Off The Record: రెండేళ్లకే ఇలా ఎందుకు..? అధికారంలో ఉన్నవాళ్లను కంగారు పెడుతుందేంటీ..?
- విపక్ష నేత జగన్ దగ్గరికి వివిధ వర్గాల బాధితులు..
- సంఖ్య పెరిగిపోతుండటంపై కూటమి వర్గాల్లో చర్చ..
- రెండేళ్ళకే ఇలా ఎందుకు జరుగుతోందని తర్జన భర్జన..
- అమరావతి రైతులు, ఆశాలు, డీఎస్సీ అభ్యర్థులు, ఆక్వా రైతులు..
- మనం అర్జీలు తీసుకుంటున్నా అలా ఎందుకన్న డిస్కషన్..
- వెన్నుపోటుకు రెండేళ్లు విజయవంతమైందన్న అభిప్రాయం..
- ఇన్ని సమస్యలు ఉన్నాయా అన్న చర్చ మొదలవుతుందన్న భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వివిధ వర్గాల బాధితులు…. సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు క్యూ కడుతున్నారు,,? ఇంకా మూడేళ్ళ పాలన మిగిలి ఉండగానే… ఏంటీ పరిస్థితి…? మనం ప్రతి రోజు అర్జీలు తీసుకుంటున్నా.. ఎందుకు ఇలా జరుగుతోంది…? ఎక్కడ తేడా కొడుతోంది? అంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఈ తరహా చర్చలు పెరిగిపోతున్నాయట. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం అధికారంలో ఉన్నవాళ్ళ దగ్గరికి రావాలిగానీ… ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని కలిసి విన్నవించుకోవడం ఏంటంటూ… కూటమి నాయకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికి అయ్యింది.. రెండేళ్ళు మాత్రమే. ఇంకా మూడేళ్ళ పాలన మిగిలే ఉంది. అయినా సరే ఇంత త్వరగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, వాళ్లకు జగన్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడంటూ ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, ప్రస్తుతం పోరుబాట పడుతోంద కాబట్టి ఏవో చిన్నా చితకా ఇబ్బందుల గురించి చెప్పుకుంటే సరేగానీ… రకరకాల సమస్యల పేరుతో బాధితులంతా వరుసబెట్టి జగన్ను ఎందుకు కలుస్తున్నారంటూ ఆరా తీయడం మొదలైందని చెప్పుకుంటున్నారు.
ముందు అమరావతి రైతులు, తర్వాత ఆరోగ్య శ్రీ నిధులపై ఆశా యూనియన్, డీఎస్సీ 2026 పరీక్ష రాసి ఉద్యోగాలు రాని అభ్యర్థులు, రాజమండ్రి కల్తీ పాల బాధితులు, తాజాగా ఆక్వా రైతులు… ఇలా సమస్యలు ఉన్నవారంతా వరుసగా జగన్ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అటు డీఎస్సీ విషయంలో వైసీపీ దూకుడుగా వెళ్తోందా.. అనే చర్చ కూడా కూటమిలో జరుగుతోందట. ప్రతి వారం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్ అర్జీలు తీసుకుంటున్నారని… అదే విధంగా మంత్రులు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారని..అయినాసరే… ఇదేం పరిస్థితి అని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ జగన్ పిలిపించుకుని మాట్లాడుతున్నారని అనుకుందామనుకున్నా.. ఇలా వరసగా అంతా వెళ్లడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలంటున్నాయి కూటమి వర్గాలు.
Also Read
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
- OTR : తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీకి ఢిల్లీ పిలుపు..రేవంత్ టీమ్లో హైటెన్షన్ ఎందుకు?
రెండేళ్ళకే పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెలా మారుతుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. వైసీపీ నిర్వహించిన… వెన్నుపోటుకు రెండేళ్ళు కార్యక్రమం విజయవంతం అయిందని కూడా కూటమిలో గుసగుసలాడుకుంటున్నారట. వైసీపీ క్యాడర్ పెద్ద సంఖ్యలో బయటకు రావడం, కొన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం సక్సెస్ అవడం తమకు ఇబ్బందేనని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవైపు ప్రతిపక్షం నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అవడం, మరోవైపు వివిధ వర్గాల బాధితులు జగన్ను కలవడం కూటమి నేతల్ని ఆలోచనలో పడేస్తోందట. జగన్ దగ్గరకు ఇలాగే…. బాధితులు క్యూ కడుతుంటే…. సమస్యల పరిష్కారం సంగతి తర్వాతగానీ… అసలు రాష్ట్రంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న చర్చ మొదలవుతుందని, అంతిమంగా అది తమకు నష్టం చేస్తుందన్నది కూటమి నాయకుల భయంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్గాంధీ క్లారిటీ
-
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్..
-
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!