TCongress: పార్టీ అక్షింతలు వేసినా.. ఆ నాయకుడి తీరులో మార్పు లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వడ్డేపల్లి సుభాష్రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్గా ఉన్న మదన్మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.
ఎల్లారెడ్డితోపాటు కామారెడ్డి, బాన్సువాడల్లోనూ మదన్ వేలు పెడుతున్నట్టు అక్కడ కాంగ్రెస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు ఇప్పటికే మదన్మోహన్పై కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ మధ్య మదన్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్. అయితే మదన్మోహన్ను సస్పెండ్ చేసే అధికారం డీసీసీకి లేదని పార్టీలో పెద్ద దుమారమే రేగింది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ఆ వివాదంపై చర్చ జరుగుతున్న సమయంలోనే పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట మదన్ హాజరై కామారెడ్డి నేతల ఫిర్యాదులపై వివరణ ఇచ్చారట. కలిసి పనిచేయాలని.. వివాదాలు సృష్టించొద్దని హైకమాండ్ పెద్దలు గట్టిగానే మదన్కు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత దూకుడు తగ్గిస్తారని పార్టీ నేతలు భావించారట. కానీ.. ఎల్లారెడ్డిలో అస్సలు తగ్గడం లేదట మదన్. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంఛార్జ్ సుభాష్రెడ్డిని కాదని లింగంపేట మండలం కోమట్పల్లిలో రచ్చబండ నిర్వహించారట. అదికాస్తా వివాదానికి దారితీసింది. కాంగ్రెస్లోని రెండు వర్గాలు ఘర్షణ పడటంతో రచ్చ రచ్చ అయింది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ను చీల్చేస్తున్నారని సుభాష్రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారట. అయితే రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నారని మదన్ వర్గం కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది.
కాంగ్రెస్ బలంగా ఉందని లెక్కలు వేస్తున్న చోట వర్గపోరు రకరకాలుగా మలుపులు తిరుగుతుండటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. కేడర్ సైతం ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. అయితే నేతల మధ్య సమన్వయం చేయాల్సిన అధిష్ఠానం వెయింట్ అండ్ సీ అనే ధోరణిలో ఉండటం పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదట. పీసీసీ చీఫ్ జోక్యం చేసుకుంటే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఎల్లారెడ్డి కాంగ్రెస్లో రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!