పేరుకేమో అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. కానీ పదవుల కోసం పడిగాపులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ ఎమ్మెల్యేలే అయినా.. ఏదో వెలితి. చూస్తుండగానే రెండున్నరేళ్లు పూర్తయిపోతోంది. ఇంకేదో పదవి వారిని ఊరిస్తూనే ఉంది. అవకాశాలు వస్తాయో లేదో.. పదవుల పంపకం ప్రస్తావనకు వస్తే మాత్రం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ పదవిపై గురిపెట్టారట. వారెవరో.. ఆ పదవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పదవుల కోసం నేతలు, ఎమ్మెల్యేలు పడిగాపులు!
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలుంటే.. 13 చోట్ల గెలిచింది వైసీపీ. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. స్థానిక నేతలకు, గెలిచిన ఎమ్మెల్యేలకు పదవులు రాలేదనే బాధ అలాగే ఉండిపోయింది. కొందరు కేబినెట్లో చోటు కోసం.. ఇంకొందరు నామినేటెడ్ పోస్టులపైనా ఆశలు పెట్టుకుని రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో జిల్లాలో ముందు వరసలో ఉంటారు నగరి ఎమ్మెల్యే రోజా.. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఇటీవలే రోజా దగ్గర ఉన్న APIIC ఛైర్పర్సన్ పదవినీ వెనక్కి తీసేసుకున్నారు. దీంతో ఆమె అనుచరులు డీలా పడ్డారట.
చింతల పదవీ చింత తీరడం లేదా?
గత రెండు ఎన్నికల్లో పీలేరులో బలమైన నల్లారి కుటుంబంపై గెలుస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే చింతల. పార్టీలో, నియోజకవర్గంలో పేరు సంపాదించినా మరో పదవి దక్కలేదు. ఇరవై ఏళ్ల పోరాటానికి ఫలితం ఏంటని ఎమ్మెల్యే మథన పడుతున్నారట. పదవుల పందేరం చేపట్టిన ప్రతిసారీ ఆశ పడటం.. చివరకు జావకారిపోవడం అలవాటైపోయిందట చింతల వర్గానికి.
టీటీడీలో రోజా, చింతలకు చోటు కల్పిస్తారా?
2014కు ముందు వరకు ఎమ్మెల్యే కావడమే రోజా ఆశయం. పార్టీ అధికారంలోకి వచ్చాక సహజంగానే ఫైర్బ్రాండ్ మంత్రి అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ.. అనుభవం, అవసరం, సామాజిక కోణాలు రోజాను మంత్రిని కానివ్వలేదు. దీంతో ఆమె మొదటి నుండి కలలుకంటున్న మంత్రి పోస్టు అలానే ఉండిపోయింది. పైగా ఉన్న పదవి నుండి తప్పించడంతో రోజా అనుచరులు అయోమయంలో పడ్డారట. తాజాగా టీటీడీ పాలకమండలి వేస్తున్న సమయంలో రోజా, చింతల పేర్లు జిల్లాపార్టీ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. పార్టీనే నమ్ముకొని ఉన్న చింతల, రోజాలకు బోర్డు సభ్యులుగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ, దీన్ని ఎమ్మెల్యే రోజా అనుచరులు కొట్టిపారేస్తున్నారు. తమ ఎమ్మెల్యేకి మంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారట. రోజా సైతం అదే ధీమాతో ఉన్నట్టు సమాచారం.
ఈ దఫా పదవి వస్తే వచ్చినట్టు.. లేదంటే లేనట్టేనా?
పీలేరు ఎమ్మెల్యే చింతలకు టీటీడీ బోర్డు దక్కే అవకాశం మెండుగా ఉన్నాయట. చింతల దగ్గర కేడర్ ఈ మాటలను ప్రస్తావిస్తే.. చాలావాటి మీద ఆశలు పెట్టుకున్నాం.. చూద్దాం చివరి ప్రయత్నంలో ఏం జరుగుతుందో అని బదులిచ్చారట. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేశాను. ఇప్పుడు దేవదేవునికి సేవ చేసే అవకాశం ఇప్పించాలని సీఎం జగన్ను ఎమ్మెల్యే కోరినట్టు టాక్. వీరే కాకుండా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా తమకు ఓ అవకాశం ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా విజ్ఞప్తి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ దఫా పదవి వస్తే వచ్చినట్టు లేదంటే లేనట్టే అన్న బాధ ఎమ్మెల్యే శిబిరంలో ఉందట. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ వైసీపీ లీడర్లు కలిసినా రోజా, చింతల గురించే చర్చిస్తున్నారట. మరి.. ఏం జరుగుతుందో.. ఎవరికి ఏ పదవీ యోగం ఉందో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!