Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
- ప్రధాని హైదరాబాద్ పర్యటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గా మారిందా?
- ఒకేసారి చంద్రబాబు, పవన్ నివాసాలకు వెళ్లి రాజకీయ వేడి పెంచారా?
- తెలంగాణలో కూడా ఏపీ తరహాలో కూటమి కట్టే ప్రయత్నమని సంకేతాలా?
- తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన జోడీ సాధ్యమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని హైదరాబాద్ పర్యటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గా మారిందా? ఒకేసారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు ప్రధాని వెళ్లి రాజకీయ వేడి పెంచారా? తెలంగాణలో కూడా ఏపీ తరహాలో కూటమి కట్టే ప్రయత్నమని సంకేతాలిచ్చారా? తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన జోడీ సాధ్యమా? ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లారు. చాలాసేపు మాట్లాడారు. వీరి సమావేశం సాధారణంగా కనిపిస్తున్నా…రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారా అనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణ ఎన్నికలు మరో రెండున్నరేళ్లలో జరగబోతున్నాయి. దీంతో ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కూటమి కడతారా అనే చర్చ జరుగుతోంది. టిడిపి, జనసేన, బిజెపి కలిపి ఏపీలో ఏ రకంగా అయితే కూటమిలో ఉన్నారో….అదే రకమైన కూటమి….తెలంగాణలో కూడా వుంటుందా అంటూ వాడివేడిగా చర్చ సాగుతోంది.
పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్లారంటే సర్జరీ జరిగింది…పరామర్శకు వెళ్లారు అనుకోవచ్చు. కానీ అటు సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోడీ వెళ్లారు. దీంతో సహజంగానే రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో ఓట్లు చీలకుండా పొత్తులో భాగంగా సీట్లు పంచుకున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన 2014లో చివరిసారిగా తెలంగాణలో కలిసి పోటీ చేశాయి. అయితే, తర్వాత టీడీపీ తెలంగాణలో బలహీనపడింది. ఆంధ్రా పార్టీ అన్న ముద్ర పడింది. పార్టీలోని కీలక నాయకులంతా చెరో పార్టీకి చెదిరిపోయారు. అయినా లీడర్లు వెళ్లిపోయినా, క్యాడర్ పరంగా తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ బలంగా వుంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఓటు బ్యాంక్ వుంది. జనసేనకు కూడా తెలంగాణలో కమిటీలున్నాయి.
Also Read
పార్టీ నిర్మాణం కూడా కొంతవరకు వుంది. ఎలాగూ ఏపీలో కూటమిగా వున్నాయి కాబట్టి…తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. కానీ ఆంధ్రా మూలాలున్న పార్టీలతో జతకడితే…బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదులకు టార్గెట్ అవుతామని తెలంగాణ బీజేపీ నేతలు వెనకా ముందు ఆలోచించారు. అయితే, ఇప్పుడా పరిస్థితులు లేవని కొందరు తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలకుండా, మరిన్ని సీట్లు గెలవొచ్చని బీజేపీ లెక్కలేస్తోంది. ఈ దిశగా చంద్రబాబు, పవన్లతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారా? లేదంటే పర్యటనలో భాగంగా కేవలం పరామర్శలు, పలకరింపులకు పరిమితం అయ్యారా…రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పొత్తు పొడుస్తుందా అనేది త్వరలోనే తేలుతుంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!