భూ వివాదంలో హైకోర్టుకు వెళ్లిన అధికార పార్టీ మంత్రి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో ఉంటే అన్నీ కాళ్ల దగ్గరకు వస్తాయని అనుకుంటారు. అందులోనూ మంత్రిగా ఉంటే ఇక చెప్పేది ఏముంది? కానీ.. ఆ మంత్రి మాత్రం డిఫరెంట్గా ఆలోచించారో ఏమో… భూమి హక్కుకోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంపై పిటిషన్ వేశారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా భూమి కథా?
సీఎస్ ఇతర అధికారులు ప్రతివాదులుగా హైకోర్టులో మంత్రి గంగుల పిటిషన్!
Also Read
తెలంగాణ ప్రభుత్వం భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా సంస్కరణలు చేపట్టింది. ఇందులో బాగంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఒక భూ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే ఇప్పుడు అధికార వర్గాల్లోనూ.. అధికార పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది. మంత్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ కలెక్టర్, వక్ఫ్బోర్డులను చేర్చారు. స్వయంగా రాష్ట్ర మంత్రి ఈ విధంగా భూమి హక్కుల కోసం హైకోర్టు తలుపు తట్టడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.
భూ హక్కుల కోసం గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు!
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని 126 సర్వే నెంబర్లో 15 ఎకరాల భూమిని మంత్రి గంగుల కమలాకర్ గతంలోనే కొనుగోలు చేశారట. అదే భూమిపై 95 లక్షల రుణం తీసుకుని బ్యాంకుకు చెల్లించినట్టు సమాచారం. అయితే మంత్రి చెబుతున్న భూమి తమదే అంటోంది వక్ఫ్బోర్డు. తగాదాలు రావడంతో కొంతమంది రైతులతోపాటు గంగుల కూడా భూ హక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు ఇస్తూ వచ్చారు.
హాట్ టాపిక్గా మంత్రి గంగుల నిర్ణయం
ఇప్పుడీ భూమిని వక్ఫ్ ల్యాండ్గా పరిగణిస్తూ.. భూ రిజిస్ట్రేషన్ విభాగం నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దాంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారట గంగుల. గతంలో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలలో సదరు భూమిపై మంత్రి గంగులకు హక్కు ఉందని తేల్చారట. వక్ఫ్ బోర్డు ఈ భూమిని డీ నోటిఫై చేయకపోవడం వల్లే సమస్య వచ్చిందని హైకోర్టులో వేసిన పిటిషన్లో మంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మంత్రి పిటిషన్పై హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో ఏమో..ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ సందర్బంగా హాట్ టాపిక్గా మారింది.
ఈ సమస్య నుంచి బయటపడతారా?
ధరణిపైనా.. భూమి హక్కుల నిర్ధారణపైనా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంలో మంత్రి గంగుల కమలాకర్ సైతం భాగస్వామి. అందుకే ఇప్పుడు గంగుల చర్యలు చర్చకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే రాజకీయంగా వైరిపక్షాల నుంచి టీఆర్ఎస్లోని స్వపక్షాల నుంచి ఇబ్బంది పడుతున్న గంగుల కమలాకర్..ఈ సమస్య నుంచి బయటపడతారో? వివాదం మరిన్ని మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!