పాతికేళ్ళ ‘మావిచిగురు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం ‘మావిచిగురు’. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో, ‘మావిచిగురు’ ఆరంభం నుంచీ ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిన ‘మావిచిగురు’ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది.
భర్తంటే ప్రాణం పెట్టే కథానాయిక, తాను ఎక్కువ రోజులు జీవించనని తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో తన భర్తకు మరో పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ, భార్యంటే ప్రాణంగా భావించే కథానాయకుడు అందుకు అంగీకరించడు. తాను కన్నుమూసేలోగా ఎలా భర్తను ఆమె రెండో పెళ్ళికి ఒప్పించింది అన్నదే ‘మావిచిగురు’ చిత్రకథ. అంతకు ముందు జగపతిబాబు, ఆమని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’లో డబ్బు కోసం భర్తను మరో స్త్రీకి ఇచ్చి పెళ్ళి చేస్తుంది నాయిక. అందులో భార్యగా నటించిన ఆమని, ఇందులోనూ జగపతిబాబుతో జోడీ కట్టింది. అయితే ‘మావిచిగురు’లో తన భర్తకు తాను దూరమైనా, ఓ తోడు ఉండాలని తపించే పాత్రలోనూ ఆమని జీవించింది. అలా ‘మావిచిగురు’ సైతం జనాన్ని ఆకట్టుకోగలిగింది.
Also Read
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
- Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
‘మావిచిగురు’ చిత్రంలో రంజిత, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, ఆలీ, అల్లు రామలింగయ్య, శివాజీరాజా, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, శివపార్వతి, నిర్మలమ్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి దివాకర్ బాబు సంభాషణలు అలరించాయి. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చగా, సిరివెన్నెల, భువనచంద్ర పాటలు రాశారు. సదాశివ బ్రహ్మేంద్ర రాసిన “మానస సంచరరే…” గీతాన్ని సందర్భానికి అనువుగా ఉపయోగించుకున్నారు. “మావిచిగురు తిని నీకు శుభమని…”, “కోదండరాముడంట…”, “కొమ్మన కులికే కోయిల…”, “కొండమల్లి…కొండమల్లి…”, “మాట ఇవ్వమ్మా చెల్లి…” పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన “రంజు భలే రామ్ చిలకా…” పాట భలేగా వినోదం పంచింది. ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి పి.ఉషారాణి నిర్మాత. ఈ చిత్రాన్ని మళయాళంలో “కుంకుమచెప్పు”గా, తమిళంలో “తోడరుమ్” పేరుతో రీమేక్ చేశారు.
(మే 30తో ‘మావిచిగురు’కు 25 ఏళ్ళు)
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!