గులాబీ శిబిరంలో ఆపరేషన్ వికర్ష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? ఎన్నికల్లో పోటీ చేయగలమా? రాజకీయ భవిష్యత్ ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూనే కొందరు టీఆర్ఎస్ నేతల ఆలోచనలు ఉన్నాయట. ఉన్నచోటే ఉంటే.. ఛాన్స్ రాకపోతే ఎలా అనే ఆందోళనలో మరోదారి వెతుక్కునే పనిలో ఉన్నట్టు టాక్. రాజకీయ అవకాశాల కోసం లెక్కలతో కుస్తీ పడుతున్నారట.
జంపింగ్ జపాంగ్ల కాలం మొదలైందా?
Also Read
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
తెలంగాణలో రాజకీయ వేడి నెలకొంది. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడే పనిలో బిజీ అవుతున్నారు నాయకులు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్ల సంఖ్య అధికార టీఆర్ఎస్లో ఎక్కువగానే ఉంది. ఎవరిస్థాయిలో వాళ్లు లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు.. సామాజిక సమీకరణాలు.. పార్టీ అవసరాలను గమనిస్తున్న అలాంటి నాయకులు భవిష్యత్ కార్యాచరణలో తలమునకలు అవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు నేతలు ముందే జాగ్రత్త పడే పనిలో ఉన్నారట. గులాబీ శిబిరంలో ఉక్కపోతగా ఉంటే జంప్ చేయడానికి వెనకాడటం లేదు. జంపింగ్ జపాంగ్ల కాలం కూడా మొదలైపోయింది.
2018, 2019 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో అనేకమంది చేరిక 2018లో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు గులాబీ కండువా కప్పేసుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల ముందు కూడా ఈ విధంగా క్యూ కట్టారు చాలామంది. ఆ సమయంలో కొందరికి భవిష్యత్లో అవకాశాలు ఇస్తామన్న హామీలు రావడంతో జాయిన్ కావడానికి వెనకాముందు ఆలోచించలేదు. మరికొందరు పార్టీ ఏదో ఒక విధంగా గుర్తించకపోతుందా అనే ఆశతో కాలం గడిపేశారు. అధికారపార్టీ కూడా పదవులు పందేరంలో కొందరికి ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి వచ్చిన వాళ్లలో కొందరిని ఎమ్మెల్సీలను చేశారు.. ఇంకొందరికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు కట్టబెట్టారు.
భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లోకి జంప్ ఇంత వరకు బాగానే ఉన్నా.. పదవులు రానివారితోపాటు.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి.. పార్టీలో ఎలాంటి గుర్తింపు రానివాళ్లే టెన్షన్ పడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదేమోననే ఆందోళనతో గులాబీకి గుడ్బై చెప్పేస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అదే చేశారు. అదేబాటలో నచ్చినచోటకు వెళ్లడానికి మరికొందరు నాయకులు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. టికెట్ హామీ ఇస్తే కొత్తపార్టీ కండువా కప్పేసుకోవడానికి క్షణం ఆలస్యం చేయడం లేదట. చాలామంది రహస్య మంత్రాంగాలలో మునిగిపోయినట్టు తెలుస్తోంది.
వచ్చేవాళ్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఎదురుచూపులు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్లు కూడా బలమైన నాయకులు వస్తే చేర్చుకునేందుకు వెనకాడటం లేదు. వచ్చిన వాళ్లను కాదనకుండా తమ శిబిరాల్లో చేర్చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు అధికారపార్టీలో చర్చగా మారుతున్నాయి. మరి.. ఈ ఆపరేషన్ వికర్ష్కు టీఆర్ఎస్ ఎలాంటి విరుగుడు మంత్రం వేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
-
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!