Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Cm Kcr Meeting With Pm Modi

ప్రధాని మోదీతో కేసిఆర్ భేటిపై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ…

Published Date :September 5, 2021 , 11:59 am
By Manohar
ప్రధాని మోదీతో కేసిఆర్ భేటిపై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ…
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఒక్క భేటీ వంద అనుమానాలకు కారణమైంది. పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్… అలాంటిదేం లేదు… కాళ్ల బేరానికి వచ్చారని బిజెపి విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది.

మూడు రోజుల డిల్లీ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళ్లారు సియం కేసిఆర్. సెప్టెంబర్ 2 న వసంత్ విహర్ లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసారు కేసిఆర్. ఆ తర్వాత షెడ్యూలు ప్రకారం మూడవ తేది హైదరాబాద్ కు సియం కేసిఆర్ రావాలి. కానీ, కేసిఆర్ షెడ్యూల్‌ లో మార్పులు జరిగాయి. సియం కేసిఆర్ కు శుక్రవారం మోదీ అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో భేటి అయ్యారు. డిల్లీలో ప్రధాని మోదీతో కేసిఆర్ భేటిపై పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. డిల్లీ పర్యటనతో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న విశ్లేషణలు మొదలయ్యాయి.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సియం కేసిఆర్ మళ్లీ అధికారంను చేజిక్కించుకున్నారు .అప్పడే ఫెడరల్ ఫ్రంట్ అలోచనతో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో భేటి అయ్యారు కేసిఆర్. దీంతో అప్పట్లో మోదితో కేసిఆర్ కు గ్యాప్ వచ్చిందన్న టాక్‌ నడిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిసెంబర్ నెలలో ప్రధాని మోదీతో భేటి అయ్యారు సియం కేసిఆర్. ఇటు ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది టిఆర్ఎస్. మళ్లీ కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 డిసెంబర్ లో కలిసారు కేసిఆర్. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రస్తావించారు సియం కేసిఆర్‌.

అప్పట్లో ప్రధానితో కేసిఆర్ భేటిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసిఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ వెంటనే దొరకడంపై కూడా రకరకాల చర్చలు జరిగాయి. దీంతో, రాజ్యంగబద్దంగా కేంద్రంతో ఉండాల్సిన సంబంధాలను తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని టిఆర్ఎస్ నేతలు స్పష్టం చేసారు. తాజాగా మళ్లీ ప్రధానితో సియం కేసిఆర్ భేటిపై చర్చ మొదలైంది . ఇటు బిజేపి,టిఆర్ఎస్ ఒక్కటే అని విమర్శలు గుప్పిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇటు తెలంగాణ బిజేపి నేతలు కూడా కేసిఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. డిల్లీ నుంచి రాగానే టిఆర్ఎస్, బిజేపి ఒక్కటేనన్న భావన ప్రజల్లో కల్పించి లబ్ది పోందడానికి కేసిఆర్ ప్రయత్నిస్తారని బండి సంజయ్ అన్నారు.

మొత్తంగా తెలంగాణ సియం కేసిఆర్ డిల్లీ పర్యటనలో భేటిలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. విపక్ష పార్టీల నుంచి విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మొత్తంగా ఒక్క భేటి …వంద అనుమానాలకు దారి తీసిందనే టాక్‌ నడుస్తోంది.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా తెలంగాణ బీజేపీ నాయకత్వం గుండెల్లో దడ మొదలవుతోందనే టాక్‌ కూడా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ డిల్లీ ఆకస్మిక పర్యటన సమయంలోనూ బీజేపీ కంగారు పడింది. దీనికి కారణం కేసీఆర్ వ్యూహమే! ఆయన పాలనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంతృప్తికరంగా ఉందనే అంశం పలుమార్లు వెల్లడైంది. రాజకీయంగా బీజేపీకి, టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ అయినా టిఆర్ఎస్ పై కేంద్రం వైఖరికి, తెలంగాణలోని బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి మధ్య చాలా తేడా ఉంది. దీంతో తాజాగా ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేసీఆర్ కలుసుకున్న వ్యవహారంపై బీజేపీ తెలంగాణ నాయకులు ఆరా తీస్తున్నారట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • cm kcr
  • PM Modi
  • telangana
  • TRS

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions