Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Mla Sai Prasad Reddy And His Followers

ఆదోనిలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం..!

NTV Telugu Twitter
Published Date :September 7, 2021 , 5:19 pm
By Manohar
ఆదోనిలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం. వారు ఎంత చెబితే అంత. ఎదురు తిరిగితే ఇంతే సంగతులు. ఎంతటి వారైనా కేడర్ చేతిలో దెబ్బలు తినాల్సిందే. కాదూ కూడదు అంటే ఎంతకైనా తెగిస్తుండటంతో.. అధికారపార్టీలో చర్చగా మారారు ఎమ్మెల్యే. ఇంతకీ ఎమ్మెల్యేకు తెలిసే అనుచరులు చేస్తున్నారా? తెలిస్తే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ప్రశ్న.

కేడర్‌ రెచ్చిపోతుంటే.. ఎమ్మెల్యే మౌనం!

కర్నూలు జిల్లా ఆదోని. సాయిప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే. ఇక్కడ సాయి ప్రసాద్‌రెడ్డి కంటే అధికారపార్టీ నేతలుగా.. ఎమ్మెల్యే అనుచరులుగా నియోజకవర్గంలో తిరిగేవారి సంఖ్య ఎక్కువే. ఆ హోదాలో వారు చేస్తున్న పనులే రచ్చ రచ్చ అవుతున్నాయి. ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి. సోషల్‌ మీడియాలోనూ వీడియోలు, కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతల్లా కాకుండా రౌడీమూకల్లా ప్రవర్తిస్తున్న తీరు వైసీపీకి చెడ్డ పేరు తెస్తోందని కొందరు నాయకులు వాపోతున్నారట. కేడర్‌ను అదుపులో పెట్టాల్సిన ఎమ్మెల్యే మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు ఇంకొందరు.

ఇంట్లో పేకాటకు ఒప్పుకోలేదని ఆలయ మాజీ ఛైర్మన్‌పై దాడి!

ఇంట్లో పేకాట ఆడేందుకు ఒప్పుకోలేదని ఓ వ్యక్తిని చితకబాదారు ఎమ్మెల్యే అనుచరులు. AR కానిస్టేబుల్‌ సత్యన్నతో కలిసి పార్టీ కేడర్‌గా చెప్పుకొంటున్న కిశోర్‌, ప్రసాద్‌, లక్ష్మన్నలు ఇంట్లో పేకాట ఆడేందుకు మాలమల్లేశ్వర స్వామి ఆలయ మాజీ ఛైర్మన్‌ తిమ్మారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. తిమ్మారెడ్డితోపాటు.. ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో తిమ్మారెడ్డిని చితక్కొట్టారు. 100కు డయల్‌ చేసి చెప్పడంతో పోలీసులు వచ్చి బాధితులను కాపాడారు. ఈ ఘటన ఆదోనిలో కలకలం రేపింది. దాడి చేసింది ఎమ్మెల్యే అనుచరులు కావడంతో మరింత చర్చ జరిగింది.

రోడ్డు బాగోలేదన్న ఇద్దరిని కారులో ఎత్తుకెళ్లి చితక్కొట్టారు!

ఎమ్మెల్యే కారులో వెళ్తున్న సమయంలో ఆదోనిలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని ఆటో డ్రైవర్‌ రవి.. ఒక పూల వ్యాపారితో కామెంట్‌ చేశారు. అక్కడే ఉన్న పార్టీ కేడర్‌.. వీరిద్దరి ఫొటోలు తీసుకొని వెళ్లారట. కొద్ది నిమిషాల్లోనే కారులో వచ్చిన కొందరు వారిద్దరినీ తీసుకెళ్లి చితక్కొట్టారు. ఎమ్మెల్యే ఇంటికి సైతం తీసుకెళ్లి సాయిప్రసాద్‌ రెడ్డి ఎదురుగానే మరోసారి చేయి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. చివరకు ఆటో డ్రైవర్‌ రవి ఓ కార్మిక సంఘం నాయకుడని తెలుసుకుని వదిలేశారట. ఈ ఘటనపై కార్మికులు ఆందోళనకు దిగడంతో.. పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు.

పెన్షన్‌ మంజూరు చేయలేదని ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం!
పట్టాగా ఇచ్చిన భూమిని కబ్జా చేసి.. అడ్డుకున్న బాధితులపై దాడి!

మండగిరి సచివాలయంలో పెన్షన్‌ మంజూరు ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డిజిటల్‌ అసిస్టెంట్‌పై ఎమ్మెల్యే అనుచరుడు పోతుల సురేష్‌ చేసిన వీరంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేయడంతో సురేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు వైసీపీ నేతలు ప్రకటించారు. ఇక ప్రశాంత్‌ నగర్‌లో ఇంటి పట్టా పొందిన లబ్ధిదారుల స్థలాలను కొందరు ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేయడంతో పెద్ద గొడవే జరిగింది. బాధితులపై దాడులు చేశారు. దీనిపైనా కేసు నమోదైంది. ఈ విధంగా అనుచరులు రెచ్చిపోతున్నా.. ఎమ్మెల్యే మౌనంగా ఉండటం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. పైకి సాయి ప్రసాద్‌రెడ్డికి ఈ గొడవలతో సంబంధం లేదని చెబుతున్నా.. నిప్పు లేనిదే పొగ రాదుగా అన్నది వైరివర్గాల ప్రశ్న. కాకపోతే ఎన్నడూ లేని విధంగా వెలుగులోకి వస్తున్న గొడవలే ఆదోని ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయట. మరి.. వీటికి ఎవరు చెక్‌ పెడతారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap
  • mla followers
  • mla sai prasad reddy
  • ycp mla

తాజావార్తలు

  • Winning Girls Heart: ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలంటే.. అమ్మాయిలకు పిచ్చి..!

  • Allu Arjun : ‘శక్తిమాన్’ గా బన్నీ.. అంతా ఉత్తదే..!

  • Pune Bridge Collapses: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..

  • Makhana: మఖానా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

  • R.S Praveen Kumar : అందుకే.. కేటీఆర్‌పై కేసులు

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions