Off The Record : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది?
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది?
- అదే అంశంపై పదేపదే ఎందుకు బలంగా వాదిస్తోంది?
- పొంగులేటిని గులాబీ పార్టీ టార్గెట్ చేసుకోవడానికి బలమైన కారణం వుందా?
- ఏ ఆధారాలు....ఆయుధం అయ్యాయని చెబుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకంతగా దృష్టిపెట్టింది? అదే అంశంపై పదేపదే ఎందుకు బలంగా వాదిస్తోంది? పొంగులేటిని గులాబీ పార్టీ టార్గెట్ చేసుకోవడానికి కారణమేంటి? ఏ ఆధారాలు….ఆయుధమని చెబుతోంది? తెలంగాణలో రాజకీయం అంతా రాఘవ కన్స్ట్రక్షన్స్ చుట్టే తిరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీగా చెబుతున్న BRS..దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. క్రషర్ కు పర్యావరణ అనుమతులు లేవని, జీఓ నెంబర్ 111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని చాలా కాలంగా గులాబీ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో ఈ అంశాన్ని సభలో లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీ. రెండు రోజులపాటు నిరసన తెలిపింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని గా పట్టుబట్టారు. ఇదే అంశంపై శాసనసభలో ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు సస్పెండ్ కూడా అయ్యారు.
విజువల్స్
అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై బీఆర్ఎస్ ఎందుకంతగా ఫోకస్ పెట్టింది అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పొంగులేటి ఇష్యూపై బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్కు అనుమతులు లేవని, పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. స్వయంగా ప్రభుత్వమే జరిమానా విధించిందని చెబుతోంది. ఈ జరిమానాల ఆధారాలనే ఆయుధంగా మలచుకున్నామంటోంది గులాబీ పార్టీ. సభలో పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించింది. దీనితో పాటు రెండున్నరేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన సుమారు 19 స్కాములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. స్వయంగా మంత్రికి చెందిన మైనింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణల ఇష్యూను అంత ఈజీగా వదలొద్దని డిసైడ్ అయ్యామంటోంది బీఆర్ఎస్.
Also Read
తాజావార్తలు
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!