Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Chandragiri Officials

ఎమ్మెల్యే చెవిరెడ్డి చెవిలో పూలు పెట్టి కోట్లు కొట్టేసిన అధికారులు…

Published Date :August 7, 2021 , 8:08 pm
By Manohar
ఎమ్మెల్యే చెవిరెడ్డి చెవిలో పూలు పెట్టి కోట్లు కొట్టేసిన అధికారులు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

పేదలకు పట్టాల పంపిణీ.. ఆ నియోజకవర్గంలోని అధికారులకు అక్షయపాత్రగా మరిందట. భారీగానే నొక్కేసి.. వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాసులు దండుకుని.. ఎమ్మెల్యేకే చెవిలో పువ్వులు పెట్టారని పవర్‌లో ఉన్న పార్టీ కేడర్‌ చికాకు పడుతోందట. వారెవరో.. ఏం చేశారో.. ఈ స్టోరీలో చూద్దాం.

చంద్రగిరిలో 150 ఎకరాలు సేకరించిన అధికారులు!

పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్దఎత్తున భూసేకరణ చేపట్టింది. ప్రభుత్వ భూములతోపాటు డీకేటీ భూముల నష్ట పరిహారానికి ఏ,బీ,సీ అని 3 కేటగిరీలుగా విభజించింది. భూమిలో లబ్ధిదారుడు ఉండి, డాక్యుమెంట్ క్లియర్‌గా ఉంటే ‘ఏ’ కేటగిరి కింద ఎకరాకు 69 లక్షలు చెల్లించారు చిత్తూరు జిల్లా చంద్రగిరి రెవెన్యూ అధికారులు. అన్నదమ్ముల తగాదాలు, కోర్టు లావాదేవీలు, ఆన్‌లైన్‌ కరెక్షన్స్ ఉంటే ‘బీ’ కేటగిరి కింద ఎకరాకు 50 లక్షలు.. డీకేటీ ఉల్లంఘనలు ఉంటే పట్టా మార్చుకోవడం, సుదీర్ఘ అనుభవ పట్టాలేక పోవడం, పట్టా ఉన్న భూమి ఇతరులకు విక్రయించడాన్ని ‘సీ’ కేటగిరిలో చేర్చి ఎకరాకు 25 నష్టపరిహారం ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో 748 ఎకరాల్లో.. 25 వేల 630 మందికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. ఒక్క చంద్రగిరి మండలంలోనే 150 ఎకరాల భూమిని 232 మంది రైతుల నుంచి సేకరించారు. ఇక్కడే అధికారులు తమ బుర్రకు పదును పెట్టారట.

‘సీ’ కేటగిరి భూములకు ‘ఏ’ కేటగిరిలో పరిహారం చెల్లింపు?
హోదాను బట్టి రూ.కోట్లు.. రూ.లక్షలు వెనకేసుకున్నారట!
పిచ్చినాయుడుపల్లిలో రూ.2 కోట్లు బహుమతిగా ఇచ్చిన కాంట్రాక్టర్‌?

‘సి’ కేటగిరికి చెందిన లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకుని ‘ఏ’ కేటగిరి కింద నష్ట పరిహారం చెల్లించారట. అలా వచ్చిన మొత్తాన్ని సైలెంట్‌గా వాటాలు వేసుకుని పంచేసుకున్నారట. అధికారులు, ఉద్యోగుల హోదాను బట్టి కోట్లు.. లక్షలు వెనకేసుకున్నారని రెవెన్యూ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. పిచ్చినాయుడుపల్లిలో 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ బడా కాంట్రాక్టర్‌కు ఎంజాయ్మెంట్ ఇచ్చేశారట. ప్రతిఫలంగా 2 కోట్లు బహుమతిగా ఇచ్చారట ఆ కాంట్రాక్టర్‌. ఎకరాకు కోటి రూపాయలు వెచ్చించి ప్రభుత్వం డీకేటీ భూములను విక్రయిస్తుంటే.. ఏకంగా 25 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టడంతో స్థానిక వైసీపీ నేతలు కంగుతిన్నారట.

ఎం.కొత్తపల్లిలో అటవీ భూమినే ప్రభుత్వానికి అమ్మేశారు?

ఎం.కొత్తపల్లిలోని డీకేటీ భూములకు ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ల్యాండ్‌ను కూడా కలిపి ప్రభుత్వానికే అమ్మేశారట. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అటవీ అధికారులు షాకయ్యారట. ఎమ్మెల్యే చెవిలో పడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. ఇక లాభం లేదనుకొని అవినీతి అధికారుల చిట్టా తెప్పించుకుని వారిపై చర్యలకు ఉపక్రమించారట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఈ స్కామ్‌లో ఒక డిప్యూటీ తాహశీల్దార్‌పై వేటు పడినా.. మిగలిన అధికారులు తమకేం కాదని చాలా ధీమాగా ఉన్నారట.

ఆకాశరామన్న పేరుతో రెవెన్యూ సిబ్బంది బాగోతాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు!

ఆ మధ్య ఇళ్ల పట్టాల పంపిణీ టైమ్‌లో చంద్రగిరి తహశీల్దార్‌ చేసిన కామెంట్స్‌ దుమారం రేపాయి. ఇచ్చిన పట్టాలు తీసుకోవాలని లేదంటే వెనక్కి ఇచ్చేయాలన్న ఆయన వ్యాఖ్యలపై స్థానికులు ఫైర్‌ అయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారుల అక్రమాలపై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయట. ఆకాశరామన్న పేరుతో పెద్దసంఖ్యలో ఉత్తరాలు రాసినట్టు ప్రచారం జరుగుతోంది. అధికారుల తీరుపై ప్రజలతోపాటు వైసీపీ కేడర్‌ కూడా విసుగెత్తిపోయిందట. ఎమ్మెల్యే చెవిరెడ్డికి చెప్పుకొని లబోదిబోమంటున్నారట. ఎంతైనా భూముల కిటుకులు తెలిసిన రెవెన్యూ అధికారులు భారీగా గుటకేశారని చెబుతున్నారు. మరి.. వారిని పట్టుకునే ప్రయత్నాల్లో చెవిరెడ్డి ఏ మేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap
  • chandragiri
  • chandragiri officials
  • mla chevireddy bhaskar reddy

తాజావార్తలు

  • NLM Scheme: గాడిదల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం సాయం.. ఏకంగా రూ. 50 లక్షలు.. ఎలా పొందాలంటే?

  • Ayatollah Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ భారత్ మిత్రుడేనా.? ఈ కీలక విషయాలే సాక్ష్యం..

  • Lunar Eclipse : ప్రారంభమైన చంద్రగ్రహణం..సూతక కాలం నియమాలు ఇవే.!

  • Ponguleti Srinivas Reddy : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి.. కొత్త కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

  • Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం ప్రారంభం.. ఏ సమయంలో.. ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి..

ట్రెండింగ్‌

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions