Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Vizag Leaders Troubles With Resolution

Off The Record: తీర్మానం ఆ నేతల కొంపముంచుతుందా?

Published Date :April 2, 2023 , 8:34 pm
By NTV WebDesk
Off The Record: తీర్మానం ఆ నేతల కొంపముంచుతుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒక్క తీర్మానం…. ఒకే ఒక్క తీర్మానం. అక్కడ వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. భవిష్యత్‌ రాజకీయం మీద బెంగ పట్టుకుంది. ఈసారి జనం మధ్యకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? ఒకవేళ వెళితే… ఎలాంటి ప్రశ్నలు వస్తాయో… ఏమని సమాధానం చెప్పుకోవాలోనని తెగ టెన్షన్‌ పడి పోతున్నారట అక్కడి అధికార పార్టీ నాయకులు. పైగా ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటున్న పరిధి అది. అధికార పార్టీ నాయకుల్ని అంతలా కంగారు పెట్టిస్తున్న తీర్మానం ఏంటి? ఆ ఏరియా ఎక్కడుంది? అక్కడ జరుగుతున్న పరిణామాలేంటి?

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

2019లో క్లీన్‌ స్వీప్‌
వై నాట్‌ 175 మూడ్‌లో ఉన్న వైసీపీ నేతల్ని ఇప్పుడు విశాఖ మన్యం షేక్‌ చేస్తోంది. ఇక్కడి ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో అధికార పార్టీది తిరుగులేని ఆధిపత్యం. పార్టీ ఆవిర్భావం నుంచి రెండు దఫాలుగా ఇక్కడ ఫ్యాన్ స్విఛాఫ్‌ చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు వేసిన ఎత్తుగడలు ఫలించ లేదు. అరకు పార్లమెంట్ సహా ఏడు అసెంబ్లీ స్ధానాల్లో గిరిజనుల ఓటు బ్యాంక్ కొల్లగొట్టడంలో సక్సెస్‌ అయింది వైసీపీ.
రంపచోడవరం, అరకు, పాడేరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ స్ధానాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నా యి. 2014లో ఒక్క పార్వతీపురం తప్ప అన్నిస్ధానాల్లో గెలిచిన వైసీపీ 2019నాటికి మొత్తం స్వీప్‌ చేసింది. కీలకమైన అరకు పార్లమెంట్ సీటును రెండు సార్లు భారీ మెజారిటీతో గెలుచుకుంది.

అడవి బిడ్డలకు అనుకూల నిర్ణయాలు
పాడేరు, చింతపల్లి, అరకు వ్యాలీ ప్రాంతంలో అడవిబిడ్డలు జీవన్మరణ సమస్యగా భావించే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది జగన్‌ సర్కార్‌. పాడేరులో మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం…కొత్త జిల్లాకు విప్లవ వీరుడు అల్లూరి నామకరణం వంటి నిర్ణయాలు ఇక్కడ అధికార పార్టీకి సానుకూలం అయ్యాయి. ఈ ప్రాంతానికి రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టు కట్టబెట్టింది. సీనియర్ నాయకులకు ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చాయి. ఇంక అంతా బాగానే ఉంది…. ఏజెన్సీలో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని వైసీపీ నేతలంతా కూల్‌ కూల్‌గా కూనిరాగాలు తీస్తున్న టైంలో ఉరుము లేని పిడుగులా వచ్చి పడింది అసెంబ్లీ తీర్మానం. అదే ఇప్పుడు ఇక్కడ అగ్గి రాజేస్తోంది. ప్రభుత్వం మీద గిరిజనుల్లో వ్యతిరేకత పెంచుతోంది.
.
బోయలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున రెండు తీర్మానాలను ఆమోదించింది కేంద్రానికి పంపింది జగన్‌ సర్కార్‌. వీటిలో ఒకటి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కాగా… రెండోది ఏపీలో ఉన్న బోయ కులస్తులను ఎస్టీల్లో చేర్చాలన్న తీర్మానం. ఈ రెండో పాయింట్‌ మీదే మండిపడుతున్నారు మన్యం గిరిజనులు. బోయలను మాతో కలిపి మా అవకాశాలను దెబ్బకొడతారా అంటూ… సీరియస్‌ అవుతున్నారు. ఇంకా మాట్లాడితే వైసీపీ ప్రజా ప్రతినిధులను మా ఏరియాల్లో తిరగనివ్వబోమని వార్నింగ్‌లు ఇస్తున్నారు గిరిజన నాయకులు. ఎమ్మెల్యేలు, ఎంపీ రాజీనామా చేయమని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశం మీదే ఏడు నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు జరుగుతున్నాయి. పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఫ్లెక్సీలకు నిప్పంటించారు. డివిజన్లు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, సంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రజావ్యతిరేకతను ప్రదర్శించేందుకు ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నాయి గిరిజన సంఘాలు. ఈ ఆందోళనలకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

తమ అభిప్రాయం తీసుకోలేదని గిరిజన నేతల ఆవేదన
రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా మింగుడుపడటం లేదు. కనీసం అభిప్రాయ సేకరణ లేకుండా… అంత సీరియస్‌ నిర్ణయం తీసేసుకుని చివరిగా… పార్టీ విధేయతకు కట్టుబడమంటే ఎలాగని అడుగుతున్నారు. జరిగే పరిణామాలకు తమ రాజకీయ భవిష్యత్‌ బుగ్గి అవుతుందేమోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 5, 6 షెడ్యూల్స్‌లోని
గిరిజనుల విద్య, ఉద్యోగ,రాజకీయ ప్రాధాన్యతలు తీవ్రంగా ప్రభావితం అవుతాయనే ఆందోళన వుంది. బోయ వాల్మీకులను ఎస్టీలుగా అంగీకరిస్తే భవిష్యత్తులో మరికొన్ని వర్గాలు తమకు రిజర్వేషన్లు ఇవ్వాలనే రాజకీయ డిమాండ్ ను తెరపైకి తీ సుకుని రావొచ్చనే భయం ఆదివాసీ సంఘాల్లో కనిపిస్తోంది. దీంతో మన్యం ప్రాంత ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారు. ఎంత ఒకవేళ పార్టీ ఇమేజ్ మీద గెలిచినా స్ధానిక పరిస్ధితులకు తామే బాధ్యత వహించాల్సి రావాలికదా..అన్న ఆందోళన కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కదిలించిన రిజర్వేషన్ల తేనెతుట్టె ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందోననే టెన్షన్ ఏజెన్సీ ఎమ్మెల్యేల్ని వెంటాడుతోంది. నేరుగా హైకమాండ్ ఎదుట తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఆస్కారం లేక పార్టీ ముఖ్యనేతలను ఆశ్రయిస్తున్నారట ప్రజాప్రతి
నిధులు. ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్ద దిక్కుగా భావిస్తున్న ఓ సీనియర్ మంత్రి దగ్గరికి వెళ్ళి కొందరు ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెళ్ళగక్కినట్టు సమాచారం.

2017లో ఇదే తీర్మానం చేసిన టీడీపీ సర్కార్‌
వాస్తవానికి బోయ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కొత్తగా తెరమీదికి వచ్చింది కాదు. 2017లో టీడీపీ సర్కార్ ఇదే తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అప్పటి నుంచి అక్కడే పెండింగ్‌లో ఉండిపోగా..ఈ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించి రిపోర్ట్‌ తెప్పించుకుంది. వివిధ రాష్ట్రాల్లో బోయలు ఎస్టీలుగా చెలామణి అవుతున్నందున ఈ డిమాండ్ సహేతుకమైందనే ఆలోచన వుంది జగన్‌ సర్కార్‌. అయితే టీడీపీకంటే ఈ ఏరియాలో తమకే ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు దాని జోలికి వెళ్ళడమంటే మన వేలితో మన కన్నే పొడుచుకోవడం అవుతుందన్న భయం స్థానిక ఎమ్మెల్యేల్లో ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే… అధినాయకత్వం ముందు కనీసం తమ గోడు వెళ్ళబోసుకునే అవకాశం లేకుండా పోయిందన్న అసహనం ఎక్కువ మంది గిరిజన శాసనసభ్యుల్లో కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • cm jagan
  • off the recod
  • Vizag

తాజావార్తలు

  • Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..

  • Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

  • Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్‌.. పాన్‌ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!

  • UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!

  • Vishwambhara : విశ్వంభ‌ర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions