సింగరేణిలో కార్మికుల మూడు రోజుల సమ్మె ఫలించిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంత కాదు.. ఇంతన్నారు. పెద్ద సంఘాలన్నీ యుగళగీతం పాడాయి. మూడు రోజులు సమ్మెలో ఐక్యత చాటాయి. మరి.. వారి పోరాటం ఫలించిందా? లేక వాళ్లదంతా ఆరాటమేనా? సమ్మె లక్ష్యం ఏమైంది?
కార్మికుల్లో పల్చన కాకూడదనే సంఘాలు సమ్మెకు వెళ్లాయా?
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
కలిసి వస్తే సరే.. లేదంటే ద్రోహులే..! సింగరేణిలో మూడు రోజుల సమ్మెకు ముందు జరిగిన ప్రచారం. సింగరేణిలో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమించింది. ఉద్దేశం ఎలా ఉన్నా.. గుర్తింపు సంఘం చేసిన హడావిడి.. అనుసరించిన వ్యూహమే ఇప్పుడు కార్మికుల్లో చర్చగా మారింది. కార్మిక సంఘాల భుజాలపై తుపాకీ పెట్టి కేంద్ర సర్కార్ను గురిపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయట. సమ్మెకు సై అన్న సంఘాలకు ఈ విషయం తెలిసినా.. గుర్తింపు సంఘం చేసిన ప్రతిపాదనకు తలూపక తప్పలేదు. ఈ సందర్భంగా పెట్టిన డిమాండ్స్లో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ తప్పితే అన్నీ రాష్ట్ర సర్కార్ తీర్చేవే. ఇవి ఎంత వరకు నెరవేరుతాయో కార్మిక సంఘాల నేతలకు ముందే తెలుసు. కానీ.. కార్మికుల్లో పల్చన కాకుండా సమ్మెకు వెళ్లక తప్పలేదని చర్చ జరుగుతోంది.
గుర్తింపు సంఘం పన్నిన పద్మవ్యూహంలో జాతీయ సంఘాలు చిక్కుకున్నాయా?
మూడురోజుల సమ్మెతో బొగ్గు బావులు బోసిపోయాయి. గుర్తింపు సంఘం TBGKSకు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్మికులకు సంఘీభావం తెలియజేశారు. కేంద్ర సర్కార్ తీరును తప్పుపట్టారు నాయకులు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మూడు రోజుల సమ్మె ద్వారా సాధించింది ఏంటన్నది కార్మికుల ముందు ఉన్న ప్రశ్న. పైగా గుర్తింపు సంఘం పన్నిన పద్మవ్యూహంలో తామంతా చిక్కుకుపోయామనే భావనలో జాతీయ కార్మిక సంఘాలు ఇప్పుడు మథన పడుతున్నాయట.
సమ్మె విజయవంతమే కానీ.. ఫలవంతం కాలేదా?
సమ్మె మూడు రోజులు కార్మికులు వేతనాలు కోల్పోయారు. సింగరేణి సంస్థకు సైతం 120 కోట్ల వరకు నష్టం వచ్చిందని అంచనా. పే డే నిబంధనలు సడలించడంతో ఆదివారం కూడా వర్కింగ్ డే అయిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పోరాటంలో సింగరేణి సమిధ అవుతుందనే చర్చ కార్మికుల్లో ఉందట. 12 డిమాండ్స్తో సమ్మెకు వెళ్లితే.. వాటిల్లో ఒక్కటీ సాధించింది లేదు. దీంతో మూడు రోజుల సమ్మె విజయవంతమే కానీ.. ఫలవంతం కాలేదని కార్మిక సంఘాల నేతలు అంతరంగిక సమావేశాల్లో చెప్పి వాపోతున్నారట. మొత్తానికి రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎవరో సమ్మెకు పిలుపిస్తే.. ఆ వ్యూహంలో జాతీయ కార్మిక సంఘాలు, కార్మికులు పడ్డారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ పరిణామాలు త్వరలో జరిగే గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!