ఎవర్ని చేర్చుకోవాలి? ఎవర్ని వద్దనాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలపై చర్చ నడుస్తోంది.ఏదీ ఓ పట్టాన తేలని పార్టీలో ఇప్పుడు కొత్త నేతలు వస్తారనే దానిపై కూడా అదే స్టైల్ లో రియాక్షన్ లున్నాయి.అయితే, తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత…కొందరు పార్టీ లోకి రావడానికి సిద్దమయ్యారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్, ఆయన కుమారుడు సంజయ్,పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీలో చేరే అంశంపై చర్చ నడుస్తోంది.
ఇంతలో నిజామాబాద్, పాలమూరు జిల్లా కాంగ్రెస్ నాయకుల నుండి వ్యతిరేకత వచ్చింది.ఎవరు పడితే వాళ్ళని పార్టీలో ఎలా చేర్చుకుంటారని… కాంగ్రెస్ కి నష్టం చేసిన డీఎస్ కుటుంబాన్ని ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నలు వినిపించాయి.
చేరికల కోసం మాజీ పిసిసి చీఫ్ అధ్యక్షతన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.మొన్నటి రాహుల్ గాంధీ సమావేశం లో ఈ కమిటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.తాజాగా జానారెడ్డి చైర్మన్ గా ఏఐసీసీ ఆరుగురిలో కమిటీ వేసింది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
జానారెడ్డి ఈ కమిటీ చైర్మన్ గా ఉంటే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, మాజీ చీఫ్ లు పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉన్నారు.
అయితే, ఎవర్ని చేర్చుకోవాలి? ఎవర్ని వద్దనాలి…ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తున్న పంచాయితీ
ఇదిలా నడుస్తుండగానే, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సోనియా గాంధీ తో భేటీ అవ్వడం పార్టీలో చేరుతున్నట్టు లీకులు వచ్చాయి.దీనిపై కూడా గందరగోళం జరిగింది.ఇప్పుడు జానారెడ్డి చైర్మన్ గా కమిటీ ఏర్పడటంతో చేరికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి ఏర్పడింది
రేవంత్.. జానారెడ్డి ఇద్దరు సానుకూలంగా ఉంటారా..?పొన్నాల, ఉత్తమ్..దామోదర రాజనర్సింహ నో చెప్తారా?
కమిటీలో మెజారిటీ అభిప్రాయం డీఎస్, ఆయన కుమారుడి చేరికకు వ్యతిరేకంగా ఉంటుందా? అనుకూలమా?
మొదలైన చర్చలు నడుస్తున్నాయట..
అదే సమయంలో డి శ్రీనివాస్… సోనియా గాంధీ తో నేరుగా మాట్లాడిన తర్వాతే చేరాలని అనుకున్నపుడు, ఈ కమిటీ అడ్డుకుంటుందా..? జానారెడ్డి కమిటీకి అడ్డుకునే శక్తి ఉంటుందా అనే చర్చ కూడ నడుస్తోందట
నిజానికి రాహుల్ గాంధీతో సీనియర్ నేతల భేటీ తర్వాత వెంటనే కమిటీ ఏర్పాటుకు ఆమోదం వచ్చింది.
అయితే కమిటీ చైర్మన్ పేరు మాత్రం ఆఖరులో మారినట్టు చర్చ జరుగుతుంది. మాజీ చీఫ్ ఒకరికి ఈ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారట.కానీ..ఆఖరులో జానారెడ్డి పేరు తెరపైకి వచ్చినట్టు సమాచారం.
ఇలా మొదట కమిటీ ఏర్పాటులోనే పంచాయితీ జరిగింది..ఈ సంగతి ఎలా ఉన్నా, చేరికల విషయంలో ఈ కమిటీ పరిధి ఎంత అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.మరీ ముఖ్యంగా, డీఎస్ కుటుంబంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోందట
Watch Here : https://youtu.be/pQTuAHeniBA
తాజావార్తలు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!