TCongress: పార్టీ అక్షింతలు వేసినా.. ఆ నాయకుడి తీరులో మార్పు లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వడ్డేపల్లి సుభాష్రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్గా ఉన్న మదన్మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.
ఎల్లారెడ్డితోపాటు కామారెడ్డి, బాన్సువాడల్లోనూ మదన్ వేలు పెడుతున్నట్టు అక్కడ కాంగ్రెస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు ఇప్పటికే మదన్మోహన్పై కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ మధ్య మదన్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్. అయితే మదన్మోహన్ను సస్పెండ్ చేసే అధికారం డీసీసీకి లేదని పార్టీలో పెద్ద దుమారమే రేగింది.
Also Read
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
ఆ వివాదంపై చర్చ జరుగుతున్న సమయంలోనే పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట మదన్ హాజరై కామారెడ్డి నేతల ఫిర్యాదులపై వివరణ ఇచ్చారట. కలిసి పనిచేయాలని.. వివాదాలు సృష్టించొద్దని హైకమాండ్ పెద్దలు గట్టిగానే మదన్కు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత దూకుడు తగ్గిస్తారని పార్టీ నేతలు భావించారట. కానీ.. ఎల్లారెడ్డిలో అస్సలు తగ్గడం లేదట మదన్. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంఛార్జ్ సుభాష్రెడ్డిని కాదని లింగంపేట మండలం కోమట్పల్లిలో రచ్చబండ నిర్వహించారట. అదికాస్తా వివాదానికి దారితీసింది. కాంగ్రెస్లోని రెండు వర్గాలు ఘర్షణ పడటంతో రచ్చ రచ్చ అయింది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ను చీల్చేస్తున్నారని సుభాష్రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారట. అయితే రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నారని మదన్ వర్గం కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది.
కాంగ్రెస్ బలంగా ఉందని లెక్కలు వేస్తున్న చోట వర్గపోరు రకరకాలుగా మలుపులు తిరుగుతుండటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. కేడర్ సైతం ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. అయితే నేతల మధ్య సమన్వయం చేయాల్సిన అధిష్ఠానం వెయింట్ అండ్ సీ అనే ధోరణిలో ఉండటం పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదట. పీసీసీ చీఫ్ జోక్యం చేసుకుంటే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఎల్లారెడ్డి కాంగ్రెస్లో రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
-
KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
-
Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
-
Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
-
UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!