Off The Record: కేడర్ చేజారుతున్నా ప్రేక్షకపాత్రేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేనుకు పెత్తనం ఇస్తే.. ఇంకేదో చేసినట్టుగా ఉందట ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. కేడర్ చేజారిపోతున్నా.. నాయకులది ప్రేక్షకపాత్రే. ఏజెన్సీలో కీలక సెగ్మెంట్ కావడం.. అధిష్ఠానం నాన్చుడు ధోరణి తమ్ముళ్లలో బీపీ పెంచుతోందట.
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
2004 నుంచి రంపచోడవరంలో టీడీపీ డల్..!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ST రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. ఆమె ఒంటెద్దు పోకడలకు పోతున్నారనేది కేడర్ ఆరోపణ. మూడున్నరేళ్లుగా శ్రేణులు చెల్లాచెదురవుతున్నా పట్టించుకోవడం లేదట. వంతలతో పడని మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్లు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు రంపచోడవరం టీడీపీకి కంచుకోట. టీడీపీ పోటీలో లేకపోతే సైకిల్ పార్టీ మద్దతుతో ఇక్కడ వామపక్షాలు బరిలో ఉండేవి. 2004 నుంచి సీన్ మారింది. 2004, 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తర్వాత వైసీపీకి పట్టం కట్టారు రంపచోడవరం ఓటర్లు.
అధిష్ఠానం పిలుపిచ్చిన కార్యక్రమాల ఉసూ లేదా?
2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి తర్వాత కండువా మార్చేశారు. 2019 ఎన్నికల్లో సీనియర్లను కాదని రాజేశ్వరికే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్ఠానం. దాంతో మాజీ ఎమ్మెల్యేలు అలిగినట్టు చెబుతారు. దీనికితోడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని రాజేశ్వరిపై ఆరోపణలు ఉన్నాయి. అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల ఊసే లేదట. ఏదైనా చేస్తే మొక్కుబడిగా ఉంటోందనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల కోసం కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
పార్టీ కార్యక్రమాలు పట్టవు.. పోటీకి నేతలు సై
మరోసారి పోటీకి రాజేశ్వరి ఆసక్తితో ఉండగా.. టీడీపీ నేత గొర్లె సునీత సైతం కర్చీఫ్ వేస్తున్నారట. మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ.. మాజీ మంత్రులతో టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారట. టిడిపి టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది క్వశ్చన్ మార్క్ కావడంతో నేతలు సైలెంట్ అయ్యారు. ఒకరంటే ఒకరికి గిట్టక కార్యకర్తలు సైతం గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నేతలే కాకుండా.. శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్ కూడా టీడీపీ ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటున్నారట. అయితే అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పార్టీ జెండా మోస్తారని.. మిగిలిన వాళ్లు దూరంగా ఉంటారని ప్రచారం మొదలైంది. గడిచిన 4 ఎన్నికల్లో ఓడినా.. ఇక్కడి నేతలు గుణపాఠం నేర్చుకోలేదన్న కామెంట్సూ వినిపిస్తున్నాయి. మరి.. రంపచోడవరం టీడీపీకి పార్టీ పెద్దలు చికిత్స చేస్తారో లేక నాన్చుతారో చూడాలి.
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!