పాతికేళ్ళ ‘మావిచిగురు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం ‘మావిచిగురు’. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో, ‘మావిచిగురు’ ఆరంభం నుంచీ ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిన ‘మావిచిగురు’ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది.
భర్తంటే ప్రాణం పెట్టే కథానాయిక, తాను ఎక్కువ రోజులు జీవించనని తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో తన భర్తకు మరో పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ, భార్యంటే ప్రాణంగా భావించే కథానాయకుడు అందుకు అంగీకరించడు. తాను కన్నుమూసేలోగా ఎలా భర్తను ఆమె రెండో పెళ్ళికి ఒప్పించింది అన్నదే ‘మావిచిగురు’ చిత్రకథ. అంతకు ముందు జగపతిబాబు, ఆమని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’లో డబ్బు కోసం భర్తను మరో స్త్రీకి ఇచ్చి పెళ్ళి చేస్తుంది నాయిక. అందులో భార్యగా నటించిన ఆమని, ఇందులోనూ జగపతిబాబుతో జోడీ కట్టింది. అయితే ‘మావిచిగురు’లో తన భర్తకు తాను దూరమైనా, ఓ తోడు ఉండాలని తపించే పాత్రలోనూ ఆమని జీవించింది. అలా ‘మావిచిగురు’ సైతం జనాన్ని ఆకట్టుకోగలిగింది.
Also Read
- World's First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
‘మావిచిగురు’ చిత్రంలో రంజిత, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, ఆలీ, అల్లు రామలింగయ్య, శివాజీరాజా, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, శివపార్వతి, నిర్మలమ్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి దివాకర్ బాబు సంభాషణలు అలరించాయి. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చగా, సిరివెన్నెల, భువనచంద్ర పాటలు రాశారు. సదాశివ బ్రహ్మేంద్ర రాసిన “మానస సంచరరే…” గీతాన్ని సందర్భానికి అనువుగా ఉపయోగించుకున్నారు. “మావిచిగురు తిని నీకు శుభమని…”, “కోదండరాముడంట…”, “కొమ్మన కులికే కోయిల…”, “కొండమల్లి…కొండమల్లి…”, “మాట ఇవ్వమ్మా చెల్లి…” పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన “రంజు భలే రామ్ చిలకా…” పాట భలేగా వినోదం పంచింది. ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి పి.ఉషారాణి నిర్మాత. ఈ చిత్రాన్ని మళయాళంలో “కుంకుమచెప్పు”గా, తమిళంలో “తోడరుమ్” పేరుతో రీమేక్ చేశారు.
(మే 30తో ‘మావిచిగురు’కు 25 ఏళ్ళు)
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?