మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా? ఆ పదవి ఏంటో.. సీఎం కేసీఆర్ ఆయనకు చెప్పేశారా? గులాబీ కండువా కప్పుకోగానే అధికారికంగా ప్రకటన చేసేస్తారా? టీఆర్ఎస్లో ఆయన చేరిక హుజురాబాద్ ఉపఎన్నిక కంటే ముందే ఉంటుందా.. లేదా?
సీఎం కేసీఆర్తోపాటు అసెంబ్లీకి రావడంతో చర్చల్లోకి మోత్కుపల్లి..!
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
బీజేపీకి దూరమైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రేపోమాపో టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారని చర్చ జరిగినా.. తర్వాత అంతా మర్చిపోయారు. తాజాగా సీఎం కేసీఆర్తో కలిసి మోత్కుపల్లి అసెంబ్లీకి రావడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మాజీ మంత్రి. ఒక రోజంతా సీఎంతోనే ఉండటం రాజకీయంగా మరింత హైప్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమని అనుకుంటున్నారు. పైగా నర్సింహులు చేరిక బాధ్యతను మంత్రి జగదీష్రెడ్డికి అప్పగించారట సీఎం కేసీఆర్.
దళిత బంధు కార్పొరేషన్కు ఛైర్మన్ను చేస్తారా?
టీఆర్ఎస్లో చేరాక.. మోత్కుపల్లికి దక్కే పదవిపై ఇప్పుడు చర్చ మొదలైంది. అప్పట్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత బంధు స్కీమ్ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అప్పడు మోత్కుపల్లి బీజేపీలో ఉన్నారు. సమీక్షా సమావేశానికి దూరంగా ఉండాలని నాడు బీజేపీ నిర్ణయించినా.. ధిక్కరించి ప్రగతిభవన్కు వెళ్లారు మోత్కుపల్లి. ఆ తర్వాత బీజేపీకి గుడ్బై చెప్పేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఏర్పటు చేసే దళితబంధు కార్పొరేషన్కు మోత్కుపల్లిని ఛైర్మన్ను చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం రాజకీయంగా కలిసి వస్తుందనే లెక్కల్లో ఉంది గులాబీ పార్టీ.
ఛైర్మన్ పదవితో సంతృప్తి చెందుతారా?
అసెంబ్లీ టికెట్ అడిగితే పరిస్థితి ఏంటి?
ఇదే సమయంలో మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్పై మరో చర్చా మొదలైంది. ఒకవేళ కార్పొరేషన్ ఛైర్మన్ను చేస్తే.. ఆ పదవితోనే సంతృప్తి చెంది టీఆర్ఎస్లో కొనసాగుతారా? లేక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ అడుగుతారా? 2014లో ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో BLF కూటమి తరఫున ఆలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసినా కలిసి రాలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఆలేరు సీటు ఖాళీగా లేదు. అలాగని.. మరో ఎస్సీ రిజర్డ్వ్ స్థానానికి మోత్కుపల్లిని పంపిస్తారని భావించినా.. అవి కూడా ఫుల్. అందుకే టీఆర్ఎస్లో మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ ఇచ్చే పదవితో సంతృప్తి చెంది.. కామైపోతారని కొందరి వాదన. ఆపై అంతా గులాబీ దళపతి దయ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. మోత్కుపల్లి రాజకీయ జాతకం ఎలా ఉందో చూడాలి.
తాజావార్తలు
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?