Off The Record: కడప కార్పొరేషన్లో ఏం జరుగుతోంది..? వారి ఒతిళ్లతో ఉద్యోగులు బలి?
- సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ పాలకమండలి..
- ఎవరి మాట వినాలో తెలియని గందరగోళం..
- అడ్వాంటేజ్ తీసుకుని పని ఎగ్గొడుతున్న కొందరు..
- 23మంది సచివాలయ కార్యదర్శులు సస్పెండ్..
- 15 మంది కార్పొరేషన్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు..
- రాజకీయ వత్తిళ్ళు ఉండవచ్చన్న టాక్..
- నెలవారీ మామూళ్ళకు కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి ముగిసేసరికి మరొకటిగా పెరుగుతున్న వివాదాలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు కూడా బలి పశువులు అవుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేది ఒక పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానిది మరో పార్టీ కావడంతో…. వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మాకు శాపంగా మారాయని అంటున్నారు సిబ్బంది. ఒకరు పని చేయమంటే మరొకరు వద్దంటున్నారని, ఎవరి మాట వినాలో తెలియక గందరగోళంలో ఉన్నామని అంటున్నారట. కొందరైతే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని డ్యూటీలకు డుమ్మా కొడుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మున్సిపల్ కమిషనర్కు చిరాకు తెప్పిస్తోందట.ఇక సచివాలయ ఉద్యోగులు అయితే తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఉంటున్నారట. పర్మిషన్ లేకుండా సెలవులు పెట్టడం, అసలు కనీస సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టడం లాంటి పనులు చేస్తున్నట్టు తెలిసింది.
మరీ… ఓవరైపోతున్నారనుకున్న వారి మీద ఆగ్రహించిన కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి… 23 మంది సచివాలయ కార్యదర్శుల్ని సస్పెండ్ చేశారు. అలాగే కార్పొరేషన్ ఆఫీస్లోని పలు విభాగాల్లో విధులు సక్రమంగా నిర్వహించలేదంటూ 15 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇలా… ఇంత భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని మాట్లాడుకుంటున్నారు మున్సిపల్ ఎంప్లాయిస్. ఇది కేవలం తమ మీద కోపం ఒక్కటే కాదని, రాజకీయ ఒత్తిళ్లు కూడా పని చేసి ఉండవచ్చని గుసగుసలాడుకుంటున్నారట.
కడప కార్పొరేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే మాధవికి వేదికపై కుర్చీ వేకపోవడంతోనే వివాదం మొదలైందని, దీంతో ఆమె కార్పొరేషన్ ను టార్గెట్ చేశారని అనుకుంటున్నారట. ఎమ్మెల్యేకు సహకరిస్తే వేటు వేస్తామంటూ కార్పొరేషన్ పాలకవర్గం పరోక్షంగా అధికారులను హెచ్చరిస్తోందని చెప్పుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తమకు నెల మామూళ్ళు ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఒత్తిళ్లు తెస్తున్నట్లు కడపలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు ఇప్పించాలంటూ అధికారులను వత్తిడి చేస్తున్నారట. మాట విననివారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తున్నారని, ఇంజనీరింగ్ విభాగంలో షోకాజ్ నోటీసుల వెనక ఈ కారణాలు కూడా ఉండి ఉండవచ్చని మాట్లాడుకుంటున్నాయట ఉద్యోగ వర్గాలు. కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయకపోవడం, కొన్ని కాంట్రాక్టు పనులను రద్దు చేయకపొవడమే అధికారులు చేసిన పాపమని మాట్లాడుకుంటున్నారట. సకాలంలో గుంతలు పూడ్చడం లో విఫలమయ్యారని, తాగునీటి సరఫరా లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కమిషనర్ షోకాజ్లు ఇచ్చారు. కానీ… అసలు మేటర్ పని చేయకపోవడం కాదని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఇప్పించకపోవడమేనని మున్సిపల్ సిబ్బంది గుసగుసలాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ దెబ్బకు అసలు కాంట్రాక్టర్స్ కూడా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. ఇలా…. రెండు పార్టీల మధ్య విభేదాలు ఇప్పుడు తమ ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించాయనిఎంప్లాయిస్ మధనపడుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కుర్చీ గోల….కడప మున్సిపాలిటీలో జీడిపాకం సీరియల్లా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?