TCongress: పార్టీ అక్షింతలు వేసినా.. ఆ నాయకుడి తీరులో మార్పు లేదా..?
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వడ్డేపల్లి సుభాష్రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్గా ఉన్న మదన్మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.
ఎల్లారెడ్డితోపాటు కామారెడ్డి, బాన్సువాడల్లోనూ మదన్ వేలు పెడుతున్నట్టు అక్కడ కాంగ్రెస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు ఇప్పటికే మదన్మోహన్పై కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ మధ్య మదన్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్. అయితే మదన్మోహన్ను సస్పెండ్ చేసే అధికారం డీసీసీకి లేదని పార్టీలో పెద్ద దుమారమే రేగింది.
Also Read
ఆ వివాదంపై చర్చ జరుగుతున్న సమయంలోనే పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట మదన్ హాజరై కామారెడ్డి నేతల ఫిర్యాదులపై వివరణ ఇచ్చారట. కలిసి పనిచేయాలని.. వివాదాలు సృష్టించొద్దని హైకమాండ్ పెద్దలు గట్టిగానే మదన్కు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత దూకుడు తగ్గిస్తారని పార్టీ నేతలు భావించారట. కానీ.. ఎల్లారెడ్డిలో అస్సలు తగ్గడం లేదట మదన్. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంఛార్జ్ సుభాష్రెడ్డిని కాదని లింగంపేట మండలం కోమట్పల్లిలో రచ్చబండ నిర్వహించారట. అదికాస్తా వివాదానికి దారితీసింది. కాంగ్రెస్లోని రెండు వర్గాలు ఘర్షణ పడటంతో రచ్చ రచ్చ అయింది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ను చీల్చేస్తున్నారని సుభాష్రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారట. అయితే రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నారని మదన్ వర్గం కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది.
కాంగ్రెస్ బలంగా ఉందని లెక్కలు వేస్తున్న చోట వర్గపోరు రకరకాలుగా మలుపులు తిరుగుతుండటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. కేడర్ సైతం ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. అయితే నేతల మధ్య సమన్వయం చేయాల్సిన అధిష్ఠానం వెయింట్ అండ్ సీ అనే ధోరణిలో ఉండటం పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదట. పీసీసీ చీఫ్ జోక్యం చేసుకుంటే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఎల్లారెడ్డి కాంగ్రెస్లో రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!