Off The Record : జాగృతి అధ్యక్షురాలు కవిత స్వరం మార్చారా.? ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా?
- జాగృతి అధ్యక్షురాలు కవిత స్వరం మార్చారా?
- పదేపదే బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొగడ్తల సారాంశమేంటి?
- బీఆర్ఎస్ వల్లే సాగునీరు అందుతోందన్న వ్యాఖ్యల మర్మమేంటి?
- బీఆర్ఎస్ క్యాడర్ సపోర్ట్ లేకుంటే కష్టమని భావిస్తున్నారా?
- ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కవిత చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాగృతి అధ్యక్షురాలు కవిత స్వరం మార్చారా….ఇన్నాళ్లు పరోక్షంగా బీఆర్ఎస్ను…ప్రత్యక్షంగా అదే పార్టీ ముఖ్య నేతలను తిట్టిన కవిత…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కవిత చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి? ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆదిలాబద్ టూర్లో మొదటి రోజు వ్యవసాయ మార్కెట్ లో పత్తి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తేమ నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయని, దానిపై జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. తమ బీఆర్ఎస్ హయాంలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు తలచుకుంటే రైతుల సమస్య పరిష్కారం అవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖరాస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చారామే. హరీష్ రావు,అలాగే సంతోష్ రావ్ తోపాటు బీఆర్ఎస్ ను చాలా రోజులుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఆమెపైన వేటు సైతం పడింది. కానీ కవిత మాత్రం మా ప్రభుత్వ కాలంలో అలా ఉండేది..మా బీఆర్ఎస్ ఇలా చేసిందంటూ వ్యాఖ్యానించడం అలవాటులో పొరపాటా లేక ఏదైనా కారణం ఉందా అనే చర్చ రాజకీయాల్లో సాగుతోంది.
సాగునీటి ప్రాజెక్టులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత. జిల్లాలోని చనాకా కొరాట బ్యారేజీని పరిశీలించారు. బీఆర్ఎస్ కాలంలో చనాకా కొరటా ప్రాజెక్ట్ 90 శాతం పూర్తైందని చెప్పారు. 10 శాతం పనులు కూడా కాంగ్రెస్ చేయటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టే…పక్కన పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఫైరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనులు భేష్ అంటూ కితాబిచ్చారు. తమ హయాంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందని పదేపదే కవిత చెప్పడం దేనికి సంకేతమన్నా డిస్కషన్ జరుగుతోంది.
Also Read
కేసిఆర్ చుట్టూ దయ్యాలు,కోవర్టులు అంటూ తీవ్ర విమర్శలు చేసిన కవిత…సడెన్ గా ఇలా మాట్లాడడం గులాబీ క్యాడర్కే అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ క్రెడిట్ ను ఓన్ చేసుకోవాలని కవిత భావిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు సైతం తనకు సహకరించేలా అలాంటి వ్యాఖ్యలు చేశారా అనే కామెంట్లు రీసౌండ్నిస్తున్నాయి. మా బీఆర్ఎస్ పాలన అంటూ లౌక్యంగా మాట్లాడుతున్నారా…రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ క్యాడర్ దూరం కాకుండా ఇలా వ్యాఖ్యానిస్తున్నారా? ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి తిరిగి గులాబీ పార్టీని పొగుడుతున్నారా అనే డౌట్స్ కార్యకర్తల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని లేదా తన కుటుంబ సభ్యులనే ఎందుకు విమర్శించాలనుకున్నారో ఏమోకానీ కొంత ఊగిసలాట ధోరణి మాత్రం కవితలో స్పష్టంగా కనపడుతోందన్న టాక్ వినిపిస్తోంది.
కవితలో మాత్రం మార్పు కనపడుతోంది. అప్పటిలా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చెయ్యడం లేదు. కాంగ్రెస్, బీజేపీలపై ధాటిగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ,బీజేపీలను టార్గెట్ చేస్తే ఉమ్మడి శత్రువును వ్యతిరేకించే వారి మద్దతు లభిస్తుందనే అభిప్రాయంతో ఇలా యూటర్న్ తీసుకున్నారా డిస్కషన్ సాగుతోంది.
- Tags
- Kavitha
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!