Off The Record : జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై కాంగ్రెస్ ఆశలు
- జూబ్లీహిల్స్ లో లక్షా ఇరవై వేలకు పైగా మైనార్టీల ఓట్లు
- సన్న బియ్యం లబ్ధిదారులను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేలా ప్రణాళికలు
- ఓటర్ మ్యాపింగ్ పనిలో కార్పొరేషన్ చైర్మన్లు
- సినిమా కార్మికుల ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక లక్ష్యం…రెండు అస్త్రాలు..జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. అవే తమకు విజయ తిలకం దిద్దుతాయని లెక్కలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్…అన్ని రకాలుగా పైచేయి సాధించే పనిలో పడింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగిస్తోంది. ప్రభుత్వం ఏం చేసిందని అడిగే వాళ్లకు… రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్… తెల్ల రేషన్ కార్డు…సన్న బియ్యం.. ఉచిత ఆర్టీసీ బస్సు లాంటి అంశాలను ఫోకస్ చేస్తోంది. మహిళల ఓటు బ్యాంకు మీద ఎక్కువ ఫోకస్ చేసింది. మహిళా సంఘాలకు సంబంధించిన నాయకులు సభ్యులపై దృష్టి పెట్టింది. మంత్రులు ప్రతి పోలింగ్ బూతు స్థాయికి వెళ్లడంతో స్థానికంగా ఉండే అవసరాలను నాయకులు చక్కబట్టే పనిలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీల ఓటు బ్యాంకు లక్షా ఇరవై వేల పైచిలుకు ఉంటుంది. ఇటీవల అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటంతో ఆ ఓటు బ్యాంకును తమవైపు పూర్తిగా తిప్పుకునే పని చేసింది కాంగ్రెస్. అటు మైనార్టీలో కూడా చీలికలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ప్రత్యర్థి పార్టీని ఇరుకునపెడుతూ మైనార్టీల్లో…మెజార్టీ ఓట్లను సాధించే పనిలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. జూబ్లీహిల్స్ లో ఉన్న మైనార్టీ కీలక నేతలందరితో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ రెండుసార్లు సమావేశం అయ్యారు. వారి నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకున్నారు. మాస్ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. తెల్ల రేషన్ కార్డులు… సన్న బియ్యం లబ్ధిదారులను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లు ఓటర్ మ్యాపింగ్ పనిలో పడ్డారు. మరోవైపు సినిమా కార్మికుల ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్మికులతో సమావేశం అయ్యారు. వారి మౌలికమైన సమస్యల పరిష్కారానికి ఆదేశాలు కూడా వెళ్లాయి. కార్మికుల ఓట్లు ఒకవైపు…మైనార్టీ ఓట్లు మరోవైపు… సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు చీలకుండా కాంగ్రెస్కు వేయించే పనిలో ఉన్నారు మంత్రులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని రకాల ఎత్తుగడలను కాంగ్రెస్ అనుసరిస్తోంది. ప్రతి 100 ఓట్లకు ఒక నాయకుడిని నియమించి పర్యవేక్షిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..