YCP: వైసీపీ దూకుడుకు ఆ.. జిల్లాలో సొంత నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారార..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ నెగ్గని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి వర్గపోరు తీవ్రంగానే ఉంది. పార్టీ బలోపేతానికి ఇంఛార్జ్ పదవులు చేపడుతున్న నేతలు.. కేడర్ను పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మూడుసార్లు ఇంఛార్జులను మార్చారు. అయిన్పటికీ పరిస్థితి మొదటికొస్తుంది తప్పితే మార్పు లేదట. గత ఎన్నికల్లో ఓడిన పీవీఎల్ నరసింహరాజును ఆ మధ్య ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు. తాజాగా మళ్లీ ఆయనకే పగ్గాలు ఇచ్చారు. దీంతో ఉండి వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటోంది కేడర్.
ఉండి వైసీపీ ఇంఛార్జ్గా అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఉండేవారు. ఆయన 2014లో ఓడిపోవడంతో.. 2019లో సర్రాజును కాదని.. పీవీఎల్ నరసింహారాజును బరిలో దించింది పార్టీ. ఈ మార్పూ వర్కవుట్ కాలేదు. ఉండిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని భావించిన వైసీపీ పెద్దలు నరసింహారాజును తప్పించి.. గోకరాజు రామరాజును ఇంఛార్జ్గా నియమించారు. ఏమైందో ఏమో.. రామరాజును తప్పించి మళ్లీ నరసింహరాజును తెరపైకి తీసుకొచ్చింది పార్టీ. అసలే గ్రూపుల గోలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో పీవీఎల్కు మళ్లీ ఎందుకు పగ్గాలు అప్పగించారన్నది కేడర్ ప్రశ్న. ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడూ అదే జరుగుతుందని భయపడుతున్నారట. అసలు ఈ పంచాయితీ మనకెందుకు అని భావిస్తున్న కొందరు నేతలు తాజా పరిణామాలు రుచించక పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.
Also Read
వైసీపీ గ్రామ కమిటీలలో పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా.. తనకు అనుకూలంగా ఉన్నవారికే నరసింహారాజు చోటు కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కమిటీలపై వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా సమాచారం లేదట. ఉండిలో వైసీపీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుకు క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. పీవీఎల్ నరసింహారాజు DCCB ఛైర్మన్ను చేశారు. నియోజకవర్గంలో గోకరాజు రామరాజు కుటుంబానికి పట్టు ఉంది. ఇంతచేసినా ఉండిలో వైసీపీకి తేడా కొట్టడానికి కారణం సమన్వయ లోపమే అన్నది కేడర్ చెప్పే మాట. పదవుల్లో ఉన్న నేతలు కేడర్ను చేరదీయకపోవడం.. కేడర్ విశ్వసించేలా పనులు చేపట్టకపోవడం పెద్దలోటుగా చెబుతున్నారు. ఇప్పుడు పాతరాజుగారే మళ్లీ ఇంఛార్జ్గా వచ్చారు. మరి.. గతంలోలా వర్గాలను ప్రోత్సహిస్తారో… లేక అందరినీ కలుపుకొని వెళ్తారో చూడాలి.
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!