Off The Record : కాంగ్రెస్తో మహిపాల్ రెడ్డి కటీఫ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఎమ్మెల్యే ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీలో చేరారో గానీ ఎప్పుడూ వివాదాలేనట. పైగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ ఫిర్యాదులు. వరుస వివాదాలు వెంటాడుతున్నా ఆయన మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారా..? ఏకంగా పార్టీనే ధిక్కరించే స్థాయికి మేటర్ వెళ్తోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ పార్టీ అభ్యర్థి బరిలో ఉండగా… ఎమ్మెల్యే అనుచరుడు బరిలో దిగడాన్ని ఎలా చూడాలి? అతనికి ఎవరి ఆశీస్సులున్నాయి? ఎవరా ఎమ్మెల్యే? ఆయన వ్యూహం ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ తరపున గెలిచి నిరుడు జూలై 15న అనుచరగణంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాత్రం మహిపాల్ రెడ్డి చేరినప్పటి నుంచి ఎడమొహంగానే ఉంటున్నారు. పైగా… ఇక్కడ పార్టీకి నష్టం చేయడానికే వచ్చారంటూ ఆరోపిస్తున్నారు. మహిపాల్ రెడ్డి మాత్రం వాటి మీద పెద్దగా రియాక్ట్ అవలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని అభివృద్ది కార్యక్రమాలకు తమని ఆహ్వానించడంలేదంటూ గత జనవరిలో పెద్ద పంచాయితీనే నడిచింది. పార్టీలో ఉంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని…ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలంటూ ధర్నాకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. తీవ్ర గందరగోళం తర్వాత ఎట్టకేలకు క్యాంపు ఆఫీస్లో సీఎం ఫోటో కూడా పెట్టగలిగాయి కాంగ్రెస్ శ్రేణులు. మరోవైపు పటాన్ చెరులో వర్గపోరుపై పీసీసీ ఓ కమిటీ వేసి ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ని అడిగి వివరణ కూడా తీసుకుంది. ఇక ఆ వివాదం ముగిసిందో లేదో ఇప్పుడు మరో అంశం తెరపైకివచ్చింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీపీ యాదగిరి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
Also Read
దీంతో మరోసారి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఆయన నామినేషన్ వేశారు కూడా. కానీ పార్టీలోనే ఉంటూ అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినట్టు ఎమ్మెల్యే అనుచరుడు నామినేషన్ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరోసారి ఎమ్మెల్యేపై హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం రెడీ అవుతున్నట్టు సమాచారం. శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్టీలో చేరక ముందు, చేరిన తర్వాత కూడా ఎమ్మెల్యేకి ఆయనకి పడట్లేదు. జనవరిలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తన ఆఫీస్లో ఎందుకు ఉందంటే పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన నాయకుడి ఫోటో ఉంటే తప్పేంటని అడిగారాయన. సీఎం రేవంత్ ఫోటో ప్రస్తావన వస్తే మాత్రం తనకి ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేదంటే లేదని అన్నారు. ఇప్పుడు ప్రధాన అనుచరుడి నామినేషన్ అంశంపై ఎందుకు పెదవి విప్పడంలేదని ఎమ్మెల్యేని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ క్యాడర్. దీనిపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో దోస్త్తీ కటీఫ్ చేసుకొందామని ఎమ్మెల్యే అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ నాయకుల మద్దతుకోరే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేకి తెలియకుండా ఆయన అనుచరుడు నామినేషన్ వేసే అవకాశం ఉండదన్నది ఒక వాదన. దీంతో అసలు మహిపాల్ రెడ్డి ఏం చేయదల్చుకున్నారు. ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది అంతుపట్టట్లేదంటోందట కేడర్. ఈ ఎపిసోడ్పై కాంగ్రెస్ హైకమాండ్ పై ఏ విధంగా స్పదిస్తుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!