మంత్రి పదవుల కోసం ఆశీస్సులు తీసుకుంటున్న వైసీపీ నేతలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ పలుకు.. జగదాంబ పలుకులపై వైసీపీ నేతలకు గురి పెరిగిందా? మంత్రి పదవి ఆశిస్తున్నవారంతా ఉత్తరాంధ్రలో ఎక్కడో మారు మూల ప్రాంతంలోఉన్న ఓ పల్లెటూరుకు క్యూ కడుతున్నారా? ఇంతకీ ఆ గ్రామంలో ఏముంది? వైసీపీ నేతలకు ఎందుకంత నమ్మకం?
దేవుడమ్మ లలిత ఆశీసుల కోసం రోజా రాక..!
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఎక్కడో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్య వలస గ్రామంలో ఒక్కసారిగా తళుక్కుమన్నారు. పార్టీ ప్రచారానికి వచ్చారని అనుకోవడానికి ఇప్పుడేమీ విజయనగరం జిల్లాలో ఎన్నికలు లేవు. కానీ.. రోజా వచ్చిన ఉద్దేశం వేరు. పాపయ్య వలసలో దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీసుల కోసం వచ్చారమె. ఒక్క రోజానే కాదు.. వైసీపీలో ముఖ్యులు అనుకున్నవారికి ఈ ప్రాంతం సుపరిచితమే. ఇక్కడ దేవుడమ్మ లలిత ఆశీసులు తీసుకుంటే రాజకీయంగా ఉన్నత పదవులు పొందొచ్చన్నది వారి నమ్మకం. అందుకే రోజాతోపాటు మంత్రి పదవి ఆశిస్తున్న వైసీపీ కీలక నాయకులు ఇటీవల పాపయ్య వలసలో వాలిపోతున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీకి 150 సీట్లు వస్తాయని చెప్పారట..!
దేవుడమ్మ లలితకు అమ్మవారు ఆవహిస్తారని.. ఆ సమయంలో ఆమె చెప్పింది నిజం అవుతుందని స్థానికులు అనుకుంటూ ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మను పార్టీ నేతలు ఇక్కడికి తీసుకొచ్చారట. ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు వస్తాయని దేవుడమ్మ లలిత చెప్పడం.. ఫలితాలు కూడా అదే విధంగా ఉండటంతో.. వైసీపీ నేతలకు పాపయ్య వలసపై నమ్మకం కుదిరింది. అప్పటి నుంచి అధికారపార్టీ నేతల రాక పెరిగింది. మంత్రి పదవి కావాల్సిన వారు.. రాజకీయంగా మంచి పొజిషన్ ఆశిస్తున్న వారు ఈ గ్రామానికి వచ్చి దేవుడమ్మ లలితను ప్రశ్న అడుగుతున్నారట.
దేవుడమ్మ లలిత ఆశీసులకోసం నేతల ఆరాటం..!
మంత్రి పదవి ఆశిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి.. ఇలా చాలా మంది దేవుడమ్మ లలిత ఆశీసులు పొందినవారేనట. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా వస్తుంటారని చెబుతున్నారు. వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలో చేరి.. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిడ్డి ఈశ్వరి రాజకీయ భవిష్యత్పై ఒకింత ఆందోళనతో ఉన్నారట. అందుకే దేవుడమ్మ లలిత ఆశీసులు తీసుకున్నట్టు సమాచారం.
ఆశీసులు తీసుకుని నవ్వుతూ వెళ్తున్న నేతలు..!
దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున స్పీకర్ తమ్మినేనితోపాటు.. ఎమ్మెల్యే రోజా కూడా పాపయ్య వలసకు వచ్చారు. మరి.. అమ్మ ఆశీసులు ఏంటో.. తెలియదు కానీ.. నవ్వుతూ బయటకొచ్చి.. కారెక్కి వెళ్లారని చెబుతున్నారు స్థానికులు. మొదటి విడతలోనే కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించిన రోజా, తమ్మినేనిలు ఈసారి ఛాన్స్ వస్తుందలే అని కామ్గా ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో.. దేవుడమ్మ లలిత వాక్కుపై నమ్మకం పెట్టుకున్నారు. మరి.. అంబ పలుకుల వల్ల ఎంత మందికి కేబినెట్ బెర్త్ దొరుకుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!