CARE Hospitals : కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి మీడియా వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కేర్ ఆస్పత్రి కార్డియాక్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వంలో వైద్య బృందం.. 50 ఏళ్ల రోగి హేమంత్ కు కేవలం ధమని అంటుకట్టులను ఉపయోగించి నాలుగు రెట్ల కరోనరీ బైపాస్ సర్జరీని చేశారు. హేమంత్ గతంలో తన ఎడమ ప్రధాన కరోనరీకి స్టంట్ లను వేయించుకున్నారు కూడా, అయితే మూడు నెలల్లోనే అడ్డంకి ఏర్పడింది.
ఢిల్లీకి చెందిన హేమంత్, ఛాతి నొప్పితో బాధపడుతూ గతంలో ఢిల్లీలోనే కరోనరి యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షలో అతని ఎడమ ప్రధాన, ఇతర కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఉన్నట్లు వెల్లడైంది, దీంతో వైద్యులు సెంట్లు వేశారు. అయితే మూడు నెలల్లోనే మరలా చాతి నొప్పి తలెత్తడంతో అతను బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందాలని నిర్ణయించుకున్నారు.
Also Read
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
- Padmam Silver Jewellery: అనకాపల్లిలో పద్మం సిల్వర్ జువెలరీ ఘనంగా ప్రారంభం
ఈ క్రమంలో హేమంత్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ ను సంప్రదించారు. ఇక్కడ సైతం కరోనరీ యాంజియోగ్రఫీ వైద్య పరీక్షలు చేశారు. మూడు నెలల వ్యవధిలోనే స్టంటులలో అడ్డంకులను గమనించిన డాక్టర్ ప్రతీక్.. రోగి ప్రాణాపాయ స్థితిని అంచనా వేశారు. దీంతో రోగికి నాలుగు రెట్ల క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. వెంటనే డాక్టర్ ప్రతీక్ నిపుణులైన వైద్య బృందంతో కలిసి రోగికి ఆ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఎలాంటి కాలు కోతలు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. సర్జరీ అనంతరం 36 గంటల్లోనే రోగి నడవగలగడమే కాక మెట్లను సైతం ఎక్కే శక్తిని పొందారు. ఈ క్రమంలో వైద్యులు రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ మాట్లాడుతూ, ద్వైపాక్షిక అంతర్గత క్షీరథ ధమని (బీఐఎంఏ) సాంకేతికత ఉపయోగించి చేసే మొత్తం ధమనుల కరోనరీ బైపాస్ శస్త్ర చికిత్స.. కరోనరీ ఆర్టరీ అడ్డంకులు ఉన్న రోగులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ప్రామాణిక కరోనరీ బైపాస్ సర్జరీలో బీఐఎంఏ సాంకేతికతతో నిర్వహించే ఈ విధానం వల్ల ప్రమాదం 1 శాతం కంటే తక్కువ అన్నారు. ఈ విధానం ఉత్తమమైనదని, రోగులు భయపడకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. రోగి హేమంత్ మాట్లాడుతూ ప్రస్తుత ఆరోగ్య స్థితి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేర్ ఆస్పత్రిని ఎంచుకొని మంచి పని చేశారని అన్నారు. కేర్ ఆస్పత్రి హెచ్ సి ఓ ఓ నీలేష్ గుప్తా మాట్లాడుతూ, తమ ఆసుపత్రి ద్వారా అధునాతన సాంకేతికత కలిగిన శస్త్ర చికిత్సలను రోగులకు చేరువచేశామన్నారు. మా తరపున రోగులకు నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు
- Tags
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!