Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Who Will Go To That Program From Telugu States

Om Prakash Chautala : ఆ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేదెవరు..?

Published Date :September 14, 2022 , 11:32 am
By Premchand Chowdary
Om Prakash Chautala : ఆ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేదెవరు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Om Prakash Chautala : అంద‌రి టార్గెట్ 2024 ఎన్నిక‌లే. ఢిల్లీ పీఠం లక్ష్యంగా ఐక్యతా రాగం ఆలపించేందుకు విపక్ష పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఈ నెలలోనే ఓ భారీ కార్యక్రమానికి హర్యానా వేదిక కాబోతోంది. ఆ ప్రోగ్రామ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేదెవరు? ఎవరికి ఆహ్వానాలు అందాయి?

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు భారత్‌ జోడో పేరుతో రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీయేతర పక్షాల్లో ఐక్యత తీసుకొచ్చేందుకు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ వివిధ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యామ్నాయ అజెండా పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవడం.. 2024లో బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఢిల్లీ గడ్డపై ఏర్పాటు చేయడం. ఇంత వరకు మాటలు.. మంత్రాంగాలతో కాలం గడిచిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రయత్నాలు ఎంత వరకు కొలిక్కి వస్తాయో ఏమో.. ఈలోగా విపక్షాలకు హర్యానా పెద్ద పరీక్ష కాబోతుందనే చర్చ మొదలైంది. ఈ నెల 25న హర్యానాలో INLD అధ్యక్షుడు, మాజీ సీఎం ఓంప్రకాష్‌ చౌతాలా నిర్వహించే సమ్మాన్‌ దివస్‌ ర్యాలీపై అందరి దృష్టీ నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు చౌతాలా. ఆహ్వానాలు అందుకున్న పార్టీలు ర్యాలీకి వస్తాయా? తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీలు హాజరు కాబోతున్నాయి అనేది ప్రస్తుతం చర్చగా మారింది.

సమ్మాన్‌ దివస్‌ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆహ్వానాలు పంపారట చౌతాలా. ఈ ఇద్దరిలో సీఎం కేసీఆర్‌.. బీజేపీపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పలువురు ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను, జాతీయ పార్టీల నాయకులను కలిసి మాట్లాడుతున్నారు. సమ్మాన్‌ దివస్‌ ర్యాలీకి టీఆర్ఎస్‌ వెళ్తుందా లేదా అనే చర్చ ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే.. 2018లో NDAకు గుడ్‌బై చెప్పింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. NDAలో టీడీపీ చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో హర్యానాలో నిర్వహించే సమ్మాన్‌ దివస్‌ ర్యాలీకి టీడీపీ వెళ్తుందా.. లేదా అనే ఆసక్తి ఉంది.

దేశవ్యాప్తంగా బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ కొంత ప్రయత్నించారు. ఆ తర్వాత NCP చీఫ్‌ శరద్‌ పవార్‌ దానిని కొనసాగించారు. ఆనాటి సమావేశాల్లో ఐక్యతారాగం ఆలపించిన కొన్ని పార్టీలు వివిధ సమీకరణాల వల్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఖరి మార్చుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌, బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను ఏకతాటిపైకి తెచ్చే పనులు సాగుతున్నాయట. నితీష్‌కుమార్‌, చౌతాలా ఇటీవల ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మమతా బెనర్జీ కూడా కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. కేవలం ఇద్దరు ముగ్గురితో కాకుండా అందరితో సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందట. అలా పుట్టుకొచ్చిందే సమ్మాన్‌ దివాస్ ర్యాలీ. హర్యానాలో నిర్వహించేందుకు చౌతాలా ముందుకు కావడంతో.. 25న జరిగే ఆ కార్యక్రమంపై ఆసక్తి పెరుగుతోంది. మరి… తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bharat jodo yatra
  • bihar cm nitish
  • Narendra Modi
  • Om Prakash Chautala
  • rahul gandhi

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions