వైసీపీ లో ఆ నాయకులకు ఫోన్స్ అంటే దడ పట్టుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ నాయకుల పరిస్థితి సిలబస్ పూర్తి చేసుకుని రివిజన్ చేసుకుంటున్న విద్యార్ధుల్లా ఉంది. మూడేళ్లు ప్రభుత్వ పాలనను రివైజ్ చేసుకుంటూనే.. వచ్చే రెండేళ్లు ఎన్నికలకు సమాయత్తం అవుతోంది పార్టీ. ఈ మూడేళ్లలో ప్రభుత్వ పనితీరే కాదు ఎమ్మెల్యేల పనితీరు కూడా కీలకమే. అందుకే పార్టీ హైకమాండ్ కొద్దిరోజులుగా సర్వేల ప్రక్రియ చేపట్టింది. చాలా మంది ఎమ్మెల్యేల ప్రొగ్రస్ రిపోర్ట్ 40 నుంచి 45 శాతం దాటడం లేదని.. సరి చేసుకోవాలని పార్టీ అధినేత సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించారు. గ్రాఫ్ పెంచుకోవడానికి ఆరు నెలల నుంచి ఏడాది గడువు ఇచ్చారు. ఈ లోగా పరిస్థితిలో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తేల్చేశారు అధినేత.
వైసీపీ ఎమ్మెల్యేలలో దాదాపు మూడింట ఒక వంతు ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తిగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి సగటున 60 శాతం అనుకూలత వచ్చిందని చెబుతున్నారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు గాడిలో పడాల్సి ఉందని టాక్. క్షేత్రస్థాయిలో పెర్ఫార్మెన్స్ సరిగాలేని ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల నుంచి ఫోన్లు వెళ్తున్నాయట. తాడేపల్లికి రావాలని పిలుస్తున్నారు. కొంతమందితో నేరుగా సీఎం మాట్లాడుతున్నట్టు సమాచారం. మరికొందరికి సజ్జల రామకృష్ణారెడ్డి క్లాస్ తీసుకుంటున్నారట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ప్రస్తుతం ఈ డోస్ లెవెల్ ఫుల్గానే ఉందని.. క్షేత్రస్థాయిలో మీ గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది అంటూ సర్వే లెక్కలతోపాటు రిపోర్ట్ కార్డును తమను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేల ముందు పెడుతున్నారట. లోపలు ఎక్కడున్నాయి? ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అవినీతి, ఇతర ఆరోపణలు ఉన్నాయా? సామాజికవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై వ్యక్తం అవుతున్న అభిప్రాయం… కార్యకర్తలు, కిందిస్థాయి నేతలు ఏమనుకుంటున్నారు? ఇలా అన్ని విషయాలపై సర్వే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. లోటుపాట్లను సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారట.
ఈ పోస్టుమార్టం చూశాక… వైసీపీ ఎమ్మెల్యేలలో అంతకంతకూ టెన్షన్ పెరగుతున్నట్టు సమాచారం. ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆందోళన చెందుతున్నారట. అసలు తమకు ఎన్ని మార్కులు పడ్డాయో..? తమ గ్రాఫ్ ఎలా ఉందో..? బార్డర్లోనైనా ఉన్నామా లేదా? అని పార్టీ వర్గాల దగ్గర ఆరా తీస్తున్నారట. తమ మీద తమకు కాస్త డౌట్ ఉన్న ఎమ్మెల్యేలు
ఇప్పటికే హైకమాండ్ దగ్గర క్లాస్ తీసుకున్న వారికి ఫోన్లు చేసి.. డోస్ ఏ లెవెల్లో ఉందో వాకబు చేస్తున్నారట. కొందరైతే తాము చేసిన పనుల జాబితాతో.. ఫైల్ సిద్ధం చేసుకుని పెట్టుకుంటున్నారట. స్టడీ క్లాసుల్లో స్టూడెంట్లా కొందరు ఎమ్మెల్యేలు చాలా సీరియస్గా హోంవర్కు చేస్తున్నారట. మొత్తానికి పార్టీ పెద్దల దగ్గర ఉన్న లిస్ట్లో లీస్ట్లో ఉన్నదెవరో? పాస్ మార్కులు పడ్డదెవరికో తెలియక నిద్రకు దూరమయ్యారట ఎమ్మెల్యేలు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!