నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు కర్నూలు వైసీపీ సీనియర్లు. ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు ఇక తిరుగే ఉండదు అనుకున్న నేతలకు తాజా పదవుల పంపకాల్లో నిరాశే మిగిలింది. స్థానికంగా సీనియర్లు అనిపించుకున్న నేతలనూ హైకమాండ్ పక్కన పెట్టేయడం ఏ లెక్కలోనో అర్థంకాక తలపట్టుకుంటున్నారు.
ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా పదవుల్లేవ్!
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
కర్నూలు జిల్లాలో వైసీపీ సీనియర్లు.. నాయకులకు కొదవ లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డితో సాన్నిహిత్యం ఉండి.. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న వాళ్లు అనేక మంది ఉన్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు ఆరు రాష్ట్రస్థాయి, 4 జిల్లా స్థాయి పోస్ట్లు దక్కాయి. అయితే పదవులు ఆశించిన వారి జాబితా ఎక్కువగా ఉండటం.. కొందరికే పట్టం కట్టడంతో.. అసంతృప్తులు గట్టిగానే ఉన్నాయి. ఎమ్మెల్సీ, ఛైర్మన్ పదవులు ఆశించినవారికి సైతం నిరాశ తప్పలేదు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా.. పదవి దక్కలేదని మరికొందరు వాపోతున్నారట.
డైరెక్టర్, మెంబర్ పోస్టుల కోసం ద్వితీయశ్రేణి నేతల ఎదురు చూపులు!
ఒకటి రెండేళ్ల తర్వాతైన ఛాన్స్ ఉంటుందా?
శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చిత్తూరు జిల్లాకు చెందిన చక్రపాణిరెడ్డిని నియమించారు. ఈ పదవికోసం కర్నూలు జిల్లా నేతలు ఆశపడ్డారు. ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పదవైనా దక్కుతుందా లేదా అని ద్వితీయశ్రేణి నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. నంద్యాలలో వైసీపీ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి గతంలో మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించారు. గతంలో YSతో ప్రస్తుతం సీఎం జగన్తో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఎమ్మెల్సీని చేస్తారో లేదో తెలియడం లేదు. ఇటు నామినేటెడ్ పదవీ దక్కలేదు. హైకమాండ్ హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే మరో ఏడాదో.. రెండేళ్లో వేచి ఉన్నా అప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు రాజగోపాల్ రెడ్డి వర్గీయులు.
భార్యకు పదవి ఇచ్చినా భర్తకు అసంతృప్తే!
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెరనేకల్ సురేందర్రెడ్డి కూడా చైర్మన్ పదవికోసం తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆలూరు ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఉన్నారు. సురేందర్రెడ్డి, నీరజారెడ్డిలది ఒకే ఊరు తెరనేకల్. అయినప్పటికీ ఎమ్మెల్యేను కాదని నాడు జగన్ వెంట నడిచారు. పాదయాత్రలో తెరనేకల్లో సురేందర్రెడ్డి ఇంట్లోనే జగన్ బస చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రకటించిన జాబితాలో సురేందర్రెడ్డి పేరు లేదు. కుడా చైర్మన్ పదవి కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి దక్కింది. వాస్తవానికి వైసీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి కుడా చైర్మన్ పదవిని ఆశించారు. కాకాపోతే రాజా సతీమణి మహాలక్ష్మికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో కొంత బ్యాలెన్స్ అయింది. అయినా రాజా విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తితోనే ఉన్నారట.
విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్నా దక్కని అదృష్టం!
వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన బెల్లం మహేశ్వర్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ పదవిని ఆశించారు. ఆయనకు 9 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేశారట. అయితే వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్కి ఆ పదవి దక్కింది. జగన్ యువసేనలో మొదటి నుంచి చురుగ్గా ఉన్న సత్యం యాదవ్కు అయితే తాజా పంపకాలలో ఏ పదవి దక్కలేదు. విద్యార్థి దశ నుంచి కూడా ఆయన YSR కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ విధంగా జూనియర్లు.. సీనియర్లు పదవులు రాక దిగాలు పడ్డారు. పదవీ యోగం లేదని ఆందోళన చెందుతున్నారు. మరి.. ఎన్నికల నాటికి ఈ అసంతృప్తి పెద్దది కాకుండా పార్టీ పెద్దలు వారినెలా బుజ్జగిస్తారో చూడాలి.
- Tags
- kurnool ycp
- off the record
- ycp
తాజావార్తలు
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!