Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress : కాంగ్రెస్లో అంతేనా..!? ఒకరి తర్వాత ఒకరు మళ్లీ గళం విప్పడం మొదలు పెట్టారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రారంభమైన పంచాయితీ.. ఎటు దారి తీస్తోందో.. ఏమౌతుందో శ్రేణులకు అర్థం కావడం లేదా? ఈ కల్లోలాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా అధిగమిస్తుంది?
తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మొదలైన ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్.. పిసిసి చీఫ్ రేవంత్ టార్గెట్గా సీనియర్లు బలంగా పావులు కదుపుతున్నారు. రేవంత్ మాటలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవాళ్లంతా.. పీసీసీ చీఫ్కు ఠాగూర్ను ఏజెంట్ గా విమర్శిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి ఎపిసోడ్ ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ మర్రి శశిధర్ రెడ్డి బయటకు వచ్చారు. శశిధర్ రెడ్డి.. ఎంపీ వెంకటరెడ్డిని సమర్ధిస్తూనే రేవంత్, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. దాంతో సమస్య మళ్లీ రాజుకుంది.
Also Read
తాజాగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి సైతం అసంతృప్తి బయటపెట్టారు. ఠాగూర్…తనతో మాట్లాడిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యక్రమాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించినట్టు మహేశ్వర్ రెడ్డీ చెబుతున్నారు. సమాచారం తెలుసుకోకుండా ఇంఛార్జ్ నోరు జారారని మండిపడుతున్నారు. ఇలా సీనియర్ నేతలు ఒకరు తర్వాత ఒకరు ఓపెన్ కావడం రచ్చ అవుతోంది. అయితే వరస పరిణామాలపై ఏఐసీసీ ఏం చేస్తోంది!? సమస్యను గుర్తించే పనిలో ఉందా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
శశిధర్రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ను టార్గెట్ చేసిన మొదటి వ్యక్తి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన కొంత కాలంగా సైలెంట్గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలపై నో కామెంట్స్ అంటూ నియోజక వర్గంలో పర్యటనలు చేసుకుంటున్నారు జగ్గారెడ్డి. నవంబర్ 5న గాంధీభవన్లోనే మాట్లాడతా అని ఒక ప్రకటన చేశారు. అయితే నవంబర్కి.. జగ్గారెడ్డి కామెంట్స్కి సంబంధం ఏంటనే చర్చ ఉంది. మునుగోడు ఉపఎన్నికపై మాట్లాడతారా..? లేక పార్టీ నాయకత్వంపై మరోసారి చెలరేగుతారా? అనేది సస్పెన్స్. కొన్నాళ్లు విరామం.. మరికొన్నాళ్లు ఫైరింగ్ అన్నట్టు జగ్గారెడ్డితో యవ్వారం ఉంటుంది. ఇంకోవైపు .. ఇంతలో తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు నివేదిక ఇస్తానని చెప్పుకొచ్చారు ఎంపీ వెంకటరెడ్డి. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో పార్టీలో రేగుతున్న ఈ వివాదాలు ఎటు దారితీస్తాయో అర్థం కావడం లేదట. మరి.. సమస్యనున అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!