నందిగామ వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై చర్చ!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్న ఎమ్మెల్యే.. పెత్తనం తమ్ముడిది. అక్కడ ఎవరికైనా సరే.. తమ్ముడి మాటే వేదం. దీంతో తమ్ముడి కుమ్ముడి గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం. ఇదే ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.
నందిగామలో ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై చర్చ!
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ ఖాతాలో పడిన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా నందిగామ ఒకటి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన మొండితోక జగన్మోహనే 2019లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ విజయం పార్టీ కేడర్కు జోష్ తీసుకొచ్చినా.. తర్వాత తలెత్తిన పరిణామాలే వారికి మింగుడు పడటం లేదని చెబుతున్నారు. జగన్మోహన్ గెలుపులో ఆయన తమ్ముడు అరుణ్కుమార్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వరకే తన పాత్ర పరిమితం అయితే బాగోదని అనుకున్నారో.. లేక తమ్ముడిని కూడా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే భావించారో ఏమో తమ్ముడి తీరే ఇప్పుడు చర్చగా మారింది.
ఎమ్మెల్యే తమ్ముడు అరుణ్ ఎంత చెబితే అంతట!
నందిగామలో ఎమ్మెల్యే జగన్మోహన్ మాటకంటే ఆయన తమ్మడు అరుణ్కుమార్ ఆదేశాలకే వెయిట్ ఎక్కువట. ఎవరికి పోస్టింగ్లు వేయాలన్నా.. బదిలీ చేయాలన్నా అరుణ్ చెబితేనే జరుగుతుందని ఓపెన్ టాక్. చివరకు పార్టీలో ఎవరికి ఏ పదవి దక్కాలన్నా.. కమిటీలలో పోస్టులు వేయాలన్నా తమ్ముడే చెప్పాలట. అరుణ్కుమార్ ఆశీస్సులు ఉంటే ఏదైనా జరిగిపోతుందని కేడర్ చెవులు కొరుక్కుంటుంది. ఇటీవల జరిగి పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తన్నకంటే తమ్ముడి చలవ ఉన్నవారికే పార్టీ టికెట్లు దక్కాయట.
ఎమ్మెల్యే తమ్ముడికే పెద్దపీట వేస్తున్న అధికారులు?
అరుణ్ను ప్రసన్నం చేసుకునే పనిలో మాఫియాలు!
నందిగామలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఎమ్మెల్యే అన్నో తమ్ముడో అర్థం కావడం లేదట పార్టీ కేడర్కు. ప్రస్తుతం అభివృద్ధి పనులు, శంకుస్థాపనలకు వెళ్లితే అధికారులు కూడా అరుణ్కుమార్కే పెద్ద పీట వేస్తున్నారట. వైసీపీ సమావేశాల్లోనూ తమ్ముడికి ఎమ్మెల్యేను మించిన ప్రాధాన్యం ఇస్తున్నారట పార్టీ నేతలు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కలెక్టర్, ఇతర అధికారులతో తమ్ముడే మాట్లాడతారట. నందిగామలో కాచుకుని ఉన్న ఇసుక, పీడీఎస్ బియ్యం రవాణా మాఫియా, గ్రావెల్ అక్రమ తవ్వకాల ముఠాలు ఎమ్మెల్యే తమ్ముడిని ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టులు పనులు దక్కించుకునేవారు సైతం అరుణ్ కుమార్ ఎప్పుడు కరుణిస్తారో అని ఎదురు చూస్తున్నారట.
తమ్ముడితో మాట్లాడకుండా ఎమ్మెల్యే ఏ పనీ చేయరట!
ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ సైతం తమ్ముడు అరుణ్ పెత్తానాన్ని ఎక్కడా అడ్డుకోవడం లేదట. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అరుణ్తో మాట్లాడకుండా ఎమ్మెల్యే ఏ పనీ చేయరని చెబుతారు. దీంతో తమ్ముడి కుమ్ముడికి హడలిపోతున్నారు అధికారులు, పార్టీ కేడర్. మరి.. పార్టీ పెద్దల దృష్టికి నందిగామ వ్యవహారాలు వెళ్లాయో లేదో కానీ.. ఈ వాతావరణాన్ని ప్రత్యర్థులు ఛాన్స్ తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెవులు కొరుక్కుంటున్నాయి అధికార పార్టీ శ్రేణులు.
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?