Telangana CM KCR :సీఎం కేసీఆర్ వ్యూహం ఏంటి? దసరాకు ముహూర్తం పెట్టారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM KCR : జాతీయ పార్టీ ప్రకటనకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారా? ముహూర్తం ఖరారైందా? గులాబీ బాస్ చేస్తున్న వ్యూహ రచన ఏంటి? దసరాకు కీలక ప్రకటన చేస్తారా? లెట్స్ వాచ్..!
బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ అజెండా దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీతోపాటు కొత్త కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా వడివడిగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్.. ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ అంశంపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు కూడా. నేషనల్ పాలిటిక్స్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే తన ఆలోచనను వివిధ వేదికలపై బయట పెట్టారు తెలంగాణ సీఎం. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ కొత్త జాతీయ పార్టీపై పలుపేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
సీఎం కేసీఆర్ స్వయంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. వివిధ పార్టీల నేతలతో కీలక చర్చలు జరిపారు. ఇదే సమయంలో హైదరాబాద్లోని ప్రగతి భవన్కు వచ్చిన వివిధ పక్షాల నాయకులతో మంత్రంగాలు నడిచాయి. గులాబీ దళపతి ఆలోచనలకు మద్దతు తెలిపారు నాయకులు. అయితే జాతీయ పార్టీ ప్రకటన అప్పుడు.. ఇప్పుడు అంటూ గతంలో గుసగుసలు వినిపించాయి. కానీ.. ప్రస్తుతం గట్టి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ దసరాకు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. అక్టోబర్ ఐదున కొత్త పార్టీ పేరు ప్రకటనతోపాటు.. ప్రత్యామ్నాయ అజెండాను వెల్లడిస్తారని తెలుస్తోంది.
జాతీయ పార్టీ జెండా.. అజెండాల విషయంలో సీఎం కేసీఆర్ ఒక ఆలోచనకు వచ్చారట. ఆ కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్టు సమాచారం. పైగా సెంటిమెంట్గా విజయదశమి రోజు అయితే అంతా సక్సెస్ అవుతుందని అభిప్రాయ పడుతున్నారట. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఇదే మూడ్లో ఉండటంతో అక్టోబర్ 5ను ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. అయితే జాతీయ పార్టీ ప్రకటన కంటే ముందు రాష్ట్రంలో చేయాల్సిన కసరత్తుపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారట. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా పర్యటించాల్సి రావొచ్చు. అందుకు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారట. ఈ విషయంలో కలిసి వచ్చే పార్టీలు.. ఆ పక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలను వదిలిపెట్టి.. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కేసీఆర్ టూర్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయట.
జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ కావడంతో గులాబీ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అందరి దృష్టీ అక్టోబర్ 5పై నెలకొంది. పార్టీ పేరు ఏంటి? జెండా ఏ రంగులో ఉంటుంది? అజెండాలోని అంశాలపైనా ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. మరి.. సీఎం కేసీఆర్ ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారో అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?