Off The Record: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య చర్చ మొదలైందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య సయోధ్య కుదిరిందని అనుకుంటున్న తరుణంలో కొత్త చర్చ మొదలైందా? రాజ్భవన్ దర్బార్లపై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోందా? రాష్ట్ర సర్కార్ రియాక్షన్ ఏంటి?
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
రాజ్భవన్ దర్బార్లపై మళ్లీ రాజకీయ చర్చ
తెలంగాణకు గవర్నర్గా వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు తమిళిసై. అందులో కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర సర్కార్కు కంటగింపుగా మారడంతో రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ వచ్చింది. రెండు రాజ్యాంగ వ్యవస్థలు చర్చల్లో నలిగాయి. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ, బడ్జెట సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయడంతో రెండు వ్యవస్థల మధ్య వాతావరణం తేలికపడింది. రాజకీయ ఘర్షణకు ఫుల్స్టాప్ పడిందని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే ఈ మార్పు మూణ్ణాళ్ల ముచ్చటేనా అని అధికారపార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీనికి రాజ్భవన్లో జరుగుతున్న దర్బార్లను వాళ్లు కారణంగా ప్రస్తావిస్తున్నారట.
కేంద్ర బడ్జెట్పై రాజ్భవన్లో చర్చా గోష్టిలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాజ్భవన్లో చర్చాగోష్టిలు నిర్వహిస్తున్నారు గవర్నర్ తమిళిసై. ఈ సమావేశాలే చర్చగా మారుతున్నాయి. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర సర్కార్ పెదవి విరిచింది. రాష్ట్రానికి మళ్లీ మొండి చెయ్యే ఇచ్చారనేది గులాబీ నేతల ఆగ్రహం. అయితే అదే కేంద్ర బడ్జెట్పై రాజ్భవన్లో నిర్వహిస్తున్న దర్బార్లే గులాబీ శిబిరంలో గుసగుసలకు వేదికయ్యాయి. కేంద్ర బడ్జెట్ను రాష్ట్ర సర్కార్ విమర్శిస్తే.. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను అభినందించారు గవర్నర్. కేంద్ర చిట్టాపద్దును ఫ్యూచరిస్టిక్ బడ్జెట్గా ప్రశంసించారు కూడా. ఆ తర్వాత వరస సమావేశాలు పెడుతున్నారు తమిళిసై.
చర్చల్లో పాల్గొంటున్న నిపుణులు..!
కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆరోగ్యరంగానికి కేటాయింపులు.. ఇచ్చిన ప్రాధాన్యాలపై గవర్నర్ అధ్యక్షతనే సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వైద్య నిపుణులు పాల్గొన్నారు. హెల్త్కేర్కు భారీ కేటాయింపులు చేయడం వల్ల దేశంలో సుస్థిరమైన ఆరోగ్యం సంరక్షణ సాధ్యమనేది గవర్నర్ తమిళిసై అభిప్రాయం. విద్యా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఇచ్చిన కేటాయింపులపైనా చర్చాగోష్టి నిర్వహించారు. రాజ్భవన్లో గతంలో ఈ విధమైన కార్యక్రమాలు జరగకపోవడంతో గులాబీ నేతలు అటెన్షన్లోకి వచ్చారు. రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య సామరస్య వాతావరణం నెలకొందని అనుకుంటున్న తరుణంలో తాజా దర్బార్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని సందేహిస్తున్నారట నేతలు. కేంద్ర బడ్జెట్ను కొనియాడుతూ నిర్వహించిన సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అవుతారా లేక చూసీ చూడనట్టు వదిలేస్తారా అనేది ప్రశ్న.
తాజావార్తలు
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..