కోదాడ టీఆర్ఎస్లో కొత్త కాక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెక్కలో తేడా వచ్చింది.. అనుచరులపై ఎమ్మెల్యేకు కోపం వచ్చింది..! కుర్చీలో నుంచి దించేసేందుకు రంగం సిద్ధం చేశారట. ఈ విషయం బయటకు గుప్పుమనడంతో కోదాడ టీఆర్ఎస్లో చెవులు కొరుకుడు ఎక్కువైంది. అదేంటోఈ స్టోరీలో చూద్దాం.
వైరి వర్గాలుగా ఎమ్మెల్యే.. మున్సిపల్ ఛైర్పర్సన్..!
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
సూర్యాపేట జిల్లా కోదాడలో నిన్న మొన్నటి వరకు కామ్గా ఉన్న టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా కాక రేపుతున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ వనపర్తి శిరీష.. ఆమె భర్త లక్ష్మీనారయణలకు అస్సలు పడటం లేదు. శిరీష దంపతులు ఎమ్మెల్యేకు అనుచరులే. అందుకే జనరల్ సీటులో బీసీ వర్గానికి చెందిన శిరీషను ఛైర్పర్సన్ అయ్యేలా చక్రం తిప్పారు మల్లయ్య యాదవ్. అలాంటిది ఎమ్మెల్యే, ఛైర్పర్సన్ మధ్య చాలా గ్యాప్ వచ్చిందట. ఒకరినొకరు రాజకీయంగా అనుమానంగా చూసుకుంటూ.. వైరిపక్షాల మాదిరి మాటల కత్తులు దూసుకుంటున్నారు.
ఆరు నెలలుగా రెండు వర్గాల మధ్య వార్..!
కోదాడ కౌన్సిల్ ఏర్పడి తర్వాత కరోనా వల్ల పాలకవర్గాల మీటింగ్లు జరగలేదు. దీంతో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చేవారు. పట్టణ పరిధిలో ఏదైనా పనులు చేపట్టాలన్నా శిరీష.. ఆమె భర్త ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొనేవారట. ఎక్కడ తేడా కొట్టిందో ఏమో.. ఆరు నెలలుగా వీళ్లకు అస్సలు పడటం లేదట. రెండు వర్గాలుగా విడిపోయారని టాక్.
అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 120 మంది నియామకం..!
రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు
మరోసారి రూ.70 వేల చోప్పున వసూలు చేశారట..!
శిరీష ఛైర్పర్సనే అయినా కోదాడ మున్సిపాలిటీలో పెత్తనం ఆమె భర్త లక్ష్మీనారాయణదే అనే విమర్శ ఉంది. దీనిపై టీఆర్ఎస్ కౌన్సిలర్లే ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పైగా అవినీతిపై అధికారపార్టీలోనే కథలు కథలుగా చెప్పుకొంటున్నారట. శానిటేషన్ విభాగంలో 120 మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవడానికి కౌన్సిల్లో తీర్మానం చేయగా.. ఒక్కో వ్యక్తి నుంచి 3 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో అందరికీ వాటలు అందాయట. అయితే సాంకేతిక కారణాలతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడా ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి డబ్బులు ఇచ్చినవాళ్లను నియమించుకునే పని ప్రారంభించారట. అయితే ఎంపికైన అభ్యర్థుల నుంచి మరో 70 వేల చోప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. లెక్క తేడా కొట్టడంతో ఛైర్పర్సన్ శిరీషపై అవిశ్వాసం పెట్టి దింపేయడానికి ఎమ్మెల్యే ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
కౌన్సిలర్లతో టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మీటింగ్..!
ఇదే సమయంలో టీఆర్ఎస్ కోదాడ టౌన్ అధ్యక్షుడు కొందరు కౌన్సిలర్లతో మీటింగ్ పెట్టడంతో ఛైర్పర్సన్ను దించేస్తారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. మరి.. ఛైర్పర్సన్ భర్త.. ఎమ్మెల్యేతో రాజీకి వస్తారో.. వైరిపక్షంగా మారి యుద్ధానికి సై అంటారో అని పార్టీ వర్గాల్లో ఒక్కటే చర్చ. మరి.. కోదాడ టీఆర్ఎస్లో రేగిన ఈ రగడకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!