Off The Record: సహచరులకు ఇబ్బందిగా మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
- తెలంగాణ కేబినెట్లో కొత్త రకం గందరగోళం..
- సంబంధంలేని వ్యవహారాల్లో కామెంట్స్తో ఇరకాటం..
- నాడు రైతు రుణమాఫీ విషయంలోనూ ఇదే తంతు..
- తాజాగా స్థానిక ఎన్నికలపై పొంగులేటి కామెంట్స్ వివాదం..
- నడుస్తున్న కులగణన ఎపిసోడ్, కోర్ట్ పరిధిలో మేటర్..
- మంత్రి స్టేట్మెంట్స్తో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం..
- పొంగులేటిని వివరణ కోరిన పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్..
- ఆయన అలా ఎలా మాట్లాడతారని ఓ మంత్రి సీఎంనే ప్రశ్నించారా?..
- అన్ని శాఖలతో ఆయనకేం పని అని ఓ మంత్రి మీనాక్షితో అన్నారా?..
- మా శాఖల సంగతులు ఆయనకెందుకన్న అసహనం..
- పొంగులేటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రం అయ్యాయా?..
- సహచరులకు ఇబ్బందిగా పొంగులేటి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కేబినెట్లో అందరికీ ఆయనే ఎందుకు టార్గెట్ అయ్యారు? స్వయంకృతమా? లేక వేరే కారణాలేమన్నా ఉన్నాయా? కేబినెట్ సహచరుల్లో ఎక్కువ మందికి ఆయన తీరు నచ్చడం లేదా? వ్యవహారం చినికి చినికి గాలివానగా ఎందుకు మారుతోంది?
Read Also: Ahmedabad plane crash: DNA ద్వారా 163 మృతదేహాల గుర్తింపు.. 124 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!
Also Read
- OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
- OTR : వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధం అయిందా? ఆ ముగ్గురు నేతల పరిస్థితి ఏంటి?
- OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే
- OTR : సొంత వైఎస్సార్సీపీకి షాకిస్తున్న ఎమ్మెల్సీ.. పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వెనుక ఆంతర్యమేంటి?
తెలంగాణ మంత్రులు ఒకరిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న కొన్ని విషయాలు కాస్త రచ్చకు దారితీస్తున్నాయి. తమ శాఖలకు సంబంధం లేని విషయాల విషయాల గురించి కూడా కామెంట్స్ చేస్తుండటంతో.. మిగిలిన మంత్రులు నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్కు కూడా చెప్పుకున్నారట. ప్రభుత్వ పథకాలపై మంత్రుల కామెంట్స్తో చాలా రోజులుగా గందరగోళం పెరుగుతోంది. ప్రత్యేకించి రైతు రుణ మాఫీ వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల ప్రకటనలే గందరగోళానికి దారితీశాయి అన్నది పార్టీలో ఓపెన్ టాక్. దీనికి ఎక్కడో ఒకచోట పుల్ స్టాప్ పెట్టాలని అప్పట్లో చర్చ జరిగింది. కానీ సీఎంకి సన్నిహితంగా ఉండే మంత్రులు అవ్వడంతో ఎవరు ఏం చెప్పలేకపోయారట. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి దారితీశాయి.
Read Also: Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన రెండు భారీ మూవీలు..
ఇక, ఓవైపు కులగణన ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. కోర్టులో ఇంకా గ్రీన్ సిగ్నల్ రానేలేదు. ఈ పరిస్థితిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన అంశాలపై కామెంట్స్ చేయడం, దానిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో.. రచ్చ మొదలైందని అంటున్నారు. ఒక క్లారిటీకి రాకముందే అలాంటి స్టేట్మెంట్స్ వల్ల బయటికి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయానికి అటు పీసీసీ చీఫ్ తో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చిందట. దాంతో పొంగులేటికి మహేష్ గౌడ్ ఫోన్ చేసి వివరణ తీసుకున్నట్టు సమాచారం. వేరే మంత్రుల శాఖలకు సంబంధించిన సబ్జెక్టు గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని అడిగినట్టు పీసీసీ చీఫ్ అడిగినట్టు తెలుస్తోంది. ఒక శాఖకు సంబంధించిన వ్యవహారంపై వాళ్ళకు తెలియకుండా.. మరో మంత్రి ఎలా కామెంట్ చేస్తారంటూ.. ఓ క్యాబినెట్ మినిస్టర్ నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన మీకి సన్నిహితుడు కాబట్టి.. మీరే చెప్పి అలా మాట్లాడించి ఉంటారని అంతా అనుకుంటున్నట్టు సీఎం దృష్టికి తీసుకువెళ్ళారట సదరు మినిస్టర్. ఇంకో మంత్రి అయితే.. మేటర్ని డైరెక్ట్గా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్ళి.. అన్ని శాఖల గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డే ఎలా మాట్లాడతారని ప్రశ్నించినట్టు సమాచారం. తెలంగాణ కేబినెట్లోని చాలా మంది మంత్రుల్లో ఈ తరహా అసహనం ఉందట. మాకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఆయనెలా మాట్లాడతారంటూ వాళ్ళంతా స్ననిహితులతో అంటున్నట్టు తెలుస్తోంది.
Read Also: Cataract: కంటిశుక్లం హానికరమా..? కాదా..?
అయితే, పొంగులేటి సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల ముఖ్యమంత్రే ఆయనతో చెప్పి మాట్లాడిస్తున్నారన్న అనుమానంతో ఇన్నాళ్ళు గమ్ముగా ఉన్నారట చాలా మంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో రైతు రుణమాఫీపై ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల ప్రకటనలే పార్టీలో, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయన్నది ఓపెన్ టాక్. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువే కానీ.. ఇంకో మంత్రి విషయంలో జోక్యం చేసుకుంటే అది ఇద్దరి మధ్య రచ్చకు దారి తీసే ప్రమాదమే ఎక్కువ. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలను పొంగులేటి ముందే చెప్పటం, కోర్టులో పెండింగ్లో ఉన్న అంశంపై స్పష్టత లేకుండానే ప్రకటన ఇవ్వడంతో గందరగోళం పెంచి ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టయిందన్నది పార్టీ పెద్దల అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలపై సీతక్క కూడా మాట్లాడారంటూ… పొంగులేటి వర్గం సోషల్ మీడియాలో చర్చకు పెట్టింది. అయితే.. కేబినెట్ మీటింగ్ గురించి కానీ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన అంశాలను గాని తాను ఎక్కడా మాట్లాడలేదని మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు సీతక్క. మిగతా శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలన్న కోరిక పొంగులేటికి డైరెక్ట్గా ఉండి ఉండకపోవచ్చుగానీ.. సందర్భానుసారం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మిగతా సహచరులకు ఎక్కడో గుచ్చుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆయన కూడా సంయమనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!