Off The Record: ఎమ్మెల్యే మాధవి టీడీపీ నేతలపై రివెంజ్ తీర్చుకుంటున్నారా?
- నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి..
- ఎన్నికల టైంలో సహకరించని కొందరు టీడీపీ నాయకులు..
- ఎమ్మెల్యే గుర్తు పెట్టుకుని రివెంజ్ తీర్చుకుంటున్నారా?..
- అధికారులు కూడా టీడీపీ వాళ్ళకు సహకరించడం లేదా?..
- ఎమ్మెల్యే మీద చంద్రబాబుకు నెల్లిమర్ల టీడీపీ నేతల ఫిర్యాదు..
- తర్వాత తన వాదనను గట్టిగా వినిపించిన నాగ మాధవి..
- రివర్స్లో టీడీపీ నాయకులకు చంద్రబాబు క్లాస్..
- పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా కొందరు టీడీపీ లీడర్స్?..
- కేడర్ ప్రశ్నిస్తుందని ముఖం చాటేస్తున్నారా? ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఒకప్పటి కంచుకోట నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది టీడీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అభ్యర్థి ఎవరన్న దాంతో సంబంధం లేకుండా పార్టీ గుర్తుకు ఓటేసే నియోజకవర్గం ఇది అని టీడీపీ పెద్దలు సైతం అంగీకరిస్తారు. కానీ… గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇది జనసేన కోటాలోకి వెళ్ళడంతో….కూటమి వేవ్లో లోకం మాధవికి ఛాన్స్ దక్కింది. ఎన్నికల సమయంలో స్థానిక టీడీపీ నాయకులు కొందరు మాధవికి సహకరించలేదని, అది గుర్తు పెట్టుకుని మరీ… ఆమె ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే… అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కూడా టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఏ చిన్న పని అయినా ఎమ్మెల్యే అనుమతి లేకుండా అధికారులు ముందుకు రావడం లేదని, తెలుగుదేశం నాయకులు పనుల కోసం వెళ్ళినా ఎమ్మెల్యే పర్మిషన్ తెచ్చుకోమని చెప్పడం అవమానంగా ఉంటోందని వాపోతున్నారట.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు స్థానిక టీడీపీ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్యను చెప్పుకున్నారు. ఎమ్మెల్యే నాగమాధవి తమను పట్టించుకోవడం లేదని, పార్టీ నాయకులకు ప్రభుత్వ పనులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారట. అంతేకాకుండా ఇటీవల జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే ట్రయల్ రన్కు తనకు అనుకూలంగా ఉండే వారిని మాత్రమే ఎంపిక చేసి తీసుకువెళ్లారంటూ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారట. ఎమ్మెల్యే భర్త వ్యవహార శైలి కూడా పార్టీకి ఇబ్బందిగా మారిందని వారు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. ఫిర్యాదు చేయడం వరకు బాగానే ఉన్నా… ఆ తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం లోకల్ టీడీపీ లీడర్స్కు షాకిచ్చినట్టు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యే నాగమాధవి కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ వైపు నుంచి వాదన వినిపించినట్టు తెలిసింది. నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు అస్సలు సహకరించడం లేదని, తాను ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే అక్కడ సమస్యలు సృష్టిస్తున్నారంటూ రివర్స్ కంప్లయింట్ ఇచ్చినట్టు తెలిసింది. ఇటీవల బియ్యం పంపిణీ కార్యక్రమంలో కూడా కావాలనే మత్స్యకారులను రెచ్చగొట్టారంటూ ఆధారాలు చూపించినట్టు తెలుస్తోంది.
Also Read
అభివృద్ధి పనుల్లో వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కొందరు నాయకులు అధికారులను నేరుగా ప్రభావితం చేసి పనులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా వివరించినట్లు సమాచారం. అదంతా విన్న ముఖ్యమంత్రి రివర్స్లో స్థానిక టీడీపీ నాయకులకే క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం నెల్లిమర్లలో జోరుగా జరుగుతోంది. కూటమి ధర్మానికి కట్టుబడి ఎన్నికలటైంలో నానా కష్టాలుపడి గెలిపించుకున్న నాయకురాలు ఇప్పుడు తమకే ఎసరు పెడుతున్నారంటూ అసంతృప్తిగా ఉన్నారట కొందరు నెల్లిమర్ల టీడీపీ నాయకులు. ఈ పరిస్థితుల్లో కొందరు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని సమాచారం. సమావేశాలకు హాజరైతే…. అమరావతి చర్చల గురించి ఎవరైనా అడుగుతారేమోనన్న అవమానభారంతో ముఖం చాటేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ఒకప్పటి కంచుకోటలో తీరు మారకుంటే టీడీపీ ఆటోమేటిగ్గా బలహీనపడే ప్రమాదం ఉందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?