Punjab Kesari: లాలా లాజపత్ రాయ్ జయంతి.. బ్రిటీష్ పాలకుల గడగడలాడించిన సింహం.!
- పంజాబ్ కేసరి లాలా లాజపత్ రాయ్ జయంతి
- స్వాతంత్ర్యానికి ఊపిరినిచ్చిన లాల్-బాల్-పాల్ త్రయం
- సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలో రక్తపాతం
- విప్లవకారులకు స్ఫూర్తిగా నిలిచిన త్యాగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lala Lajpat Rai Birth Anniversary: భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ‘లాల్-బాల్-పాల్’ త్రయం గురించి వినని వారు ఉండరు. అందులో అత్యంత శక్తివంతమైన నాయకుడు, పంజాబ్ కేసరిగా పిలవబడే లాలా లాజపత్ రాయ్. 1865, జనవరి 28న పంజాబ్లోని మోగా జిల్లాలో జన్మించిన ఆయన, తన మాటలతో, చేతలతో దేశవ్యాప్తంగా విప్లవ జ్వాలలను రగిలించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి పోరాటాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
లాల్-బాల్-పాల్ త్రయంలో కీలక శక్తి
లాలా లాజపత్ రాయ్ అతివాద నాయకుడిగా పేరుగాంచారు. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్లతో కలిసి ఆయన స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు. కేవలం విజ్ఞప్తులతో స్వాతంత్ర్యం రాదని, పోరాడి సాధించుకోవాలని నమ్మిన వ్యక్తి ఆయన. స్వదేశీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, విదేశీ వస్తువులను బహిష్కరించడంలో ఆయన చేసిన కృషి అనన్యం. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఆయన పత్రికలను, విద్యాలయాలను వేదికగా చేసుకున్నారు.
Also Read
- Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
- Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే 'డెడ్లీ' లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపన , విద్యా సేవలు
లాలా లాజపత్ రాయ్ కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. భారతీయుల ఆర్థిక స్వావలంబన కోసం 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వదేశీ బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని ఆ రోజుల్లోనే ఆయన కలలు గన్నారు. అలాగే, దయానంద సరస్వతి బోధనలకు ప్రభావితుడై ‘ఆర్య సమాజ్’లో చేరి, అనేక విద్యా సంస్థల స్థాపనకు (DAV Schools) పునాదులు వేశారు.
సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం – అమరత్వం
1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు “సైమన్ గో బ్యాక్” అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. లాహోర్లో జరిగిన నిరసన ప్రదర్శనకు లాలా లాజపత్ రాయ్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో బ్రిటీష్ పోలీసులు జరిపిన క్రూరమైన లాఠీ ఛార్జీలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాలతోనే పోరాడుతూ 1928, నవంబర్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు. చనిపోయే ముందు ఆయన అన్న “నా శరీరంపై పడే ప్రతి లాఠీ దెబ్బ, బ్రిటీష్ సామ్రాజ్య శవపేటికకు కొట్టే ఒక్కో మేకు లాంటిది.” మాటలు చరిత్రలో నిలిచిపోయాయి..
లాలా లాజపత్ రాయ్ మరణం దేశవ్యాప్తంగా విప్లవకారులను ఉర్రూతలూగించింది. భగత్ సింగ్ వంటి యువ వీరులు ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఆయన త్యాగం, ధైర్యం నేటికీ కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకం. దేశం కోసం సర్వస్వం ధారపోసిన ఆ పంజాబ్ కేసరికి ఘన నివాళులు అర్పిద్దాం.
తాజావార్తలు
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!