Off The Record: రెండేళ్లకే ఇలా ఎందుకు..? అధికారంలో ఉన్నవాళ్లను కంగారు పెడుతుందేంటీ..?
- విపక్ష నేత జగన్ దగ్గరికి వివిధ వర్గాల బాధితులు..
- సంఖ్య పెరిగిపోతుండటంపై కూటమి వర్గాల్లో చర్చ..
- రెండేళ్ళకే ఇలా ఎందుకు జరుగుతోందని తర్జన భర్జన..
- అమరావతి రైతులు, ఆశాలు, డీఎస్సీ అభ్యర్థులు, ఆక్వా రైతులు..
- మనం అర్జీలు తీసుకుంటున్నా అలా ఎందుకన్న డిస్కషన్..
- వెన్నుపోటుకు రెండేళ్లు విజయవంతమైందన్న అభిప్రాయం..
- ఇన్ని సమస్యలు ఉన్నాయా అన్న చర్చ మొదలవుతుందన్న భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వివిధ వర్గాల బాధితులు…. సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు క్యూ కడుతున్నారు,,? ఇంకా మూడేళ్ళ పాలన మిగిలి ఉండగానే… ఏంటీ పరిస్థితి…? మనం ప్రతి రోజు అర్జీలు తీసుకుంటున్నా.. ఎందుకు ఇలా జరుగుతోంది…? ఎక్కడ తేడా కొడుతోంది? అంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఈ తరహా చర్చలు పెరిగిపోతున్నాయట. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం అధికారంలో ఉన్నవాళ్ళ దగ్గరికి రావాలిగానీ… ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని కలిసి విన్నవించుకోవడం ఏంటంటూ… కూటమి నాయకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికి అయ్యింది.. రెండేళ్ళు మాత్రమే. ఇంకా మూడేళ్ళ పాలన మిగిలే ఉంది. అయినా సరే ఇంత త్వరగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, వాళ్లకు జగన్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడంటూ ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, ప్రస్తుతం పోరుబాట పడుతోంద కాబట్టి ఏవో చిన్నా చితకా ఇబ్బందుల గురించి చెప్పుకుంటే సరేగానీ… రకరకాల సమస్యల పేరుతో బాధితులంతా వరుసబెట్టి జగన్ను ఎందుకు కలుస్తున్నారంటూ ఆరా తీయడం మొదలైందని చెప్పుకుంటున్నారు.
ముందు అమరావతి రైతులు, తర్వాత ఆరోగ్య శ్రీ నిధులపై ఆశా యూనియన్, డీఎస్సీ 2026 పరీక్ష రాసి ఉద్యోగాలు రాని అభ్యర్థులు, రాజమండ్రి కల్తీ పాల బాధితులు, తాజాగా ఆక్వా రైతులు… ఇలా సమస్యలు ఉన్నవారంతా వరుసగా జగన్ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అటు డీఎస్సీ విషయంలో వైసీపీ దూకుడుగా వెళ్తోందా.. అనే చర్చ కూడా కూటమిలో జరుగుతోందట. ప్రతి వారం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్ అర్జీలు తీసుకుంటున్నారని… అదే విధంగా మంత్రులు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారని..అయినాసరే… ఇదేం పరిస్థితి అని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ జగన్ పిలిపించుకుని మాట్లాడుతున్నారని అనుకుందామనుకున్నా.. ఇలా వరసగా అంతా వెళ్లడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలంటున్నాయి కూటమి వర్గాలు.
Also Read
రెండేళ్ళకే పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెలా మారుతుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. వైసీపీ నిర్వహించిన… వెన్నుపోటుకు రెండేళ్ళు కార్యక్రమం విజయవంతం అయిందని కూడా కూటమిలో గుసగుసలాడుకుంటున్నారట. వైసీపీ క్యాడర్ పెద్ద సంఖ్యలో బయటకు రావడం, కొన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం సక్సెస్ అవడం తమకు ఇబ్బందేనని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవైపు ప్రతిపక్షం నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అవడం, మరోవైపు వివిధ వర్గాల బాధితులు జగన్ను కలవడం కూటమి నేతల్ని ఆలోచనలో పడేస్తోందట. జగన్ దగ్గరకు ఇలాగే…. బాధితులు క్యూ కడుతుంటే…. సమస్యల పరిష్కారం సంగతి తర్వాతగానీ… అసలు రాష్ట్రంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న చర్చ మొదలవుతుందని, అంతిమంగా అది తమకు నష్టం చేస్తుందన్నది కూటమి నాయకుల భయంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
-
Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
-
Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
-
Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!