టీఆర్ఎస్ లో ‘పీకే’దెవరిని ? కునుకులేకుండా చేస్తున్న పీకే సర్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్కు పీకే టీమ్ నివేదిక ఇచ్చిందా? కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సర్వేపై చర్చ జరుగుతోంది. పీకే ఎంట్రీతో పార్టీలో ఏం జరగబోతుంది? టీఆర్ఎస్లో మార్పులు చేర్పులపై నేతల మధ్య గుసగుసలు ఉన్నాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ ప్యాక్… టిఆర్ఎస్ మధ్య ఒప్పందం ఖరారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీతో కలిసి పనిచేయనుంది ఆ సంస్థ. ఇప్పటికే పని మొదలుపెట్టిన సర్వే బృందాలు.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఇమేజ్ తెలుసుకోవడంతోపాటు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో వడపోసే పనిలో ఉందట ఐ ప్యాక్ టీం. టీఆర్ఎస్ అధినేత కేసిఆర్కు పలు నియెజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఇప్పటికే నివేదిక ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
ఇన్నాళ్లూ పీకే గురించి.. ఆయన బృందాలు ఇచ్చే సర్వే గురించి కొంత చర్చ జరిగినా.. రెండు రోజులుగా ఆ హీట్ మరింత పెరిగింది. పీకే ఇచ్చే నివేదికలు.. సర్వేలతో తమ రాజకీయ భవిష్యత్ ఏమౌతుందో అనే టెన్షన్లో ఎమ్మెల్యేలు ఉన్నారట. ఇప్పటికే రెండు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఉన్నారు. అక్కడ కొంత వ్యతిరేకత ఉంటుందని.. అదే ప్రామాణికంగా భావించి నివేదిక ఇస్తే ఎలా అన్నది MLAల ప్రశ్న. ఆ సర్వే ఆధారంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎమ్మెల్యేలలో గుబులు పట్టుకుందట. ప్రస్తుతం నియోజకవర్గంలోని గుట్టంతా హైకమాండ్కు తెలిసిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కొందరు సిట్టింగ్లు చాలా టెన్షన్లో ఉన్నట్టు సమాచారం. సరిగా నిద్రపోవడం లేదట. కనిపించిన వాళ్లను తమ రాజకీయ భవిష్యత్పై ఆరా తీసే పనిలో పడ్డారట.
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
ఒకవైపు.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఎంట్రీ దాదాపు ఖాయమన్నది కాంగ్రెస్ వర్గాల వాదన. ఆ చర్చలు జరుగుతున్న సమయంలోనే పీకే.. నేరుగా హైదరాబాద్కు వచ్చి సీఎం కేసీఆర్తో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఐప్యాక్తో కుదిరిన ఒప్పందంపై ఆరా తీస్తూనే.. పొత్తుల విషయం ఏమైనా చర్చకు వచ్చిందా అని కూపీ లాగుతున్నారట. ఒకవేళ అదే జరిగితే తమ సీటు ఎంత వరకు సేఫ్.. జరగబోయే రాజకీయ పరిణామాలపై అంచనా వేసుకునే పనిలో ఉన్నారట కొందరు సిట్టింగ్లు. అయితే పొత్తులపై టీఆర్ఎస్తోపాటు పీకే బృందాలు కూడా మౌనంగానే ఉన్నాయి.
ఇదే సమయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం గులాబీ శిబిరంలో ఆసక్తిగా మారుతోంది. కొన్ని జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై స్పష్టమైన నివేదిక ఇచ్చారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే ఐప్యాక్ సంస్థ ఇప్పటి వరకు టీఆర్ఎస్కు ఎటువంటి నివేదిక ఇవ్వలేదని తెలుస్తోంది. అప్పటి వరకు అధికారపార్టీ నేతలు రిలాక్స్ కావొచ్చని ఊపిరి పీల్చుకుంటున్నారట. మొత్తానికి గులబీ శిబిరంలో సర్వే అంశం ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి.
Watch : https://youtu.be/9uwC3vvxalI
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?