Off The Record: యూత్ టార్గెట్గా తెలంగాణ బీజేపీ.. ట్రెండ్కు తగ్గట్టు కాషాయం ట్యూన్ మారుస్తోందా?
- జెన్ జీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో బీజేపీ..
- యువతరంతో నేరుగా మమేకమవుతున్న లీడర్స్..
- విద్యార్థి సమస్యల మీద వరుస కార్యక్రమాలు..
- విద్యార్థి, యువత సెంట్రిక్గా పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు..
- రామచంద్రరావు దీక్షకు మద్దతుగా స్టూడెంట్స్..
- పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు బీజేపీ మద్దతు..
- ఇఫ్లూ ఖేలో ఇండియా కార్యక్రమంలో కిషన్రెడ్డి..
- ఫేస్బుక్, ఇన్స్టా వాడకం నేర్చుకుంటున్న పాత తరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ట్రెండ్కు తగ్గట్టు కాషాయం ట్యూన్ అవుతోంది. పరిస్థితులు చేజారకుండా… ముందే జాగ్రత్త పడుతూ… బీజేపీ మరోసారి అధికార పీఠానికి నిచ్చెన వేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా…జెన్ జీకి దగ్గర కావాలని ప్రధాని మోడీ కమలం నేతలకు సూచించారు. దీంతో… నేటి తరంతో మమేకమై…నేరుగా టట్లో ఉండాలని పార్టీ నేతలు కూడా డిసైడ్ అయ్యారట. యూనివర్సిటీలకు వెళ్ళాలని ప్రధాని చేసిన సూచనను తూచా తప్పకుండా పాటించే దిశగా తెలంగాణ బీజేపీ నేతలు కూడా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే విద్యార్థి సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారట. RSS పరివార క్షేత్రమైన ఏబీవీపీ విద్యా రంగంలో పని చేస్తోంది. స్టూడెంట్ ఇష్యూస్ మీద కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినా సరే… అది సరిపోదంటూ… బీజేపీ, అనుబంధ మోర్చాల నాయకులు క్యాంపస్ బాట పడుతున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే… పార్టీనే నేరుగా విద్యార్థులకు దగ్గరగా ఉండాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోందంటున్నారు. వాళ్లను టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్, విపక్షాలు కార్యక్రమాలు చేస్తున్నాయని, మనం కూడా అదే రేంజ్లో గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే…. విద్యార్థి, యువత కేంద్రంగా కార్యక్రమాలు చేయక తప్పదని డిసైడయ్యారట కమలం లీడర్స్.
ఫీజు రీ యింబర్స్మెంట్ బకాయిలపై ఆ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. కాలేజీలకు వెళ్లి విద్యార్థుల సంతకాలు సేకరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు రెండు రోజుల దీక్ష చేశారు. దానికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులను తరలించారు. అలాగే.. జీఓ 97 కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి బీజేపీ మద్దతు తెలిపింది. వారిని కలిసేందుకు వెళ్ళాలనుకున్న రామచందర్రావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే… ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వింగ్లో జరిగిన కార్యక్రమం లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. యువ క్రీడాకారులు, విద్యార్థులు పార్టిసిపేట్ చేసిన ఖేలో ఇండియాకు అటెండ్ అయ్యారాయన. ఈ రకంగా… రకరకాల కార్యక్రమాలతో… జెన్ జీకి దగ్గరగా ఉండేందుకు కాషాయ లీడర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీ పట్ల ఆ తరంలో వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని పెద్దగా పట్టించుకోని కొందరు నాయకులు కూడా… ఇప్పుడు వాటిని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటున్నారట. సోషల్ వీధుల్లో ఎప్పుడూ కనిపించని కాషాయ లీడర్స్ కొందరు ఇప్పుడు పోస్ట్లు పెడుతుండటంతో… కుర్రోళ్ళ దెబ్బ బాగానే కనిపిస్తోందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. బీజేపీ యువ ఆలోచనల్ని ఆ వర్గం ఎంత వరకు రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!