Nalgonda Politics : ఆ మాజీ ఎమ్మెల్యే వేషాలు మరోలా ఉన్నాయా..? అసలు జరుగుతుంది ఏంటి. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Politics:
ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికారపార్టీ నేత. గత ఎన్నికల్లో ఓడినా నియోజవర్గానికి ఆయన్ని పార్టీ ఇంఛార్జ్ను చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పాగా వేయాలని పార్టీ చూస్తుంటే.. అయ్యవారి వేషాలు మరోలా ఉన్నాయట. సమస్య ముదురు పాకాన పడి.. డేంజర్ బెల్స్ మోగిస్తోందట. దీంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందట అధిష్ఠానం. అదెక్కడో.. ఏం జరుగుతుందో లెట్స్ వాచ్..!
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో 11 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. ఒక్క మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడును కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్. ఈ విషయంలో అధికారపార్టీ పెద్దలు ఒకటి తలిస్తే.. స్థానికంగా జరుగుతున్న పరిణామాలు అస్సలు మింగుడు పడటం లేదట. మునుగోడు టీఆర్ఎస్ ఇంఛార్జ్గా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత వైఫల్యాలను అధిగమించి.. పార్టీ బలోపేతానికి కూసుకుంట్ల కృషి చేస్తారని పార్టీ భావిస్తే.. అక్కడ మూడు గ్రూపులు.. ఆరు పంచాయితీలు అన్నట్టు మారిపోయిందని పార్టీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయట.
మునుగోడులో ప్రత్యర్థి పార్టీలతో పోరాటం కంటే.. టీఆర్ఎస్లోని నేతల మధ్యే గొడవలు ఎక్కువ. ఇందులోనూ కూసుకుంట్ల ప్రత్యేకత ఉందట. ఆయనే గ్రూపులను ప్రోత్సహిస్తూ.. వారి మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారని గులాబీ శ్రేణులు ఆరోపణ. సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు మునుగోడులో ఉద్యమకారులు.. సీనియర్ నాయకులు టీఆర్ఎస్కు అండగా ఉండేవారు. పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో వాళ్లంతా పార్టీకి దూరమయ్యారట. 2018 ఓటమికి దారితీసిన పరిస్థితులు.. సమస్యలు ముదురు పాకాన పడినట్టు టాక్. స్థానికంగా టీఆర్ఎస్లో ఎవరు అసంతృప్తితో ఉన్నారో.. ఎవరు పార్టీకి దూరంగా ఉన్నారో తెలిసినా వారితో కూసుకుంట్ల చర్చలు జరపకపోవడం సమస్యను మరింత దిగజారుస్తున్నట్టు చెబుతున్నారు.
మునుగోడులో పార్టీని గాడిలో పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రి జగదీశ్వర్రెడ్డి నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించి.. అసంతృప్తులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు స్వింగ్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రతికూల వాతావరణాన్ని సెట్ చేసేందుకు ఆయన ప్రయత్నించారట. అయితే కూసుకుంట్ల వైఖరి వల్ల సమస్య మళ్లీ మొదటి రావడంతో మంత్రి ఇతర పార్టీ నేతలు కంగుతిన్నట్టు సమాచారం. దాంతో మునుగోడు నియోజకవర్గంలోని గ్రామస్థాయి ప్రజాప్రతనిధులతో మంత్రి సమావేశం నిర్వహించారట. ప్రజాప్రతినిధులంతా కూసుకుంట్ల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఏకరవు పెట్టారట. ఆ సమయంలో కూసుకుంట్ల అక్కడే ఉన్నప్పటికీ సమస్య చెప్పడానికి వెనకాడ లేదట పార్టీ నేతలు.
వాస్తవ పరిస్థితులను పార్టీ పెద్దలకు నివేదించాలని.. సమస్యపై సీరియస్గానే ఫోకస్ పెట్టాలనే అభిప్రాయానికి వచ్చారట మంత్రి. మొత్తంగా మునుగోడులో పార్టీ పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్లమీద పడినట్టుగా తయారైందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఎన్నికల మూడ్లోకి వెళ్తున్న సమయంలో మునుగోడులో టీఆర్ఎస్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!