Off The Record: రెండేళ్లకే ఇలా ఎందుకు..? అధికారంలో ఉన్నవాళ్లను కంగారు పెడుతుందేంటీ..?
- విపక్ష నేత జగన్ దగ్గరికి వివిధ వర్గాల బాధితులు..
- సంఖ్య పెరిగిపోతుండటంపై కూటమి వర్గాల్లో చర్చ..
- రెండేళ్ళకే ఇలా ఎందుకు జరుగుతోందని తర్జన భర్జన..
- అమరావతి రైతులు, ఆశాలు, డీఎస్సీ అభ్యర్థులు, ఆక్వా రైతులు..
- మనం అర్జీలు తీసుకుంటున్నా అలా ఎందుకన్న డిస్కషన్..
- వెన్నుపోటుకు రెండేళ్లు విజయవంతమైందన్న అభిప్రాయం..
- ఇన్ని సమస్యలు ఉన్నాయా అన్న చర్చ మొదలవుతుందన్న భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వివిధ వర్గాల బాధితులు…. సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు క్యూ కడుతున్నారు,,? ఇంకా మూడేళ్ళ పాలన మిగిలి ఉండగానే… ఏంటీ పరిస్థితి…? మనం ప్రతి రోజు అర్జీలు తీసుకుంటున్నా.. ఎందుకు ఇలా జరుగుతోంది…? ఎక్కడ తేడా కొడుతోంది? అంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఈ తరహా చర్చలు పెరిగిపోతున్నాయట. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం అధికారంలో ఉన్నవాళ్ళ దగ్గరికి రావాలిగానీ… ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని కలిసి విన్నవించుకోవడం ఏంటంటూ… కూటమి నాయకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికి అయ్యింది.. రెండేళ్ళు మాత్రమే. ఇంకా మూడేళ్ళ పాలన మిగిలే ఉంది. అయినా సరే ఇంత త్వరగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, వాళ్లకు జగన్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడంటూ ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, ప్రస్తుతం పోరుబాట పడుతోంద కాబట్టి ఏవో చిన్నా చితకా ఇబ్బందుల గురించి చెప్పుకుంటే సరేగానీ… రకరకాల సమస్యల పేరుతో బాధితులంతా వరుసబెట్టి జగన్ను ఎందుకు కలుస్తున్నారంటూ ఆరా తీయడం మొదలైందని చెప్పుకుంటున్నారు.
ముందు అమరావతి రైతులు, తర్వాత ఆరోగ్య శ్రీ నిధులపై ఆశా యూనియన్, డీఎస్సీ 2026 పరీక్ష రాసి ఉద్యోగాలు రాని అభ్యర్థులు, రాజమండ్రి కల్తీ పాల బాధితులు, తాజాగా ఆక్వా రైతులు… ఇలా సమస్యలు ఉన్నవారంతా వరుసగా జగన్ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అటు డీఎస్సీ విషయంలో వైసీపీ దూకుడుగా వెళ్తోందా.. అనే చర్చ కూడా కూటమిలో జరుగుతోందట. ప్రతి వారం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్ అర్జీలు తీసుకుంటున్నారని… అదే విధంగా మంత్రులు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారని..అయినాసరే… ఇదేం పరిస్థితి అని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ జగన్ పిలిపించుకుని మాట్లాడుతున్నారని అనుకుందామనుకున్నా.. ఇలా వరసగా అంతా వెళ్లడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలంటున్నాయి కూటమి వర్గాలు.
Also Read
రెండేళ్ళకే పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెలా మారుతుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. వైసీపీ నిర్వహించిన… వెన్నుపోటుకు రెండేళ్ళు కార్యక్రమం విజయవంతం అయిందని కూడా కూటమిలో గుసగుసలాడుకుంటున్నారట. వైసీపీ క్యాడర్ పెద్ద సంఖ్యలో బయటకు రావడం, కొన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం సక్సెస్ అవడం తమకు ఇబ్బందేనని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవైపు ప్రతిపక్షం నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అవడం, మరోవైపు వివిధ వర్గాల బాధితులు జగన్ను కలవడం కూటమి నేతల్ని ఆలోచనలో పడేస్తోందట. జగన్ దగ్గరకు ఇలాగే…. బాధితులు క్యూ కడుతుంటే…. సమస్యల పరిష్కారం సంగతి తర్వాతగానీ… అసలు రాష్ట్రంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న చర్చ మొదలవుతుందని, అంతిమంగా అది తమకు నష్టం చేస్తుందన్నది కూటమి నాయకుల భయంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!