Off The Record : సిద్దిపేట కాంగ్రెస్ లో నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి
- సిద్దిపేట కాంగ్రెస్లో నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి
- గతంలో పిడి గుద్దులు, పోలీస్ కేసుల దాకా వ్యవహారం
- ఈసారి డీసీసీ అధ్యక్ష పదవికి 128 దరఖాస్తులు
- నర్సారెడ్డి వర్గానికి పదవి దక్కకుండా మైనంపల్లి పావులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీసీసీ ప్రకటనతో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజుకుందా..? ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కకుండా ఆ మాజీ ఎమ్మెల్యే వేసిన స్కెచ్ వర్కౌట్ అవలేదా? ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాలో అధికార పార్టీ గ్రూపు గోల ఏ మలుపు తిరగబోతోంది? ఎక్కడ జరుగుతోందా పంచాయితీ? సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. కానీ… గ్రూప్ వార్ మాత్రం వీధిన పడి తన్నుకుంటూ…..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే స్థాయిలో ఉంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్గాలుగా పార్టీ విడిపోయింది. నర్సారెడ్డి మీద సొంత పార్టీ నేతలే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు పెట్టారు. ఈ గ్రూపు తగదాలు తీవ్ర స్థాయికి చేరి పిడిగుద్దుల వరకూ వెళ్లింది. డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డే స్వయంగా దాడి చేశారని ఆరోపించారు మైనంపల్లి వర్గీయులు. దాంతో నర్సారెడ్డి మీద ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ అయ్యాయి. అప్పట్లో పంచాయతీ పిసిసికి చేరింది. దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ పలుమార్లు నర్సారెడ్డితో భేటీ కూడా అయ్యింది. ఆ వ్యవహారాన్ని కాసేపు అలా ఉంచితే… ఈ సారి డిసిసి అధ్యక్ష పదవి కోసం ఏకంగా 128 దరఖాస్తులు వచ్చాయి. అయినా… పోటీ మాత్రం నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాల మధ్యనే ఉంది. ఎవరికి వారు తమ వాళ్ళకు డీసీసీ పోస్ట్ ఇప్పించేందుకు పోటీ పడ్డారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ సారి డిసిసి పీఠం నర్సారెడ్డికి దక్కొద్దని మైనంపల్లి వర్గం పావులు కదిపినట్లు ప్రచారం జరిగింది. అయినాసరే… ఫైనల్గా నర్సారెడ్డి కూతురు ఆకాంక్షరెడ్డికే పదవి దక్కింది. యువ నాయకురాలు కావడం ఆమెకు ప్లస్ అయిందని చెప్పుకుంటున్నారు.
తాము ఎంతగా వ్యతిరేకించినా… ప్రత్యర్థి వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా దక్కిందంటూ…డైలమాలో పడిందట మైనంపల్లి గ్రూప్. ఆ విషయంలో పెద్ద లాబీయింగే జరిగినట్టు లెక్కలేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో నర్సారెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న నాయకులు హైదరాబాద్లో రహస్యంగా సమావేశం అయ్యారు. డీసీసీ పోస్ట్ నర్సారెడ్డి కూతురికి ఇవ్వొద్దని, మరొకరి పేరు పరిశీలించాలన్నది వాళ్ళ డిమాండ్. సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, గజ్వేల్ కాంగ్రెస్ నేత బండారు శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు విజయ్ తో పాటు మరికొంతమంది నాయకులు రహస్యంగా మీట్ అయ్యారు. మొదట ఈ అంశంపై పీసీసీకి ఫిర్యాదు చేయాలనుకున్నా… మనసు మార్చుకుని జిల్లా నుంచి భారీగా జనసమీకరణతో గాంధీ భవన్కి వెళ్ళే ప్లాన్లో ఉందట నర్సారెడ్డి వ్యతిరేక వర్గం. అందుకు ఓ వాట్సాప్ గ్రూపును కూడా క్రియేట్ చేసి దానికి ఆపరేషన్ ఏ అని పేరు పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి నర్సారెడ్డే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూతురికి అవకాశం దక్కింది. మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అసలే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపు గొడవలు క్యాడర్ ని కలవరపెడుతున్నాయట. ప్రతిపక్ష BRS బలంగా ఉన్న జిల్లాలో సొంత పార్టీ వాళ్ళే ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు యత్నిస్తే తీవ్ర నష్టం తప్పదన్నది కేడర్ టెన్షన్. కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే ఇరు వర్గాలకు సర్దిచెప్పి సయోధ్య కుదర్చకుంటే… జిల్లాలో గట్టి దెబ్బే తగులుతుందన్న భయం వ్యక్తం అవుతోంది జిల్లా పార్టీ వర్గాల్లో. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ మొదలుకాకముందే హైకమాండ్ హ్యాపీ ఎండ్ ఇస్తుందా..? లేదా చూడాలి మరి.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
తాజావార్తలు
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని ఫైర్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?