Off The Record: సీఎం కత్తికి పదునుపెట్టి యాక్షన్లోకి దిగారా?.. వివాదాస్పద ఎమ్మెల్యేలకు పవర్ కట్స్..?
- చంద్రబాబు పదేపదే చెబుతున్నా మారని కొందరు ఎమ్మెల్యేలు..
- సీఎం కత్తికి పదునుపెట్టి యాక్షన్లోకి దిగారా?..
- ఎమ్మెల్యేలకు తెలియకుండానే పవర్ కటింగ్స్ జరుగుతున్నాయా?..
- ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండానే మండల కమిటీలు..
- కొత్త ఇన్ఛార్జ్ మాటే చెల్లుబాటయ్యేలా ఆదేశాలు..
- ఇన్ఛార్జ్కే ప్రాధాన్యం ఇవ్వమని ఆఫీసర్స్కు అనధికారిక సమాచారం?..
- ఎమ్మెల్యేల మీద నిఘా కోసం స్పెషల్ టాస్క్ఫోర్స్..
- 20మంది టీడీపీ ఎమ్మెల్యేలు బాగా డేంజర్ జోన్లో ఉన్నారా?..
- ఇప్పటికైనా మారితే ఓకే, లేదంటే గట్టి చర్యలేనా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఎమ్మెల్యేలూ…. మీరు మారాలి. పనితీరు మార్చుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ శాసనసభ్యులతో పదే పదే చెబుతున్న మాటలివి. కొందరికి జనరల్గా చెప్పారు. ఇంకొందర్ని ప్రత్యేకంగా పిలిపించి క్లాస్ పీకారు. మీరు మారకుంటే… నేను మారిపోతానని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. అయితే… అంత చెప్పినా ఇప్పటికీ ఇంకొందరిలో మార్పు రాలేదట. ఆ…. ఏముందిలే…. ఆయన అలాగే చెబుతుంటారు. మనం చేసేవి చేసుకుంటూ పోదామని భావిస్తున్న ఎమ్మెల్యేలకు ఇప్పడిక షాకులివ్వడం మొదలైపోయిందట. నేను 95 సీఎంని అవుతానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిజంగానే… యాక్షన్లోకి దిగినట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. బోర్డర్లైన్ దాటుతున్న వారికి ఇప్పటి వరకు మాటలతోనే సరిపెట్టిన టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడిక కత్తికి పదును పెడుతున్నారట. ఆ దెబ్బకు కొంతమంది ఎమ్మెల్యేల పవర్ కట్ అవుతోందని, కొందరికి ఆ విషయం తెలియకుండానే కత్తిరింపులు జరిగిపోతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు పార్టీ లీడర్స్. పార్టీ శాసనసభ్యులు పెడసరంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయిపోయిందట. అలాంటి చోట్ల ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే టీడీపీ మండల కమిటీల్ని నియమించేస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే ప్రతి విషయంలోనూ సదరు శాసనసభ్యుడిని నామమాత్రం చేసే కార్యక్రమం కూడా గట్టిగానే జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇక మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్… అన్నట్టు కామ్గా జరిగిపోతున్న ఈ వ్యవహారాలతో ఎమ్మెల్యే పవర్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుందని, కేకలు పెట్టాల్సిన అవసరం లేదని మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. కృష్ణా జిల్లాలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఇప్పటికే పవర్ కట్ మొదలయిందట. కమిటీ నియామకంలో ఆయన మాట చెల్లుబాటవకపోవడం, వేరే ఇన్ఛార్జ్ని నియమించడం, నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ చెప్పిన మాట చెల్లుబాటు అయ్యేలా చూడడం లాంటి కార్యక్రమాలతో మాట వినని వాళ్ళని ఉత్స విగ్రహాల్లాగే మిగల్చబోతున్నట్టు సమాచారం. అలాగే… అధికార వర్గాల్లో సైతం ఆ ఎమ్మెల్యే మాట చెల్లుబాటవకుండా, ఇన్ఛార్జ్ మాట మాత్రమే ఆఫీసర్స్ వినేలా అనధికారిక ఆదేశాలు సైతం ఉంటాయట. ఇన్ని చర్యలు తీసుకున్నా…. దారికి రానివారి విషయంలో చర్యలు ఇంకొంచెం ఎక్కువగానే ఉండవచ్చన్నది టీడీపీ వర్గాల టాక్. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై రోజు వారీ నివేదికలు సిద్ధమవుతున్నాయి. అందుకోసం ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటైందట.దాంతో పాటు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా పని చేస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు ఎవరెవరు అవినీతి కార్యక్రమాల్లో బాగా…. బిజీగా ఉన్నారు. ఎవరు మాఫియాలు నడుపుతున్నారన్న వాటికి సంబంధించి పార్టీ పెద్దల దగ్గర డిటైల్డ్ రిపోర్ట్స్ ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
ఇక మాటల పార్ట్ అయిపోయిందని, పదే పదే చెప్పడం కన్నా… నివేదికల ఆధారంగా యాక్షన్లోకి దిగడం మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిగా… మరీ అడ్డగోలు వ్యవహారాల్లో మునిగి తేలుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే… మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అవుతారని, అలా అవ్వని వాళ్ళను ఉపేక్షించకుండా నెక్స్ట్ లెవల్లో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు విపరీతమైన దందాల్లో మునిగి తేలుతున్నారన్నారన్న నివేదికలతో వాళ్ళని రెడ్ జోన్లో పెట్టి యాక్షన్ మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. చర్యల దిశగా ఇస్తున్న లీకులు, జరుగుతున్న చర్చలతోనైనా డేంజర్ జోన్లోని వాళ్ళు మారతారా? లేక అలాగే ఉండిపోతారా అన్న పరీక్ష ప్రస్తుతం జరుగుతోందట. ఈ టెస్ట్లో పాసైన వాళ్ళ మీద యాక్షన్ ఆగుతుందని, లైట్ తీసుకున్నవాళ్ళ మీద నెక్స్ట్ లెవల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేల్ని ఇలాగే ఉపేక్షిస్తే… మొత్తం ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చి మొదటికే మోసం జరుగుతుందని గ్రహించిన సీఎం…పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారన్నది టీడీపీ వాయిస్.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!