TCongress : ఒకరు ఎడ్డం అంటే ఇంకొకరు తెడ్డం అంటున్నారా.? ఇంతకీ టీ-కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై నిర్వహించిన మహిళా దర్బార్పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా దర్బార్ని స్వాగతించారు. అంతేకాదు… రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగుంటుందన్నారు రేవంత్. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు లేనప్పుడు కనీసం గవర్నర్ అయినా వింటే మంచిదే కదా అన్నారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం దీనిపై రేవంత్కి భిన్నంగా స్పందించారు.
రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే… అతనిది సొంత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన కోరుకోవడం తప్పన్నారు. అది కాంగ్రెస్కే నష్టమన్నారాయన. రాష్ట్రపతి పాలనతో రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ చూస్తుంది ఆరోపించారు జగ్గారెడ్డి. పైగా గవర్నర్ దర్బార్ పెట్టడం వల్ల ప్రయోజనం లేదన్నారు. దీని వెనుక బీజేపీ ఉందన్నది జగ్గారెడ్డి ఆరోపణ. గవర్నర్కి జరిగిన అవమానంపైనే అధికారులపై ఇంత వరకూ చర్యల్లేవని… ఇక మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలుంటాయని ప్రశ్నించారు. .
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాల్లో కొంత లాజిక్ ఉంది. ప్రోటోకాల్ పాటించడం లేదని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు పోలీసు అధికారులపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు గవర్నర్. దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి అతీగతీ లేదు. ఇక రాజ్భవన్ వెళ్లే మహిళా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని జగ్గారెడ్డి సందేహించడంలో అర్థం లేకపోలేదు. …
గవర్నర్ తమిళి సై ప్రజాదర్బార్పై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్లో ఇది సహజం కూడా. రేవంత్ వ్యాఖ్యల్ని ఓ వైపు తప్పుబడుతూనే… మరోవైపు… అది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ తనను తాను సమర్థించుకుంటున్నారు జగ్గారెడ్డి. సాధారణంగా ఏ పార్టీకైనా ఒక అంశంపై ఒక విధానం ఉంటుంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే… నేతలంతా దానిని పాటించాల్సి ఉంటుంది. కానీ… గవర్నర్ దర్బార్ విషయలో ఒకే అభిప్రాయం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు జగ్గారెడ్డి. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడకూడదు కానీ… అంశాలపై మాట్లాడినప్పుడు… భిన్నాభిప్రాయాలు సహజమే అంటున్నారాయన. .
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఏ అంశంపై అయినా ఒక్కో నేతది ఒక్కో అభిప్రాయం అన్నట్టు మారిపోయింది .
తాజావార్తలు
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!