Off The Record: ఆ ఎంపీని ఎమ్మెల్యేలు రానివ్వడం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారంతా అధికారపార్టీలోని ప్రజాప్రతినిధులు. ఆయన ఎంపీ.. వాళ్లంతా ఎమ్మెల్యేలు. ఎంపీ కదలికలు అనుమానం కలిగించాయో ఏమో.. ఎమ్మెల్యేలు ఆయన్ను దూరం పెట్టేశారు. ఎంపీ కూడా అటు వెళ్లడం ఎందుకు అని కామ్ అయ్యారట. మంత్రులు వచ్చినప్పుడే తళుక్కుమంటున్నారట ఎంపీ. అదెక్కడో.. వాళ్లెవరో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఎంపీ పాటిల్ తీరుపై ఎమ్మెల్యేల డౌట్
బీబీ పాటిల్. జహీరాబాద్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2014లో భారీ మెజార్టీతో గెలిచిన బీబీ పాటిల్… రెండోసారి మాత్రం చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అయ్యింది ఆయన పరిస్థితి. 6 వేల 2వందల 29 ఓట్ల తేడాతో గట్టెక్కారు. అప్పట్లో ఎమ్మెల్యేలతో పొసగకపోవడమే మెజారిటీ తగ్గడానికి కారణమన్న ప్రచారం నడిచింది. దానికితోడు పాటిల్ వ్యవహార శైలి ప్రశ్నలకు ఆస్కారం కల్పించింది. అయితే రోజులు గడిచాక ఎంపీకి లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలకు మధ్య కొంత సఖ్యత కుదిరినా.. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందట.
నియోజకవర్గాల్లో ఎంపీకి సొంత వర్గాలు?
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్లో శాసనసభ్యుడు మాణిక్రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో ఎంపీ పాటిల్కు పడటం లేదు. అంతా బీఆర్ఎస్ నాయకులే అయినా వాళ్లకు పొసగడం లేదు. ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ పరిధిలో నిర్వహించే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవడం లేదట. దీనికి కారణం కూడా ఉందంట. ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ ప్రత్యేకంగా తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట. తన సామాజికవర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విషయం తెలిసి ఎంపీని దూరం పెడుతున్న ఎమ్మెల్యేలు?
అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా కొందరికి కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తున్నారట ఎంపీ. అది తెలిసి ఎమ్మెల్యేలు కయ్మంటున్నారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ ఎమ్మెల్యేలు.. ఎంపీ పాటిల్ను దూరం పెడుతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ నియోజకవర్గాలకు వచ్చినా తన పని తాను చేసుకుని అక్కడి నుంచి సైడైపోతున్నారట ఎంపీ. తన వద్దకు వచ్చిన నాయకులను, కార్యకర్తలను మాత్రమే కలుస్తున్నారట. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కామారెడ్డి జిల్లాకే ప్రాధాన్యం ఇస్తున్నారట.
మంత్రులు వస్తేనే కనిపిస్తున్న ఎంపీ పాటిల్?
మంత్రులు లేదా ఇతర ముఖ్యుల పర్యటన ఉన్నప్పుడు మాత్రమే సంగారెడ్డి జిల్లాలో కనిపిస్తున్నారట ఎంపీ పాటిల్. మొత్తానికి ఎంపికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందని.. అది ప్రచారం కాదని గులాబీ శ్రేణులు ఓపెన్గా మాట్లాడేస్తున్నాయి. మరి ఈ విషయాన్ని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!