూ.. “టైగర్ మా ఇంట్లో 14 ఏళ్లు ఉన్నాడు. వాడు వెళ్ళిపోయాక ఇల్లు చిన్నబోయింది. ఆ శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మా ఇంట్లో మనిషి చనిపోతే ఎలా చేస్తామో, అలాగే వాడికి గౌరవంగా వీడ్కోలు పలికాము” అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన జంతువుల పట్ల ఉండవలసిన కరుణను, ఆప్యాయతను చాటిచెబుతోంది. ఈ రోజుల్లో కుక్కలను కేవలం కాపలా కోసమో లేదా ఫ్యాషన్ కోసమో పెంచుకునే వారు ఉన్నప్పటికీ, ఆగ్రాలోని ఈ కుటుంబం మాత్రం పెంపుడు జంతువు కూడా కుటుంబంలో భాగమేనని నిరూపించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
READ ALSO: Sharad Pawar: అప్పుడు అబ్బాయి.. ఇప్పుడు బాబాయి! క్షీణించిన శరద్ పవార్ హెల్త్..
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!