Off The Record : సిక్కోలు టీడీపీలో కులాల కుంపట్లు అంటుకుంటున్నాయా?
- శ్రీకాకుళం టీడీపీ అధ్యక్ష పదవిపై పీటముడి
- తెర మీదికి కులాల లెక్కలు
- వెలమ నుంచి మంత్రులుగా కింజరాపు బాబాయ్, అబ్బాయ్
- తూర్పు కాపు, కాళింగ కులాల మధ్య గట్టి పోటీ
- అధ్యక్ష రేస్లో బలంగా వినిపిస్తున్న మూడు పేర్లు
- వెలమలకు మంత్రి పదవులు, కాళింగులకు ప్రభుత్వ విప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కోలు టీడీపీలో కులాల కుంపట్లు అంటుకుంటున్నాయా? మేటర్ తూర్పు కాపు వర్సెస్ కాళింగలా మారిపోయిందా? వెలమ నేతలు ఎటువైపు మొగ్గితే అటు ప్లస్ అవుతుందా? అసలు జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? ఏ విషయంలో కుల కోణాలు ముందుకు వచ్చాయి? శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని నియమించబోతోంది టీడీపీ. దీనికి సంబంధించిన కసరత్తు మొదలైపోయింది. ఆశావహులంతా ఓ రేంజ్లో ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కులాల కోణంలో… ఎవరికి వారు పావులు కదుపుతూ…. మాకంటే మాక్కావాలంటూ డిమాండ్ చేస్తున్నారట. ఆ లెక్కన చూసుకుంటే… వెలమ కమ్యూనిటీ తరపున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఇద్దరు మంత్రులు… బాబాయ్, అబ్బాయ్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే… అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పార్టీలో కీలకంగా ఉన్నారు. అందుకే జిల్లా అధ్యక్ష పదవిని కూడా వెలమ సామాజికవర్గానికి ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చూస్తే… జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్న తూర్పు కాపు , కాళింగ కమ్యూనిటీల వైపు పార్టీ పెద్దలు చూస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసి ఆయా కులాలకు చెందిన కొందరు నాయకులు ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారట. పార్టీలోని తమ గాడ్ ఫాదర్స్ ద్వారా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రేస్లో ప్రధానంగా మాజీ జట్పీటిసి, మార్క్ఫెడ్ డైరెక్టర్ అనెపు రామకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, ఆమదాలవలస టిడిపి నేత మెదలవలస రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే కాళింగ కమ్యూనిటీకి చెందిన మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి అలియాస్ బాబ్జీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉండరన్న అంశంపై గట్టి ప్రచారం ఉంది. దీంతో… ఆమదాలవలసకు చెందిన అదే సామాజికవర్గం నాయకుడు మెదలవలస రమేష్ను తెరపైకి తీసుకువచ్చారట కాళింగ నేతలు. ఉమ్మడి జిల్లాలో భాగమైన ఎచ్చెర్ల నియోజకవర్గం ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఒకవేళ చౌదరి బాబ్జీ అభ్యర్దిత్వం చెల్లకుంటే టిడిపి సీనియర్ నేత, మాజీ గ్రంధాలయ చైర్మన్, తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన పీరుకట్ల విఠల్ , లేదా ఆనెపు రామకృష్ణకు పదవి దక్కుతుందని భావించారట. ఐతే… బాజ్జీ కాని పక్షంలో రమేష్ కు అవకాశం కల్పించాలని ఆమదాలవలస లాబీ గట్టి ప్రయత్నాల్లో ఉందని తెలియడంతో… ఉత్కంఠ పెరుగుతోంది.
ఈ క్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షరేస్లో ఈ మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కాపు వర్సెస్ కాళింగలా మాదిరి మారి రెండు సామాజిక వర్గాలనేతలు పావులు కదుపుతున్నారట. ఇదే సమంలో ఇంకో లెక్క కూడా తెర మీదికి వస్తోంది. వెలమలకు మంత్రి పదవులు, కాళింగులకు ప్రభుత్వ విప్ రూపంలో కేబినెట్ ర్యాంక్ దక్కింది కాబట్టి…జిల్లా అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆనెపు రామకృష్ణ లేదా పీరుకట్ల విఠల్లో ఎవరో ఒకరికి ఇవ్వమన్న విన్నపాలు టీడీపీ అధిష్టానానికి వెళ్తున్నాయట. తాజాగా విశాఖలో పర్యటించిన పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు మంత్రి లోకేష్ను కలిసి జల్లాలో అత్యధికంగా ఉన్న కాపులకు ప్రభుత్వ పరంగా , పార్టీ పరంగా న్యాయం చేయాలని అడిగారట కాపు సామాజిక వర్గం నాయకులు. మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావ్ విజయనగరం జిల్లా చీపురుపల్లికి మారిన తరువాత కాపులకు ఎలాంటి అవకాశాలు జిల్లాలో దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట ఆ సామాజిక వర్గం నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన ఆనెపు రామకృష్ణ లేదా విఠల్లో ఎవరినైనా అధ్యక్ష స్దానంలో కూర్చోపెట్టాలనికోరుతున్నారు కాపులు. అయితే… ఆనెపు రామకృష్ణకు సొంత నియెజకవర్గం ఆమదాలవలస నేతలే అడ్డంకిగా మారుతున్నారట. తను అన్నగా భావించే ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధు ప్రీతితో వ్యవహరిస్తూ అడ్డు తగులుతున్నారన్నది ఆయన ఆవేదనగా తెలుస్తోంది. ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్నా , సొంత సెగ్మెంట్ ఆమదాలవలస ఎమ్మెల్యే అంత సుముఖత వ్యక్తం చేయటం లేదన్నది పార్టీలో ఇంటర్నల్ టాక్. రామకృష్ణ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కావాలంటే… ముందు ఇంట గెలవాల్సి ఉందని అంటున్నారు. కాపు వర్సెస్ కాళింగలా తయారైన ఈ కుల పంచాయితీలో వెలమ నాయకులు కింజరాపు ఫ్యామిలీ ఎటువైపు మెగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. త్రీ మెన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ తో పాటు ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకుని పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు. ఫైనల్గా అధిష్టానం ఓటు ఎటువైపు పడుతుందోనన్న ఆసక్తి పెరుగుతోంది సిక్కోలు టీడీపీ వర్గాల్లో.
Also Read
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!