Off The Record: కేడర్ చేజారుతున్నా ప్రేక్షకపాత్రేనా?
పేనుకు పెత్తనం ఇస్తే.. ఇంకేదో చేసినట్టుగా ఉందట ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. కేడర్ చేజారిపోతున్నా.. నాయకులది ప్రేక్షకపాత్రే. ఏజెన్సీలో కీలక సెగ్మెంట్ కావడం.. అధిష్ఠానం నాన్చుడు ధోరణి తమ్ముళ్లలో బీపీ పెంచుతోందట.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
2004 నుంచి రంపచోడవరంలో టీడీపీ డల్..!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ST రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. ఆమె ఒంటెద్దు పోకడలకు పోతున్నారనేది కేడర్ ఆరోపణ. మూడున్నరేళ్లుగా శ్రేణులు చెల్లాచెదురవుతున్నా పట్టించుకోవడం లేదట. వంతలతో పడని మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్లు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు రంపచోడవరం టీడీపీకి కంచుకోట. టీడీపీ పోటీలో లేకపోతే సైకిల్ పార్టీ మద్దతుతో ఇక్కడ వామపక్షాలు బరిలో ఉండేవి. 2004 నుంచి సీన్ మారింది. 2004, 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తర్వాత వైసీపీకి పట్టం కట్టారు రంపచోడవరం ఓటర్లు.
అధిష్ఠానం పిలుపిచ్చిన కార్యక్రమాల ఉసూ లేదా?
2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి తర్వాత కండువా మార్చేశారు. 2019 ఎన్నికల్లో సీనియర్లను కాదని రాజేశ్వరికే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్ఠానం. దాంతో మాజీ ఎమ్మెల్యేలు అలిగినట్టు చెబుతారు. దీనికితోడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని రాజేశ్వరిపై ఆరోపణలు ఉన్నాయి. అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల ఊసే లేదట. ఏదైనా చేస్తే మొక్కుబడిగా ఉంటోందనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల కోసం కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
పార్టీ కార్యక్రమాలు పట్టవు.. పోటీకి నేతలు సై
మరోసారి పోటీకి రాజేశ్వరి ఆసక్తితో ఉండగా.. టీడీపీ నేత గొర్లె సునీత సైతం కర్చీఫ్ వేస్తున్నారట. మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ.. మాజీ మంత్రులతో టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారట. టిడిపి టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది క్వశ్చన్ మార్క్ కావడంతో నేతలు సైలెంట్ అయ్యారు. ఒకరంటే ఒకరికి గిట్టక కార్యకర్తలు సైతం గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నేతలే కాకుండా.. శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్ కూడా టీడీపీ ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటున్నారట. అయితే అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పార్టీ జెండా మోస్తారని.. మిగిలిన వాళ్లు దూరంగా ఉంటారని ప్రచారం మొదలైంది. గడిచిన 4 ఎన్నికల్లో ఓడినా.. ఇక్కడి నేతలు గుణపాఠం నేర్చుకోలేదన్న కామెంట్సూ వినిపిస్తున్నాయి. మరి.. రంపచోడవరం టీడీపీకి పార్టీ పెద్దలు చికిత్స చేస్తారో లేక నాన్చుతారో చూడాలి.
తాజావార్తలు
-
Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్
-
Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!
-
West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
-
PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!