YCP: వైసీపీ దూకుడుకు ఆ.. జిల్లాలో సొంత నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారార..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ నెగ్గని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి వర్గపోరు తీవ్రంగానే ఉంది. పార్టీ బలోపేతానికి ఇంఛార్జ్ పదవులు చేపడుతున్న నేతలు.. కేడర్ను పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మూడుసార్లు ఇంఛార్జులను మార్చారు. అయిన్పటికీ పరిస్థితి మొదటికొస్తుంది తప్పితే మార్పు లేదట. గత ఎన్నికల్లో ఓడిన పీవీఎల్ నరసింహరాజును ఆ మధ్య ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు. తాజాగా మళ్లీ ఆయనకే పగ్గాలు ఇచ్చారు. దీంతో ఉండి వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటోంది కేడర్.
ఉండి వైసీపీ ఇంఛార్జ్గా అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఉండేవారు. ఆయన 2014లో ఓడిపోవడంతో.. 2019లో సర్రాజును కాదని.. పీవీఎల్ నరసింహారాజును బరిలో దించింది పార్టీ. ఈ మార్పూ వర్కవుట్ కాలేదు. ఉండిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని భావించిన వైసీపీ పెద్దలు నరసింహారాజును తప్పించి.. గోకరాజు రామరాజును ఇంఛార్జ్గా నియమించారు. ఏమైందో ఏమో.. రామరాజును తప్పించి మళ్లీ నరసింహరాజును తెరపైకి తీసుకొచ్చింది పార్టీ. అసలే గ్రూపుల గోలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో పీవీఎల్కు మళ్లీ ఎందుకు పగ్గాలు అప్పగించారన్నది కేడర్ ప్రశ్న. ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడూ అదే జరుగుతుందని భయపడుతున్నారట. అసలు ఈ పంచాయితీ మనకెందుకు అని భావిస్తున్న కొందరు నేతలు తాజా పరిణామాలు రుచించక పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
వైసీపీ గ్రామ కమిటీలలో పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా.. తనకు అనుకూలంగా ఉన్నవారికే నరసింహారాజు చోటు కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కమిటీలపై వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా సమాచారం లేదట. ఉండిలో వైసీపీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుకు క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. పీవీఎల్ నరసింహారాజు DCCB ఛైర్మన్ను చేశారు. నియోజకవర్గంలో గోకరాజు రామరాజు కుటుంబానికి పట్టు ఉంది. ఇంతచేసినా ఉండిలో వైసీపీకి తేడా కొట్టడానికి కారణం సమన్వయ లోపమే అన్నది కేడర్ చెప్పే మాట. పదవుల్లో ఉన్న నేతలు కేడర్ను చేరదీయకపోవడం.. కేడర్ విశ్వసించేలా పనులు చేపట్టకపోవడం పెద్దలోటుగా చెబుతున్నారు. ఇప్పుడు పాతరాజుగారే మళ్లీ ఇంఛార్జ్గా వచ్చారు. మరి.. గతంలోలా వర్గాలను ప్రోత్సహిస్తారో… లేక అందరినీ కలుపుకొని వెళ్తారో చూడాలి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!