Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అతుకుల బొంతల మారుతుందా..?
- ఉమ్మడి గుంటూరు స్థానిక సంస్థల్లో వైసీపీకి బలం..
- వైసీపీ తరపున జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టినా..
- అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జిల్లాను స్వీప్ చేసిన కూటమి..
- కార్పొరేషన్లో బలం ఉన్నా మేయర్ పదవి కాపాడుకోలేకపోయిన వైసీపీ..
- నాయకుల మధ్య సమన్వయ లోపంతో టీడీపీకి లైన్ క్లియర్..
- ఎన్నికలకు ముందు టీడీపీలోకి జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టినా..
- అవిశ్వాస తీర్మానం పెడతామని దూకుతున్న జడ్పీటీసీలు..
- సరిపడా బలం ఉన్నా పట్టించుకోని వైసీపీ జిల్లా లీడర్స్.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. బలం ఉన్న చోట కూడా దాన్ని చాటుకోలేకపోతున్నామంటూ జిల్లా నేతల మీద కేడర్లో అసహనం పెరిగిపోతోందట. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీలతోపాటు గుంటూరు కార్పొరేషన్ను తన ఖాతాలో వేసుకుంది. అటు ఎంపీటీసీ, జడ్పీటీసీలదీ అదే పరిస్థితి. కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లు ఉంటే… అందులో 46 డివిజన్స్ని దక్కించుకుంది వైసీపీ. ఇక ఉమ్మడి జిల్లా మొత్తం 57 జడ్పీటీసీ స్థానాలుంటే వాటిలో 53 ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడ్డాయి. దీంతో కొల్లిపర నుంచి గెలిచిన కత్తెర హెనీ క్రిస్టినా జడ్పీ ఛైర్పర్సన్ అయ్యారు. అయితే అదంతా గతం. ఇక ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లను స్వీప్ చేసేసింది కూటమి. ఇక అప్పటి నుంచి జిల్లా వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యే ఎంపీ సీట్లు గెలవలేకపోయారు సరే… ఉన్న పదవులను అయినా కాపాడుకోగలుగుతున్నారా అంటే అదీ లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి పూర్తిబలం ఉన్నా మేయర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మేయర్ కు, నాయకులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారు మాకెందుకులే అని చేతులెత్తేయడంతో మేయర్ పీఠం కూటమికి దక్కింది. పైకి మాత్రం పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చిన జిల్లా వైసీపీ నేతలు…. తీరా టైం వచ్చినప్పుడు పట్టించుకోకుండా కాడి పడేయడంతో… మెజార్టీ కార్పొరేటర్స్ టీడీపీ పంచన చేరారు. ఇదే సమయంలో మేయర్గా ఉన్న కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో టీడీపీకి తేలిగ్గా లైన్ క్లియర్ అయినట్టయింది. అప్పట్లో దీని గురించి వైసీపీలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఇక జిల్లా పరిషత్ విషయానికి వస్తే… ఛైర్పర్సన్ హెనీ క్రిస్టినా ఎన్నికలకు ముందే టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక ఎలక్షన్ తర్వాత వైసీపీ జడ్పీటీసీలు కనీసం జిల్లా పరిషత్ మీటింగ్స్కు కూడా వెళ్లకుండా దూరంగా ఉన్నారు. దాంతో కోరం లేక మూడు సార్లు సమావేశాలు వాయిదా పడ్డాయి. జడ్పీ ఛైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ సభ్యులు ఉన్నచోట్ల బిల్లులు మంజూరు చెయ్యడంలేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకువెళ్లి అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదట. ఎన్నికలకు ముందే 12మంది జడ్పీటీసీలు టీడీపీలో చేరారు.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
దీంతో జిల్లా పరిషత్లో వైసీపీ బలం 41కి తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినవారిపై అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్లు పూర్తవ్వాలన్న నిబంధన ఉంది. ఆ లెక్కన చూసుకున్నా… సెప్టెంబర్ 25తో నాలుగేళ్లు పూర్తయ్యాయి. కూటమి నేతలు ఇతర జిల్లాల్లో పలు చోట్ల అవిశ్వాసాలు పెట్టి పీఠాలు దక్కించుకున్న క్రమంలో… గుంటూరులో మనం కూడా అదే పని చేద్దామని కొందరు వైసీపీ జడ్పీటీసీలు భావించారట. రొంపిచర్ల జడ్పీటీసీ ఓబుల్ రెడ్డి అయితే…అవిశ్వాసం పెడతామని ఓపెన్గా ప్రకటించారు కూడా . సాధారణంగా… అవిశ్వాసం పెట్టాలంటే… తీర్మానంపై సభ్యుల్లో టూ థర్డ్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. గుంటూరు జడ్పీలో వైసీపీకి 41మంది సభ్యులున్నారు. ఆ లెక్కన అవిశ్వాస తీర్మానంపై 36మంది సంతకాలు చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ బలమే ఉన్నా… పార్టీ నాయకులు వెనకడుగు వేయడం కొందరు సొంత జడ్పీటీసీలకే నచ్చడం లేదట. అలా ఎందురు నాన్చుతున్నారంటే… జిల్లాలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం లేదన్నది సమాధానం. నాయకుల మధ్య సమన్వయలోపమే అసలు సమస్య అంటున్నాయి వైసీపీ శ్రేణులు. పార్టీ మారిన ఛైర్మన్ను దెబ్బకొట్టాలని జడ్పీటీసీల్లో బలంగా ఉన్నా జిల్లా నాయకుల వైఖరితో వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారట. దీంతో గుంటూరు జిల్లా పరిషత్లో మనది బలమా బలహీనతా అని మాట్లాడుకుంటోంది వైసీపీ కేడర్.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!