Off The Record: కేడర్ చేజారుతున్నా ప్రేక్షకపాత్రేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేనుకు పెత్తనం ఇస్తే.. ఇంకేదో చేసినట్టుగా ఉందట ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. కేడర్ చేజారిపోతున్నా.. నాయకులది ప్రేక్షకపాత్రే. ఏజెన్సీలో కీలక సెగ్మెంట్ కావడం.. అధిష్ఠానం నాన్చుడు ధోరణి తమ్ముళ్లలో బీపీ పెంచుతోందట.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
2004 నుంచి రంపచోడవరంలో టీడీపీ డల్..!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ST రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. ఆమె ఒంటెద్దు పోకడలకు పోతున్నారనేది కేడర్ ఆరోపణ. మూడున్నరేళ్లుగా శ్రేణులు చెల్లాచెదురవుతున్నా పట్టించుకోవడం లేదట. వంతలతో పడని మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్లు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు రంపచోడవరం టీడీపీకి కంచుకోట. టీడీపీ పోటీలో లేకపోతే సైకిల్ పార్టీ మద్దతుతో ఇక్కడ వామపక్షాలు బరిలో ఉండేవి. 2004 నుంచి సీన్ మారింది. 2004, 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తర్వాత వైసీపీకి పట్టం కట్టారు రంపచోడవరం ఓటర్లు.
అధిష్ఠానం పిలుపిచ్చిన కార్యక్రమాల ఉసూ లేదా?
2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి తర్వాత కండువా మార్చేశారు. 2019 ఎన్నికల్లో సీనియర్లను కాదని రాజేశ్వరికే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్ఠానం. దాంతో మాజీ ఎమ్మెల్యేలు అలిగినట్టు చెబుతారు. దీనికితోడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని రాజేశ్వరిపై ఆరోపణలు ఉన్నాయి. అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల ఊసే లేదట. ఏదైనా చేస్తే మొక్కుబడిగా ఉంటోందనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల కోసం కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
పార్టీ కార్యక్రమాలు పట్టవు.. పోటీకి నేతలు సై
మరోసారి పోటీకి రాజేశ్వరి ఆసక్తితో ఉండగా.. టీడీపీ నేత గొర్లె సునీత సైతం కర్చీఫ్ వేస్తున్నారట. మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ.. మాజీ మంత్రులతో టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారట. టిడిపి టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది క్వశ్చన్ మార్క్ కావడంతో నేతలు సైలెంట్ అయ్యారు. ఒకరంటే ఒకరికి గిట్టక కార్యకర్తలు సైతం గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నేతలే కాకుండా.. శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్ కూడా టీడీపీ ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటున్నారట. అయితే అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పార్టీ జెండా మోస్తారని.. మిగిలిన వాళ్లు దూరంగా ఉంటారని ప్రచారం మొదలైంది. గడిచిన 4 ఎన్నికల్లో ఓడినా.. ఇక్కడి నేతలు గుణపాఠం నేర్చుకోలేదన్న కామెంట్సూ వినిపిస్తున్నాయి. మరి.. రంపచోడవరం టీడీపీకి పార్టీ పెద్దలు చికిత్స చేస్తారో లేక నాన్చుతారో చూడాలి.
తాజావార్తలు
-
Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?