Off The Record: వైసీపీ కోసం మళ్లీ రంగంలోకి పీకే?
- వైసీపీ కోసం మళ్లీ రంగంలోకి పీకే?..
- 2029 ఎన్నికల్లో వైసీపీకి మళ్లీ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు?..
- పాదయాత్రతో పాటు ఎన్నికల మానిటరింగ్కు స్ట్రాటజీ?..
- మరోసారి రిషీ సింగ్కు ఛాన్స్ ఇవ్వకపోవచ్చా?..
- ఇషా సింగ్ అనే పీకే పాత బ్యాచ్ కన్సల్టెంట్పైనా జోరుగా ప్రచారం..
- రావాలి జగన్..కావాలి జగన్ క్యాంపెయిన్ వెనుక ఇషాసింగ్..
- ఏకంగా పీకేనే సీన్లోకి దిగుతున్నారని పార్టీలో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: 2029 ఎన్నికలే టార్గెట్గా వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. 2024 ఓటమి తర్వాత పార్టీ లోపల పూర్తి రీస్ట్రక్చరింగ్ మొదలైంది. 2019 ఎన్నికలకు ముందులాగానే పార్టీ అధినేత జగన్ స్వయంగా ప్రతీ అంశాన్ని మానిటర్ చేస్తున్నారు. పొలిటికల్ గా పార్టీకి మైలేజ్ ఇచ్చే ఏ అంశాన్నీ వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తమ కేడర్ తిరిగి యాక్టివ్ అయ్యిందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో ఈసారి దెబ్బతిన్న చోటే గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యారట జగన్. ఇప్పటికే వచ్చే ఏడాది ప్లీనరీ తర్వాత పాదయాత్ర 2.0 ఉంటుందని ప్రకటించిన ఆయన.. కేడర్ తో సమావేశమైన ప్రతీసారి ఒక్కొక్క లీక్ ఇస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పీకే గురించి అలాంటి డిస్కషనే వైసీపీలో జరుగుతోంది. 2019లో వైసీపీ భారీ విజయం సాధించటంలో కీలకపాత్ర పోషించిన పీకే మళ్లీ రంగంలోకి దిగనున్నాడన్న చర్చ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఐ ప్యాక్ పేరుతో ఒకప్పుడు జగన్కు స్ట్రాటజీ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్ 2024లో టీడీపీకి నేరుగా కాకపోయినా మార్గదర్శనం చేశారు. గత ఎన్నికల సమయంలో రిషీ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ వైసీపీ కోసం పనిచేసినప్పటికీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో తిరిగి ప్రశాంత్ కిషోర్ టీం సిద్దమవుతున్నారని చెబుతున్నారు. తాను ఏ పార్టీకీ ఎలక్షన్ స్ట్రాటజీలు చేయనని చెప్పినా.. రాజకీయ పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న పీకే తిరిగి తన పనికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఆయన టీం ఈ విషయాన్ని అఫీషియల్గా ధృవీకరించడం లేదు.
Also Read
- OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
- Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్కు కూడా భారమేనా?
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- Off The Record: ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించడంలో విఫలం..? ఉన్నతాధికారులు కాస్త తేడాగా ఉన్నారా?
ఇదే సమయంలో మరో కొత్త పేరు కూడా తెరమీదకు వస్తోంది. ఐ ప్యాక్ నుంచే బయటకు వచ్చిన ఇషా సింగ్ అనే కన్సల్టెంట్ వైసీపీకి పని చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఐప్యాక్తో సంబంధం లేకుండా ఆమె స్వతంత్రంగా వ్యూహాలు సిద్ధం చేస్తారని, గతంలో రావాలి జగన్.. కావాలి జగన్ క్యాంపెయిన్ వెనుక కూడా ఈమెనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పటికీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదని టాక్. జగన్ మాత్రం మరోసారి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి 2029లో తిరిగి అధికారంలోకి రావాలని గట్టిగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ తర్వాత పాదయాత్ర మొదలవుతుంది. దీంతో వచ్చే ఏడాది పాదయాత్రను.. ఆ తర్వాత ఎన్నికలను మానిటర్ చేసేందుకు వ్యూహకర్తల నియామకం ఉండవచ్చనేది పార్టీ వర్గాల టాక్. అప్పటి వరకూ జరిగేది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల కన్సల్టెంట్లు పార్టీ అధినేతలను కలవటం.. తమ సంస్థల అనుభవాలు, విజయాలు చెప్పటంతో పాటు ఆయా పార్టీల కోసం తాము చేయబోయే యాక్షన్ ప్లాన్ రఫ్ డ్రాఫ్ట్ ను వివరించటం కామన్ గా జరగుతుంటాయి. కలిసిన ప్రతీ ఒక్కరికి బాధ్యతలు అప్పగించటం జరగదని.. కొన్ని సందర్బాల్లో కలిసిన వ్యక్తులే బయటకు లీకులు ఇస్తుంటారు తప్ప ఫైనల్ చేసినట్లు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.
అయితే వ్యూహాలు మారొచ్చు.. వ్యూహకర్తలు మారొచ్చు కానీ లక్ష్యం మాత్రం అధికారం లోకి రావటమేనని చెబుతున్నారు పొలిటికల్ పండిట్స్. వైసీపీ కేడర్ మాత్రం ఐ ప్యాక్ మీద గుర్రుగా ఉండటంతో మరోసారి రిషీ సింగ్ అండ్ కో కు మాత్రం అవకాశం ఇవ్వక పోవచ్చని అంచనా వేస్తున్నారు. కన్సల్టెంట్లు ఒక్కోసారి కన్ఫర్మ్ అయినప్పటికీ హైప్ కోసం అఫీషియల్ గా అనౌన్స్ చేయటానికి సమయం పట్టవచ్చని చెప్పుకొస్తున్నారు. మరి ఈ స్ట్రాటజిస్ట్ల అంశంలో జరుగుతున్న ప్రచారాల్లో నిజమెంత? ప్రశాంత్ కిశోర్ రీఎంట్రీ ఖాయమా? లేక కొత్తగా ఎవరైనా వస్తారా.. వైసీపీ అధినేత జగన్ ఫైనల్ ప్లాన్ ఏంటి.. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!